అన్వేషించండి

లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమైన కాంగ్రెస్, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రచారం మొదలు

Congress Foundation Day: కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే శుభాకాంక్షలు తెలిపారు.

Congress 139th Foundation Day:


పార్టీ ఆవిర్భావ దినోత్సవం..

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి (Lok Sabha Election 2024) సిద్ధమవుతోంది కాంగ్రెస్. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇవాళ్టి నుంచి (డిసెంబర్ 28) ప్రచారం మొదలు పెట్టనుంది. పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...'Hain Tayyar Hum' పేరిట మెగా ర్యాలీ ప్రారంభించనుంది. దేశ చరిత్రలోనే ఇదో కీలక అధ్యాయం అంటూ ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ ఈ ర్యాలీలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఢిల్లీలోని AICC హెడ్‌క్వార్టర్స్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ (Congress Foundation Day) వేడుకలు నిర్వహించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఖర్గే పార్టీ జెండాని ఆవిష్కరించి అందరికీ అభినందనలు తెలిపారు. అంతకు ముందు X వేదికగా రాహుల్, ఖర్గే శుభాకాంక్షలు చెప్పారు.

"కాంగ్రెస్ పార్టీకి నిజం, అహింసే పునాదులు. ప్రేమ, గౌరవం, సమానత్వం మూల స్తంభాలు. దేశభక్తిని రగిలించే ఇలాంటి సంస్థలో నేను ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. ఈ సందర్భంగా పార్టీ నేతలకు, కార్యకర్తలకు, మద్దతుదారులందరికీ నా శుభాకాంక్షలు"

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత

మల్లికార్జున్ ఖర్గే కూడా X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ప్రజాసంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమని, భారత్‌ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని తేల్చి చెప్పారు. 

"ప్రజా సంక్షేమం అందించాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ పుట్టింది. భారత్‌ పట్ల మాకెంతో గౌరవముంది. ఈ ప్రజాస్వామ్యంపైనా మాకు నమ్మకముంది. రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలనేదే మా లక్ష్యం. ఇలాంటి భారత్‌ని నిర్మించేందుకు మేం 138 సంవత్సరాలుగా కష్టపడుతూనే ఉన్నాం. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేతలందరికీ శుభాకాంక్షలు"

- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 

వచ్చే ఏడాది జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ రెండో దశ జోడో యాత్ర ప్రారంభించనున్నారు. ఈ సారి ఈ యాత్రకు "భారత్ న్యాయ్ యాత్ర" అనే పేరు పెట్టారు. మణిపూర్ నుంచి ముంబయి వరకూ రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. మొత్తం 14 రాష్ట్రాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. మార్చి 20న యాత్ర ముగియనుంది. 6,200 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన చేశారు.

Also Read: Guna Bus Accident: ట్రక్‌ని ఢీకొట్టిన బస్సు, చెలరేగిన మంటలు - 13 మంది సజీవదహనం

టాప్ హెడ్ లైన్స్

Sri Lanka Death Sentence: శ్రీలంక మాజీ పోలీస్ చీఫ్, డిఫెన్స్ సెక్రటరీకి మరణశిక్ష - బాంబు దాడులను ఆపలేకపోవడమే కారణం!
శ్రీలంక మాజీ పోలీస్ చీఫ్, డిఫెన్స్ సెక్రటరీకి మరణశిక్ష - బాంబు దాడులను ఆపలేకపోవడమే కారణం!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Breaking News: ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌వే భోగాపురం ఎయిర్ పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌వే భోగాపురం ఎయిర్ పోర్ట్: ప్రధాని మోదీ

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Embed widget