అన్వేషించండి

Prashant Kishor : జేఎస్‌పీకి నిధుల కొరత - మూసివేత ప్రచారం - తన ఆస్తులతో నడుపుతానని పీకే ప్రకటన

Jan Suraaj Party : బీహార్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో ప్రశాంత్ కిషోర్ పార్టీ ఉంటుందో.. ఊడుతుందోనని ప్రచారం జరుగుతోంది. అయితే తన ఆస్తులు అమ్మి అయినా పార్టీని నడుపుతానని ఆయన చెబుతున్నారు.

Prashant Kishor Donating All Assets: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్  సురాజ్ పార్టీ ఘోరంగా ఓడిపోవడతో ప్రశాంత్ కిషోర్ కలత చెందారు.  మాజీ రాజకీయ వ్యూహకర్త అయిన  ప్రశాంత్ కిషోర్ తన అన్ని ఆస్తులు దానం చేస్తానని భారీ ప్రకటన చేశారు. ఢిల్లీలోని తన కుటుంబ ఇల్లు తప్ప, గత 20 సంవత్సరాల్లో సంపాదించిన అన్ని  ఆస్తులు పార్టీకి దానం చేస్తానని, తదుపరి 5 సంవత్సరాల్లో తన 90 శాతం ఆదాయం జన్  సురాజ్ పార్టీకే కేటాయిస్తానని ప్రకటించారు.   గాంధీ ఆశ్రమంలో దీక్ష  చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కిషోర్, బిహార్ ప్రజలు ప్రతి సంవత్సరం రూ. 1,000 దానం చేయాలని పిలుపునిచ్చారు. 
 
నవంబర్ 21న బిహార్‌లోని వెస్ట్ చంపారన్‌లోని భీతిహర్వా గాంధీ ఆశ్రమంలో రోజు మౌన వ్రతం నిర్వహించిన కిషోర్, ఆ తర్వాత ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. "బిహార్ నవనిర్మాణ్ సంకల్ప్ యాత్ర"ను జనవరి 15న ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ యాత్రలో పార్టీ కార్యకర్తలు, తాను కలిసి 15-18 నెలల్లో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేరుకుని, ప్రభుత్వ నిర్వాకాలపై  గురించి అవగాహన కల్పిస్తామని చెప్పారు. "జన్ సురాజ్ పార్టీ ఇకపై డబ్బు కొరతతో ఆగదు. తదుపరి 5 సంవత్సరాల్లో నా 90 శాతం ఆదాయం పార్టీకి దానం చేస్తాను.   ఇల్లు తప్ప, గత 20 సంవత్సరాల్లో సంపాదించిన అన్ని ఆస్తులు పార్టీకి అందిస్తాను" అని కిషోర్ పేర్కొన్నారు.

జనసురాజ్  పార్టీ 238 సీట్లకు అభ్యర్థులను  ప్రకటించినప్పటికీ ఒక్క సీట్ కూడా గెలవలేదు. కిషోర్ ఈ ఓటమికి పూర్తి బాధ్యత తీసుకున్నారు.  నితీష్ కుమార్ క్యాబినెట్‌లో అవినీతి, క్రిమినల్స్ ఎక్కువగా ఉన్నారని, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, సీఎం కుమార్ బిహార్‌పై ఆసక్తి లేదని విమర్శించారు. ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఎనర్జిటిక్ క్యాంపెయిన్ నడిపినప్పటికీ, ఎన్‌డీఏ  విజయం సాధించింది. ప్రశాంత్ కిషోర్  పార్టీ 243 సీట్లలో 238కు అభ్యర్థులు ఎదుర్కొన్నా, ఒక్క సీట్ కూడా  గెలవలేకపోయింది.  ఈ ఓటమి తర్వాత ఆయన గాంధీ ఆశ్రమంలో మౌన వ్రతం చేసి, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తాని ప్రతిజ్ఞ చేశారు. 
 
 బిహార్ ప్రజలు ప్రతి సంవత్సరం రూ. 1,000 పార్టీకి దానం చేయాలని కోరారు.   ఈ మొత్తం పార్టీ ఆర్థిక బలోపేతానికి ఉపయోగపడుతుందని, ఇది "మార్క్సిస్ట్-లెనినిస్ట్-మావోయిస్ట్" ఐడియాలజీలా కాకుండా, గాంధీవాద సహకార ఆధారంగా ఉంటుందని చెప్పారు. పార్టీ కార్యకర్తలు ప్రతి వార్డుకు చేరుకుని, స్థానిక సమస్యలు పరిష్కరిస్తారన్నారు.     

ఈ ప్రకటన బిహార్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. మాజీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా ప్రసిద్ధి చెందిన కిషోర్,   పార్టీని 2025 ఎన్నికల్లో లాంచ్ చేసి ఓటమి చవిచూపినా, తన వ్యక్తిగత ఆస్తులు దానం చేసే నిర్ణయం అతని కమిట్‌మెంట్‌ను చూపిస్తోందని అంటున్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
Advertisement

వీడియోలు

The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Araku Special Trains: అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
Embed widget