అన్వేషించండి

Raghurama : పండగ రోజుల్లో విచారణకు నోటీసులా.. సీఐడీ సునీల్‌పై రఘురామ ఘాటు విమర్శ !

పండుగ రోజుల్లో విచారణకు రావాలని సీఐడీ నోటీసులు ఇవ్వడంపై రఘురామ మండిపడ్డారు. సీఐడీ సునీల్ ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. చట్టాన్ని తాను గౌరవించి విచారణకు హాజరవుతానన్నారు.

ఇన్ని రోజులు పట్టించుకోకుండా పండుగ రోజుల్లో విచారణకు రమ్మని నోటీసులు ఇవ్వడం ఏమిటని వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ సీఐడీ అధికారులపై మండిపడ్డారు. గతంలో ప్రభుత్వంపై కుట్ర పూరితంగా విమర్శలు చేస్తున్నారని ఏపీసీఐడీ సుమోటోగా కేసు నమోదు చేసి రాజద్రోహం కేసు పెట్టింది. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. ఆ తర్వాత ఎప్పుడూ విచారణకు రావాలని సీఐడీ నోటీసులు ఇవ్వలేదు. బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆయన ఇంటికి నలుగురు సీఐడీ అధికారుల బృందం వచ్చి.. గురువారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఇవాళ నోటీసులు ఇచ్చి ... రేపే విచారణ కావాలని హాజరు కావాలని అడగడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీంతో  17వ తేదీన విచారణకు రావాలని చెప్పారని రఘురామకృష్ణరాజు మీడియాకు చెప్పారు. 

Also Read: ఎంపీ రఘురామ ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు.. Hydలోని ఇంటి ఎదుట హడావుడి

సీఐడీ నోటీసులు ఇచ్చిన తర్వాత రఘురామ మీడియాతో మాట్లాడుతూ తీవ్రమైన ఆరోపణలు చేశారు.  సీఐడీ అధికారి సునీల్ ఒక ఉన్మాది అని అని మండిపడ్డారు. సంక్రాంతి పండుగలకు తాను భీమవరం వెళ్తున్నానని తెలిసి నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇదంతా చూసి ముఖ్యమంత్రి జగన్ ఆనంద పడుతున్నారని ఎంపీ రఘురామకృష్ణం రాజు విమర్శించారు. తాను రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తినని.. చట్టాన్ని గౌరవిస్తూ విచారణకు హాజరవుతానన్నారు. సీఐడీ వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉందని.. వారి తీరుపై ఎంక్వైరీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు .

Also Read: ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా... నర్సాపురం వెళ్తున్నా రెండు రోజులు అక్కడే ఉంటా... ఎంపీ రఘురామ

గతంలో అరెస్ట్ చేసే సమయంలో సీసీటీవీ కెమెరాలు లేకుండా చేశారు.. నా సిబ్బందిపై, నా పై వ్యక్తిగతంగా దాడి చేశారని సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన వివరాలు సమర్పించానని  రఘురామ ప్రకటించారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ అనేది లేదన్నారు. రావణ రాజ్యంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని విమర్శించారు. తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని.. గెలిచిన సీటులోనే మళ్లీ పోటీ చేస్తానన్నారు. ఏపీ ప్రభుత్వం వద్ద రోడ్లు వేయడానికి కూడాడబ్బుల్లేవన్నారు. 

Also Read: త్వరలో ఎంపీ పదవికి రఘురామ రాజీనామా ... అమరావతి ఎజెండాతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం !

నర్సాపురం నుంచి వైఎస్ఆర్‌సీపీ తరపున గెలిచిన రఘురామకృష్ణరాజు తర్వాత ఆ పార్టీకి వ్యతిరేకంగా మారారు. విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై ఏపీ ప్రభుత్వం రాజద్రోహం కేసు పెట్టి అరెస్టు కూడా చేసింది. అయినా ఆయన విమర్శలు కొనసాగిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందన్న కారణంమగా చాలా రోజులుగా ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత సంక్రాంతి సందర్భంగా ఆయన నర్సాపురం వెళ్తున్నారు. 

Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
తక్కువ ధరలో టాటా హారియర్ ఈవీ AWD వేరియంట్: ఫియర్ లెస్+ QWD 75 లాంచ్, ఫీచర్లు ఇవే!
తక్కువ ధరలో టాటా హారియర్ ఈవీ AWD వేరియంట్: ఫియర్ లెస్+ QWD 75 లాంచ్, ఫీచర్లు ఇవే!
Automatic Climate Control: ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అంటే ఏంటీ? ఈ ఫీచర్‌‌తో 10 లక్షల లోపు బెస్ట్ కార్లు ఇవే
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అంటే ఏంటీ? ఈ ఫీచర్‌‌తో 10 లక్షల లోపు బెస్ట్ కార్లు ఇవే
RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget