Breaking News Telugu Live Updates: మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలకు ఈడీ నోటీసులు....
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్డేట్స్, వివరాలు మీకోసం

Background
Breaking News Telugu Live Updates: ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడిని లారీతో ఢీకొట్టి కిరాతకంగా హత్యచేశారు. జిల్లాలోని సింగరాయకొండ మండలం కనుమళ్ల గ్రామం వద్ద జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పాత కక్షల కారణంగా నడిరోడ్డుపై వైసీపీ నేత పసుపులేటి రవితేజను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పసుపులేటి రవితేజ (32) ప్రకాశం జిల్లాలోని మూలగుంటపాడు గ్రామానికి చెందిన అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత. అక్కడే ఇసుక వ్యాపారం చేస్తుంటాడు. రవితేజ తండ్రి శ్రీనివాసరావు సోమరాజుపల్లి మాజీ సర్పంచి. రవితేజ, తన స్నేహితుడు ఉమ వేర్వేరు బైకులపై కనుమళ్లకు బయలుదేరారు. ఈ క్రమంలో గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో వెనుక నుంచి దూసుకొచ్చిన లారీ రవితేజ బైక్ ను ఢీకొట్టడంతో రోడ్డు మీద పడిపోయాడు. అంతటితో ఆగకుండా లారీ డ్రైవర్ బైకుతో పాటు రవితేజను తొక్కిస్తూ వెళ్లిపోయాడు. లారీ తన మీద నుంచి వెళ్లడంతో వైసీపీ నేత రవితేజ అక్కడికక్కడే మృతిచెందాడు.
ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో నేడు సైతం పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. మధ్యప్రదేశ్ మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా మధ్య ఆంధ్ర మీదుగా గాలుల సంఘమం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం, దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో 2 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి.
తెలంగాణలో వాతావరణం ఇలా
తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో నేడు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు సెప్టెంబర్ 24 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ ను నేడు సైతం మేఘాలు కమ్మేశాయి. నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో సెప్టెంబర్ 24 వరకు పలుచోట్ల వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు విశాఖ నగర పరిసర ప్రాంతాలలో పిడుగుల వర్షం కురిసే ఛాన్స్ ఉంది. గాజువాక - విమానాశ్రయం వైపు వర్షాలు నమోదవుతాయి. కాకినాడ జిల్లాలోని దక్షిణ భాగాలు ముఖ్యంగా కాకినాడ సిటీ - యానాంతో పాటుగా తూర్పు గోదావరి జిల్లా పోలవరం - రంపచోడవరం పరిసరాలు, పార్వతీపురం మణ్యం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు ఉత్తర భాగాలు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలకు ఈడీ నోటీసులు....
మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలకు ఈడీ నోటీసులు....
మనీలాండరింగ్ నిరోధక చట్టం 2005లోని సెక్షన్ 50 కింద కాంగ్రెస్ నేతలకు నోటీసులు
నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా ఈ డీ నోటీసులు
నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎండీ అలీ షబ్బీర్, పీ సుదర్శన్ రెడ్డిలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలిచింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం 2005లోని సెక్షన్ 50 కింద కాంగ్రెస్ నేతలకు నోటీసులు అందాయి.
అక్టోబర్ 10న సుదర్శన్ ఈడీ ఎదుట హాజరు కావాలని కోరగా, షబ్బీర్ మరుసటి రోజు హాజరుకావాల్సి ఉంటుంది.
నేషనల్ హెరాల్డ్ విచారణలో పాల్గొన్న కంపెనీల ఖాతాలకు ఇద్దరు నేతలు మొత్తాలను బదిలీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
గతంలో వివిధ కాంగ్రెస్ ప్రభుత్వాల్లో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన నగరానికి చెందిన మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ మహిళా నేతకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
రేణిగుంట ఎయిర్ పోర్టులో సీఎం జగన్కు ఘన స్వాగతం
తిరుపతి : ముఖ్యమంత్రికి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన మంత్రులు..
చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి రేణిగుంట విమానశ్రయంలో ఘన స్వాగతం పలికారు.. అనంతరం చిత్తూరు జిల్లా కుప్పంకు చేరుకుని చేయూత కార్యక్రమంలో పాల్గొననున్నారు.. రాష్ట్ర భూగర్భ గనులు, అటవీ, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, తిరుపతి నగర పాలక మేయర్ డా శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి ఎమ్మెల్యే లు భూమన కరుణాకరరెడ్డి కోనేటి అదిమూలం, బియ్యపు మధుసూధన్ రెడ్డి సీఎంకు స్వాగతం పలికారు..





















