అన్వేషించండి

Presidential Election 2022: ద్రౌపది ముర్ము అని ముందే తెలిస్తే సపోర్ట్ చేసేదాన్ని, హాట్‌ టాపిక్‌గా దీదీ వ్యాఖ్యలు

గిరిజన నేతను రాష్ట్రపతి ఎన్నికల్లో దింపుతున్నారని ముందే తెలిస్తే మద్దతునిచ్చేదాన్ని అంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఎన్‌డీఏ తనను సంప్రదించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

నన్ను సంప్రదించి ఉండాల్సింది: మమతా బెనర్జీ

ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముని ఎంపిక చేసినప్పటి నుంచి నిత్యం ఇదే విషయంపై రాజకీయంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అటు ప్రతిపక్షాల నుంచి ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలోకి దిగనున్నారు. ప్రతిపక్షాల అభ్యర్థి ఎంపిక విషయంలో చాలా రోజుల పాటు మేధోమథనం కొనసాగింది. ఈ ఎంపికలో కీలక పాత్ర పోషించారు పశ్చిమ బంగ సీఎం మమతా బెనర్జీ. అయితే మమతా బెనర్జీ ఇటీవల ఆసక్తికర కామెంట్స్ చేశారు. భాజపా తనను సంప్రదించి, గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి అభ్యర్థిగా
నిలబెడుతున్నామని చెప్పి ఉంటే తప్పకుండా మద్దతు ఇచ్చేదాన్ని అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఈ విషయంలో ఓసారైనా ఎన్‌డీఏ తనతో చర్చించి ఉంటే బాగుండేదని అన్నారు మమతా. పైగా ద్రౌపది ముర్ముని బరిలోకి దింపటం వల్ల రాష్ట్రపతి ఎన్నికల్లో వేడి పెరిగిందని వెల్లడించారు. 

యశ్వంత్ సిన్హాకు పూర్తిస్థాయి మద్దతు..

ప్రస్తుతానికి యశ్వంత్ సిన్హాకు పూర్తి స్థాయి మద్దతుని కొనసాగిస్తామని స్పష్టం చేశారు మమతా బెనర్జీ. "జరిగిందేదో జరిగింది. ఇప్పుడు ప్రతి పక్షాల నిర్ణయాన్ని గౌరవిస్తూ యశ్వంత్ సిన్హాకు మద్దతునిస్తున్నాను" అని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని తాను కోరుకుంటున్నట్టు మమతా బెనర్జీ తెలిపారు. అటల్‌ బిహారీ హయాంలో కేంద్ర మంత్రిగా ఉన్న యశ్వంత్ సిన్హాను ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాయి ప్రతిపక్షాలు. 2018లో భాజపాను వీడిన యశ్వంత్ సిన్హా, గతేడాది మార్చ్‌లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. జులై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. మూడు రోజుల తరవాత అంటే..జులై 21న ఫలితాలు వెల్లడిస్తారు. జులై 24వ తేదీ నాటికి ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం ముగియనుంది. భారత రాజ్యాంగం ప్రకారం, ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం ముగియక ముందే
మరో రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. 776 ఎంపీలు, 4,033మంది ఎమ్‌ఎల్యేలతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ రాష్ట్రపతినిఎన్నుకుంటుంది. 
నామినేటెడ్ ఎంపీలు, లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు ఓటు వేసేందుకు వీల్లేదు. 

మిజోరం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్‌ లాంటి రాష్ట్రాల్లో గిరిజన ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే ఆయా రాష్ట్రాల్లో ఎక్కువ మద్దతు కూడగట్టవచ్చని ప్లాన్ చేసింది భాజపా. ఈ రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికలు జరగనుండటం వల్ల ఇక్కడ పట్టు సాధించేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది కాషాయ పార్టీ. ఏదేమైనా ఇప్పుడు మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారాయి. 

Also Read: Jabardasth: బిగ్ బాస్ బ్యూటీకి 'జబర్దస్త్' ఛాన్స్ - అనసూయ రేంజ్ లో క్లిక్ అవుతుందా?

Also Read: Ramya Raghupathi: ఆమెకు మాటిచ్చాను, నరేష్‌కు విడాకులు ఇవ్వను: రమ్య రఘుపతి

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi 7 Appeals: అప్రమత్తతే రక్ష - ప్రధాని మోదీ ఏడు సూత్రాలు రాజకీయం కాదు, ఆర్థిక యుద్ధ తంత్రం!
అప్రమత్తతే రక్ష - ప్రధాని మోదీ ఏడు సూత్రాలు రాజకీయం కాదు, ఆర్థిక యుద్ధ తంత్రం!
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
IPL 2026 DC VS PBKS Result Updates: DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు నాలుగో ప‌రాజ‌యం
DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు వరుసగా నాలుగో ప‌రాజ‌యం
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
Piles Cases : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Embed widget