అన్వేషించండి

Chandrababu Yagam: చంద్రబాబు నివాసంలో ముగిసిన రాజశ్యామల యాగం, విజయం తథ్యమన్న పండితులు

Chandrababu Raja Symala Yaagam: చంద్రబాబు నివాసంలో మూడురోజులుగా సాగుతున్న రాజశ్యామల యాగం పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసింది. విజయలక్ష్మీ వరించేందుకే యాగం నిర్వహించారు.

Chandrababu NEWS: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో మూడురోజులుగా సాగుతున్న రాజశ్యామల(Raja Symala Yagam) యాగం దిగ్విజయంగా ముగిసింది. శుక్రవారం నుంచి నిర్విరామంగా యాగం జరుగుతోంది. గుంటూరుకు చెందిన వేదపండితులు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో  వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 50 మంది రుత్వికుల సమక్షంలో యాగం నిర్వహించారు. చంద్రబాబు దంపతులతో వివిధ పూజా క్రతువులు నిర్వహించారు. మూడోరోజు పూర్ణాహుతి కార్యక్రంతో యాగం పరిసమాప్తమైంది. ఈయాగంలో తెలుగుదేశం(TDP) నేతలతోపాటు  చంద్రబాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 

ప్రజల క్షేమం కోసమే
చంద్రబాబు(Chandrababu) నివాసంలో మూడురోజులపాటు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన రాజశ్యామల యాగం ముగిసింది. శుక్రవారం తొలిరోజు చంద్రబాబు దంపతులు యాగక్రతవులో పాల్గొన్నారు. ప్రజలందరికీ మేలు జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సంద ర్భంగా చంద్రబాబు-భువనేశ్వరి హోమాలు నిర్వహించారు. రెండు, మూడురోజుల్లోనూ  వివిధ క్రతువులు నిర్వహించారు, గతేడాది డిసెంబర్ లోనూ చంద్రబాబు నివాసంలో చండీయాగం, సుదర్శన నారిసింహా హోమం నిర్వహించారు. ప్రజాక్షేమం కోసమే యాగాలు నిర్వహిస్తున్నట్లు రాజకీయ నేతలు చెబుతున్నా పురాణాల ప్రకారం చూస్తే రాజ్యలక్ష్మీ వరించడంతోపాటు  శత్రువులు క్షీణించి సార్వభౌమాధికారం శాశ్వతంగా ఉండేందుకు రాజులు ఇలాంటి యాగాలు నిర్వహించేవారు. శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజుతో రాజసూయ యాగం చేయిస్తాడని పురాణా గాథలు చెబుతున్నాయి.అయితే రాజసూయ యాగం చేయడం చాలా పెద్ద క్రతువు కాబట్టి..దానికి ప్రతీగా రాజశ్యామల(Rajasyamala Yagam) యాగం నిర్వహిస్తున్నారు.

చంద్రబాబు నివాసంలో యాగ నిర్వహణలో దాదాపు 50 మంది రుత్వికులు పాల్గొన్నారు. రాజశ్యామల యాగంలో భాగంగా మూడు రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహించారు.  ఈ రాజ శ్యామల యాగాన్ని విజయాన్ని అందుకోవాలని, శత్రువులు క్షీణించాలని, రాజ్యలక్ష్మి శాశ్వతంగా ఉండాలని నిర్వహిస్తారు. విజయం సిద్ధించేలా చేయమని శ్యామలాదేవిని అంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి యాగాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఎన్నికల ముందు ఈ యాగం నిర్వహించడం ప్రత్యర్థులను బలహీనపరిచేందుకేనని పండితులు తెలుపుతున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో, నిష్ట నియమాలతో నిర్వహించిన ఈయాగం పూర్ణాహుతి కార్యక్రమంతో దిగ్విజయంగా ముగిసింది. చంద్రబాబు అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారని...విజయలక్ష్మీ ఆయన్ను వరించడం ఖాయమని అన్నారు. యాగ ప్రభావం కొన్ని నెలలపాటు ఆయనపై ఉంటుందని పండితులు వెల్లడించారు.

రాజకీయ యాగాలు
ఇలాంటి యాగాలు నిర్వహించడలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ముందుంటారు. కేసీఆర్ ఎన్నికలతో పాటు ఏ ముఖ్యమైన పని చేయాలనుకున్నా యాగం నిర్వహిస్తారు. గతంలో భారీగా యాగశాల నిర్మించి పెద్దఎత్తున రాజశ్యామల యాగం నిర్వహించారు. ఇటీవల ఎన్నికల ముందు కూడా ఆయన ఫాంహౌస్ లో శారదాపీఠాధిపతి స్వరూపానంద సమక్షంలో రాజశ్యామల యాగం నిర్వహించారు. కానీ ఆయన యాగం ఫలితాన్నివ్వలేదు.అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సైతం కొడంగల్ లో రాజశ్యామల యాగం నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించడం విశేషం. ఇక ఏపీలో సీఎం జగన్(Jagan) సైతం హోమాలు నిర్వహించారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ కోసం స్వరూపానంద దాదాపుగా ఏడాది పాటు ఓ ప్రదేశంలో యాగం చేశారు. జగన్ కూడా ఆ యాగానికి వెళ్లారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Best Mileage Cars: మారుతి విటారా నుండి హోండా వరకు! భారత్‌లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే
మారుతి విటారా నుండి హోండా వరకు! భారత్‌లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే
US Iran War Updates: పశ్చిమాసియాకు భారీగా చేరుకున్న అమెరికా సైన్యం.. ఏ క్షణంలోనైనా ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్ ?
పశ్చిమాసియాకు భారీగా చేరుకున్న అమెరికా సైన్యం.. ఏ క్షణంలోనైనా ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్ ?
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Samuthirakani: క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
War Crimes: ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
Embed widget