అన్వేషించండి

Bharat Jodo Yatra: మాది ఫాసిస్ట్ పార్టీ కాదు, ఎలా పని చేయాలన్న స్పష్టత మాకుంది - రాహుల్ గాంధీ

Bharat Jodo Yatra: కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్నికలపై రాహుల్ గాంధీ స్పందించారు.

Bharat Jodo Yatra: 

రిమోట్ కంట్రోల్ వ్యాఖ్యలపై స్పందన..

కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా...వారికి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే సానుకూల వాతావరణం తప్పక ఉంటుందని రాహుల్ గాంధీ అన్నారు. కర్ణాటకలో భారత్ జోడో యాత్రలో ఉన్న ఆయన...మీడియాతో సమావేశమైన సమయంలో పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ అధిష్ఠానం చేతిలో "రిమోట్ కంట్రోల్" అనే కామెంట్స్‌పై ఈ విధంగా స్పందించారు. "కాంగ్రెస్ అధ్యక్ష పదవి
కోసం పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులూ సమర్థులే. ఎవరికి వాళ్లు ఈ పోటీకి అర్హులే. వారిలో ఎవరినైనా సరే రిమోట్ కంట్రోల్ అని పిలవటం అంటే వారిని దారుణంగా అవమానించినట్టే" అని స్పష్టం చేశారు. దాదాపు 22 ఏళ్ల తరవాత కాంగ్రెస్‌కు అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అక్టోబర్ 17న ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. పోటీలో శశిథరూర్, మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు. అయితే...ఖర్గే ఎన్నిక లాంఛనమేనని పార్టీ
వర్గాలు చెబుతున్నాయి. దీనిపై...రాహుల్ గాంధీ పూర్తిస్థాయిలో స్పందించటం ఇదే తొలిసారి. "మాది ఫాసిస్ట్ పార్టీ కాదు. మేం చర్చల్ని ఆహ్వానిస్తాం. విభిన్న అభిప్రాయాలకు గౌరవమిస్తాం. ఎన్నికల్లో గెలవాలంటే సమష్టిగా పని చేయాలన్న స్పష్టత మాకుంది" అని రాహుల్ వెల్లడించారు. "అన్ని రాష్ట్రాలు కలిసుంటేనే అది భారత్ అని రాజ్యాంగమే చెబుతోంది. అంటే...భిన్న సంస్కృతులు, రాష్ట్రాలు, సంప్రదా యాలకు సమానమైన ప్రాధాన్యత దక్కాలి. అదే మన దేశం తీరు కూడా. అలా కాకుండా హింసను, ద్వేషాన్ని వ్యాప్తి చేస్తే...అది జాతివ్యతిరేక చర్య అని ఖండించాలి. ఎవరు ద్వేషాన్ని వ్యాప్తి చేసినా...వారిపై మా పోరాటం కొనసాగుతుంది" అని చెప్పారు. 

కర్ణాటకలో జోరుగా యాత్ర..

భాజపాను టార్గెట్ చేస్తూ మరి కొన్ని కామెంట్స్ చేశారు రాహుల్. "భాజపా ఉద్దేశపూర్వకంగానే దేశాన్ని విభజిస్తోంది. ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోంది. ఇవి దేశానికి ఏ మాత్రం ఉపకరించవు. అందుకే..మేము భారత్ జోడో యాత్ర చేస్తున్నాం. మరో విషయం ఏంటంటే..ఈ యాత్ర నేను మాత్రమే కాదు...నాతో పాటు లక్షలాది మంది చేస్తున్నారు" అని అన్నారు. దసరా కారణంగా మధ్యలో రెండు, మూడు రోజులు విరామమిచ్చి మళ్లీ యాత్ర మొదలు పెట్టారు. కర్ణాటక రాష్ట్రంలో రాహుల్‌తో పాటు సోనియా గాంధీ కూడా పర్యటిస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో పాటు భాజపా ఇక్కడ అధికారంలో ఉండటం వల్ల కాంగ్రెస్ ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించింది. చాలా రోజుల తరవాత ఆమె ఓ బహిరంగ సభలోనూ పాల్గొన్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా...పార్టీ కార్యక్రమాలకు కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు సోనియా. కర్ణాటకలో మాండ్య నుంచి పాదయాత్ర మొదలు కాగా...రాహుల్‌, సోనియా ఇందులో పాల్గొని పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. బళ్లారిలో ఓ భారీ ర్యాలీ చేపడతారని, అందులోనూ సోనియా పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భారత్‌ జోడో యాత్రలో చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు రాహుల్ గాంధీ. పార్టీలో ఉత్తేజం నింపేందుకు ఆయన గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవలే కేరళలో యాత్రను ముగించుకున్న రాహుల్...ఇప్పుడు కర్ణాటకలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. గతంలో కాన్నా కాస్త అగ్రెసివ్‌గానే మాట్లాడుతున్నారు.

Also Read: Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కి పశువుల గండం, ఈ సారి ఆవుని ఢీకొట్టిన ట్రైన్ - మళ్లీ డ్యామేజ్

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget