అన్వేషించండి

Bengal BJP vs Mamata : దీదీ మేనల్లుడికి ఈడీ సమన్లు.. బెంగాల్‌లో మళ్లీ రాజకీయ రచ్చ..!

బొగ్గు స్కాంలో విచారణకు హాజరు కావాలని మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌, ఆయన భార్యకు ఈడీ సమన్లు జారీ చేసింది. దర్యాప్తు సంస్థలతో కాదని రాజకీయంగా ఎదుర్కోవాలని మమతా బెనర్జీ బీజేపీకి సవాల్ చేశారు.


బెంగాల్ రాజకీయాల్లో మళ్లీ ఉద్రిక్తత ప్రారంభమయింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి,  ఆయన భార్య రుచిరా బెనర్జీకి సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ ఒకటో తేదీన రుచిరా, ఆరో తేదీన అభిషేక్ తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. బెంగాల్లో బొగ్గు స్కాం జరిగిందని దానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసుల్లో ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. అభిషేక్ బెనర్జీ దంపతులతో పాటు ఇద్దరు సీనియర్ అధికారులకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. 
 
బెంగాల్‌లో కునుస్తోరియా, కజోరా ప్రాంతాల్లోని ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ బొగ్గు గనులున్నాయి.  బొగ్గు గనుల్లో బొగ్గును అక్రమంగా తవ్వుకుకుని అమ్ముకున్నారని సీబీఐ కేసు పెట్టింది. గత ఏడాది నవంబర్‌లో సీబీఐ బొగ్గు స్కాంపై కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించే నోటీసులు జారీ చేశామని ఈడీ తెలిపింది. ఈ వ్యవహారంతో అభిషేక్ బెనర్జీ భార్య రుచిరా, ఆమె సోదరి మేనకా గంభీర్‌కు కూడా సంబంధం ఉన్నట్లు సీబీఐ కేసులు పెట్టింది. అక్రమమైనింగ్‌ వ్యవహారంలో అభిషేక్  అని ఈడీ ఆరోపిస్తోంది. అయితే ఎన్నికలకు ముందు ఆరోపణలు చేసి.. మళ్లీ చాలా రోజుల తర్వాత తెరపైకి తీసుకు రావడం అంతా రాజకీయం అని తృణమూల్ ఆరోపిస్తోంది. తృణమూల్‌లో పార్టీ వ్యవహారాలు ఎక్కువగా అభిషేక్ బెనర్జీనే చక్కబెడుతూంటారు. 

గత ఎన్నికల సమయంలో ఈ స్కాం కూడా రాజకీయ అంశం అయింది. కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తమను వేధిస్తున్నారని మమతా బెనర్జీ మండిపడ్డారు. తాజా ఈడీ నోటీసులపైనా మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.  దేశాన్ని తెగనమ్మేసిన బీజేపీ బొగ్గు కుంభకోణంలో తృణమూల్‌ను వేలెత్తి చూపించలేరని.. దమ్ముంటే తమ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలని ఆమె సవాల్‌ విసిరారు.  బొగ్గు వ్యవహారం కేంద్రం చేతిలో ఉంటుందని, బెంగాల్, అసోల్ ప్రాంతాల్లో బొగ్గు అవినీతికి పాల్పడుతున్న బీజేపీ నేతల మాటేమిటని సూటిగా ప్రశ్నించారు. తమపై ఓ కేసు పెడితే తాము మరిన్ని కేసులను వెలుగులోకి తెస్తామని మమతా బెనర్జీ హెచ్చరించారు. గుజరాత్‌ చర్రిత ఏంటో  తెలుసన్నారు. 

బెంగాల్‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అక్కడ రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే రాజకీయ హింస చెలరేగింది. ఆ ఘటనలపై దుమారం రేగింది.రాష్ట్రపతి పాలన విధిస్తామన్నట్లుగా గవర్నర్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అది సద్దుమణిగిపోయిందనుకునే లోపల  వాటిపై విచారణను హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ తరుణంలో మళ్లీ కోల్ స్కాం వెలుగులోకి వచ్చింది. ఇది రెండు పార్టీల మధ్య మరోసారి వాదోపవాదాలకు కారణం అవుతోంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget