Jansuraj Padyatra: 3,500 కిమీ పాదయాత్ర ప్రారంభించిన పీకే- జనాలు లేక నిరాశ!
Jansuraj Padyatra: 'జన్ సూరజ్' పేరుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పాదయాత్ర ప్రారంభించారు.

Jansuraj Padyatra: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించారు. 'జన్ సూరజ్' పేరుతో మొదలుపెట్టిన ఈ యాత్ర సుమారు 3,500 కిమీ మేర సాగనుంది. అయితే ఈ యాత్రకు ప్రజా స్పందన అంతంతమాత్రంగానే ఉండటంతో తొలి రోజే పీకేకు నిరాశ కలిగింది.
చంపారన్లో
గాంధీ జయంతి సందర్భంగా బిహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ప్రశాంత్ కిశోర్ ఈ పాదయాత్రను ప్రారంభించారు. మహాత్మా గాంధీ 1917లో మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన భీతిహర్వా గాంధీ ఆశ్రమ్ నుంచి ప్రశాంత్ కిశోర్ ఈ పాదయాత్రను మొదలుపెట్టారు. అయితే ఈ యాత్ర పూర్తికావడానికి సుమారు 12 నుంచి 15 నెలలు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇదే లక్ష్యం
ఈ యాత్ర ద్వారా బిహార్లోని ప్రతి పంచాయతీ, బ్లాక్లో పర్యటించాలని ప్రశాంత్ కిశోర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు పీకే ఓ ట్వీట్ చేశారు.
నిరాశ
పాదయాత్ర ప్రారంభించిన ప్రశాంత్ కిశోర్ టీమ్కు తొలిరోజే నిరాశ ఎదురైంది. పశ్చిమ చంపారన్ జిల్లా బేతియాలో బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు చేసినా అనుకున్న స్థాయిలో జనం రాలేదు. మైదానం మొత్తం ఖాళీగా దర్శనమిచ్చింది.
రాజకీయాలపై
పీకే.. అప్పుడప్పుడూ ట్విట్టర్ వేదికగా పలువురు రాజకీయ నేతలపై సెటైర్లు వేస్తుంటారు. 2021 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి పాత్రపై ఇటీవల పీకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను గద్దె దించాలంటే విపక్షాల కూటమికి సారథిగా విశ్వసనీయమైన వ్యక్తిని నిలబెట్టడం, ప్రజా ఉద్యమం తీసుకురావడం అవసరమని పీకే అభిప్రాయపడ్డారు.
Also Read: Durga Puja Pandal Fire: దుర్గామాత మండపంలో అగ్ని ప్రమాదం- ఐదుగురు మృతి, 64 మందికి గాయాలు!
Also Read: Congress Presidential Poll: 'పోటీ వద్దని చెప్పినా థరూర్ వినలేదు- చర్చకు నేను ఒప్పుకోను'
Before You Go
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
ట్రెండింగ్ వార్తలు






















