అన్వేషించండి

Breaking News Live Updates: నల్గొండలో రథోత్సవంలో అపశ్రుతి, విద్యుత్ తీగలు తాకడంతో ముగ్గురు మృతి

Breaking News Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

LIVE

Key Events
Breaking News Live Updates: నల్గొండలో రథోత్సవంలో అపశ్రుతి, విద్యుత్ తీగలు తాకడంతో ముగ్గురు మృతి

Background

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ ఎన్టీఆర్ 99వ జయంతి వేడులకు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. టాలీవుడ్ హీరో బాలక్రిష్ణ నిమ్మకూరులో తన తండ్రి ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళి అర్పించారు. ప్రపంచ పటంలో తెలుగు సంతకం, ఆత్మగౌరవం నిలబెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని, నేటి నుంచి ఆయన శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం  ఆనందంగా  ఉందన్నారు. తల్లిదండ్రులు అంటే పార్వతీపరమేశ్వరులు లాంటి వారని, ఎన్టీఆర్‌ ఇల్లే ఒక నటనాలయం, ఆయన అందరి గుండెల్లో ఉన్నారన్నారు నటుడు బాలక్రిష్ణ.

సామాన్య రైతు నుంచి సీఎం దాకా..
తెలుగు వారి ఆత్మగౌరవం నిలబెట్టేందుకు నేనున్నాను అని ముందుకు వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అంటూ  బాలక్రిష్ణ భావోద్వేగానికి లోనయ్యారు. సామాన్య రైతుగా కెరీర్ ప్రారంభించిన ఆయన ఆపై, ప్రభుత్వం ఉద్యోగిగా, కళాకారునిగా, ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు. సామాజికం, పౌరాణికం, ప్రతికూల పాత్రలను సైతం పోషించి మెప్పించారు. శ్రామికులు, రైతులు, అన్నార్ధుల కోసం తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)ని తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించారని చెప్పారు. పౌరాణికం, నాటకాలు, సామాజిక అంశాలను టచ్ చేస్తూ సినీ కెరీర్ ‌లో 300 సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించారు.

35 అడుగుల యన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు
ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు వింటే తనువు పులకిస్తుందన్నారు. ఆయన శత జయంతిని అందరూ  స్వచ్చందంగా జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. స్వగ్రామం నిమ్మకూరు చెరువు వద్ద 35 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు గ్రామస్తులు తీర్మానించారు. బంధువులు, కుటుంబ సభ్యులు కలిసి ఈ విగ్రహం కడతారని బాలయ్య క్లారిటీ ఇచ్చారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు  అని ఎన్టీఆర్ నినదించారు, సామాన్యలను సైతం చట్ట సభల్లో కూర్చోబెట్టిన ఘనత ఎన్టీఆర్ సొంతం. 

నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఇదివరకే కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు వేగంగా ఏపీ, తెలంగాణ వైపు ప్రయాణిస్తున్నాయి. ఇండోనేషియా భూకంపం వల్ల సునామీ ఏర్పడినా మన దేశాన్ని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.  దక్షిణ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం రాయలసీమ దాని పరిసర సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉంది. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి 5 డిగ్రీల ఉత్తర అక్షాంశం / 67 డిగ్రీల తూర్పు రేఖాంశం, 6 డిగ్రీల ఉత్తర అక్షాంశం లేదా 72 డిగ్రీల తూర్పు రేఖాంశం, 18 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 94.5 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా కొనసాగుతోంది. వీటి ఫలితంగా ఏపీ, యానాం, తెలంగాణలో పలుచోట్ల నేడు సైతం మోస్తరు వర్షాలు కురయనున్నాయని వెల్లడించారు.

పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. నిన్న స్వల్పంగా తగ్గిన  బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనించి భారీగా పుంజుకుంది. రూ.110 మేర పెరగడంతో  తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090 గా ఉండగా.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,750 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు వెండి ధర రూ.600 మేర పెరగడంతో హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.66,600కి ఎగబాకింది.

ఏపీలో పెరిగిన బంగారం ధర.. (Gold Rate Today In AP)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరగడంతో  విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 28th May 2022 2022)  10 గ్రాముల ధర రూ.52,090 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,750 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. రూ.600 పెరగడంతో విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.66,600 కి చేరింది.

 

14:43 PM (IST)  •  28 May 2022

Nalgonda Crime: రథోత్సవంలో అపశ్రుతి, విద్యుత్ తీగలు తాకడంతో ముగ్గురు మృతి

నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతెపల్లిలో రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తాకడంతో ముగ్గురు భక్తులు మరణించగా, మరో నలుగు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. 

13:32 PM (IST)  •  28 May 2022

వైసిపి ఎమ్మెల్యేగా ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పిస్తున్నా: అన్నాబత్తుని శివకుమార్

గుంటూరు జిల్లా, తెనాలిలో గాంధీ చౌక్ లో ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్,
బీసీ అధ్యక్షుడు కేశన.శంకర్రావు,తదితరులు. వైసిపి ఎమ్మెల్యే గా ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పిస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు. ఎన్టీఆర్ సామాజిక విప్లవ వాది. ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం తీసుకొచ్చింది ఎన్టీఆరే. ఎన్టీఆర్ తర్వాత పాలించిన వారు సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కారు. తిరిగి ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేస్తుంది జగన్ మోహన్ రెడ్డే. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళేది జగన్ నాయకత్వంలోని వైసిపినే అని పేర్కొన్నారు.

11:53 AM (IST)  •  28 May 2022

ఎన్ టి ఆర్ ను స్ఫూర్తిగా తీసుకోని కేసీఆర్ నడుస్తున్నారు: మోత్కుపల్లి

భూ స్వాములు పెత్తనం పక్కన పెట్టిన నాయకుడు ఎన్ టి ఆర్ అని మోత్కుపల్లి నరసింహులు అన్నారు. పెంకుటు ఇల్లు పరిచియం చేసిందీ మహ నాయకుడు, ఎన్ టి ఆర్ ను స్ఫూర్తిగా తీసుకోని కేసీఆర్ నడుస్తున్నారని చెప్పారు. మధ్య దళారులు లేకుండా ప్రజలకి అన్ని చేరుకోవాలి. ఈ దళిత బంధు కూడా అలాంటిదేనన్నారు. వాస్తవానికి పెళ్లి నాటికి అర్థ రూపాయ లేదని.. తన పెళ్లి కి వచ్చి భోజనం చేసి నన్ను ముందు ఉండి నడిపిన వ్యక్తి ఎన్ టి ఆర్ అని గుర్తుకు చేసుకున్నారు మోత్కుపల్లి.

11:51 AM (IST)  •  28 May 2022

NTR Birth Anniversary: ప్రపంచ ఖ్యాతి గడించిన తెలుగు బిడ్డ ఎన్టీఆర్: మంత్రి మల్లారెడ్డి

మంత్రి మల్లారెడ్డి: ఒక తెలుగు బిడ్డ ప్రపంచ ఖ్యాతి గడించిన వ్యక్తి ఎన్. టి. అర్

- అయన అదేశాలు మేరకు అభిమానులు పని చేస్తున్నారు

- అయన ప్రధాని మంత్రి అవ్వాల్సింధి.. జస్ట్ లో మిస్స్ అయింది

- ఎన్. టి.అర్ కి భారత రత్న ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం

11:49 AM (IST)  •  28 May 2022

RGV Complaint In Punjagutta PS: నట్టి క్రాంతి, నట్టి కరుణపై పంజాగుట్ట పీఎస్‌లో RGV ఫిర్యాదు

హైదరాబాద్: నట్టి క్రాంతి, నట్టి కరుణ పై పంజాగుట్టలో టాలీవుడ్ డైరెక్టర్ Rgv ఫిర్యాదు చేశారు. తన సైన్ ను ఫోర్జరీ చేశారు అని పోలీసులకు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మా ఇష్టం సినిమాకు సంబంధించిన లేటర్ రేట్ పై తన సంతకం ఫోర్జరీ చేశారు అని rgv ఆరోపించారు. నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఫిర్యాదు చేశారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget