By: ABP Desam | Updated at : 03 Aug 2021 04:30 PM (IST)
దీపావళి వరకు ప్రజలకు ఉచిత రేషన్: మోదీ
గుజరాత్ లోని ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్నా యోజనా లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ లో భేటీ అయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ పౌరులు అందరికీ లబ్ధి చేకూరేలా ఈ పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఈ పథకంలో వీలైనంత ఎక్కువ మంది భాగం కావాలని మోదీ పిలుపునిచ్చారు.
ఎన్నో కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చని మోదీ అన్నారు. ప్రతి భారతీయుడికి ఆహారం అందించడమే లక్ష్యమన్నారు. దీపావళి వరకు ఈ పథకం ద్వారా ప్రజలందరికీ ఉచితంగా రేషన్ అందించనున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో భారత్ చేపట్టే చర్యలను యావత్ ప్రపంచం స్వాగతిస్తుందని ప్రధాని అన్నారు. 'ఒన్ నేషన్, ఒన్ రేషన్ కార్డ్' ఆలోచనను ఆయన ప్రశంసించారు. ఈ పథకాన్ని వీలైనంతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన అనేది ఆహార భద్రతకు సంబంధించిన పథకం. గత ఏడాది కరోనా సమయంలో పేదలకు ఉచిత రేషన్ అందిచేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రజాపంపిణీ డిపార్ట్ మెంట్ ఈ పథకాన్ని నడిపిస్తోంది. ఈ పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారునికి 5 కేజీల చొప్పున ఆహార ధాన్యాలు అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం.
Nara Lokesh Padayatra: నారా లోకేష్ యువగళం 5వ రోజు పాదయాత్ర షెడ్యూల్
Telangana CS Shanti Kumari: కంటి వెలుగు, పోడు పట్టాలు, టీచర్ల బదిలీలపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష
Ministers Meet Governor : తమిళి సైతో మంత్రి ప్రశాంత్ రెడ్డి భేటీ, గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ కు డేట్ ఫిక్స్
Minister KTR Tour : రేపు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ టూర్, ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్టులు!
Warangal: చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు - బైక్, క్యాష్, బంగారం స్వాధీనం
Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్
Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్లో నాని ఏమన్నాడంటే?
TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?