By: ABP Desam | Updated at : 01 Aug 2021 12:39 PM (IST)
కాందహార్ విమానాశ్రంపై రాకెట్ల దాడి
అఫ్గానిస్థాన్లోని కాందహార్ అంతర్జాతీయ విమానాశ్రయంపై శనివారం రాత్రి వరుస రాకెట్ల దాడి జరిగింది. ఈ దాడి ఘటనను విమానాశ్రయ చీఫ్ మసూద్ పష్తూన్ ధ్రువీకరించారు. రెండు రాకెట్లు రన్వేను తాకాయన్నారు. దీంతో విమాన సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయని చెప్పారు. రన్వేను బాగుచేసే పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.
అమెరికా, నాటో బలగాల నిష్క్రమణ తర్వాత అఫ్గాన్లోని చాలా ప్రాంతాలను తాలిబన్లు తమ ఆధీనంలో తీసుకున్నారు. ఇప్పటికి 80 శాతం భూభాగం వారి చేతుల్లోనే ఉంది. దేశ దక్షిణ ప్రాంతంలో కీలక ప్రాంతమైన కాందహార్ ఆక్రమణకు గత కొన్ని వారాలుగా తాలిబన్లు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ క్రమంలో అఫ్గాన్ సైన్యానికి, తాలిబన్లకు మధ్య భీకర పోరు జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది తాలిబన్ మిలిటెంట్లు నగరంలోకి ప్రవేశించినట్లు సమాచారం. తాలిబన్లపై దాడికి కాందహార్ విమానాశ్రయం కీలకంగా వ్యవహరిస్తుంది. కావాల్సిన లాజిస్టిక్, వాయుసేన సహకారం ఇక్కడి నుంచే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే తాలిబన్లు విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసి ఉంటారని అధికార వర్గాలు భావిస్తున్నారు. దక్షిణ ప్రాంతంలోని మరో రెండు రాష్ట్రాల రాజధానులైన హెరాత్, లష్కర్ ఘాను సైతం ఆక్రమించుకునేందుకు తాలిబన్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ నగరాల సరిహద్దులకు వారు చేరుకున్నట్లు తెలుస్తోంది.
దక్షిణ అఫ్గానిస్తాన్లోని కాందహార్ విమానాశ్రయానికి కనీసం మూడు రాకెట్లు రాత్రిపూట దాడి చేశాయని అధికార వర్గాలు తెలిపారు. తాలిబన్లు దేశవ్యాప్తంగా తమ దాడులను కొనసాగిస్తున్నారు.
"నిన్న రాత్రి ఎయిర్పోర్టుపై మూడు రాకెట్లు ప్రయోగించారు. వాటిలో రెండు రన్వేను ఢీకొన్నాయి. ఈ కారణంగా విమానాశ్రయం నుండి సేవలు తాత్కాలికంగా రద్దు చేశాము" అని ఎయిర్పోర్ట్ చీఫ్ మసౌద్ పష్తూన్ చెప్పారు. రన్వే మరమ్మతు పనులు జరుగుతున్నాయని, ఆదివారం విమానాశ్రయం సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కాబుల్ లోని సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారి రాకెట్ దాడిని ధృవీకరించారు.
తాలిబన్లు ప్రావిన్షియల్ రాజధానిని స్వాధీనం చేసుకునే అంచున ఉన్నారనే భయాన్ని రేకెత్తిస్తున్నారు. తాలిబన్లు కాందహార్ శివార్లలో కొన్ని వారాలుగా దాడులు చేస్తున్నారు. అఫ్గానిస్తాన్ రెండో అతి పెద్ద నగరాన్ని మిలిటెంట్లు దాడి నుంచి కాపాడుకోడానికి అవసరమైన లాజిస్టిక్స్, ఎయిర్ సపోర్ట్ అందించడానికి కాందహార్ ఎయిర్ బేస్ చాలా ముఖ్యమైనది. పశ్చిమాన హెరాత్, దక్షిణాన లష్కర్ గాహ్ అనే రెండు ఇతర ప్రావిన్షియల్ రాజధానులను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో ఈ విమానాశ్రయంపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. యూఎస్ మిలిటరీ ఉపసంహరణ చివరి దశలో తాలిబన్లు వరుస దాడులతో అఫ్గానిస్తాన్ లో చాలా ప్రాంతాలను అక్రమించుకున్నారు.
CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు
Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!
Nara Lokesh : రేపు విజయవాడ కోర్టుకు నారా లోకేశ్, ఆ కేసులోనే!
Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!
Breaking News Live Updates: కర్నూలు జిల్లాలో విషాదం, పెళ్లి మండపంలో వరుడు హఠాన్మరణం
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్లు ఎప్పుడు ?
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా