అన్వేషించండి

Banakacharla News: ఢిల్లీకి చంద్రబాబే కాదు రేవంత్ కూడా - బనకచర్లపై కేంద్ర మంత్రి సమక్షంలో చర్చలు ఉంటాయా?

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు పర్యటన ఖరారు అయింది. అక్కడ బకనచర్లపై కేంద్ర మంత్రితో చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

Telugu CMs in Delhi:  తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ,  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఒకే సారి ఢిల్లీ వెళ్లనున్నారు.  మంగళవారం మధ్యాహ్నం రేవంత్ ఢిల్లీ వెళతారు.  16, 17 తేదీల్లోనూ అక్కడే ఉంటారు.  సమాచారం.  15న సాయంత్రం ఢిల్లీలో జరిగే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సంస్మరణ సభలో సీఎం పాల్గొనే అవకాశం ఉంది.  ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.  తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదికను పంచుకునే అవకాశం ఉంది. 

ఢిల్లీకి చంద్రబాబు,  రేవంత్ 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటన నిమిత్తం 15, 16 తేదీల్లో ఢిల్లీ వెళుతు న్నారు. ఈ పర్యటనలో భాగంగా  కేంద్రమంత్రులతో ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చలు నిర్వహిస్తారు.  రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, కేంద్ర గ్రాంట్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన అంశాలను ఆయా మంత్రిత్వ శాఖలతో సీఎం చర్చించనున్నారు. 15వ తేదీ ఉదయం అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు అదే రోజు మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. అదే రోజు కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే సారస్వత్‌, ఢిల్లీ మెట్రో రైల్‌ ఎండీ డాక్టర్‌ వికాస్‌ కుమార్‌తో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. విశాఖ, విజయవాడ మెట్రోలపై చర్చిస్తారు.           

కేంద్రజలశక్తి మంత్రితో ఇరువురు సీఎంల సమావేశం

జల వివాదాలపై చర్చ కోసం కేంద్ర జలశక్తి మంత్రితో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు.   ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి నేతృత్వంలో జరిగే సమావేశంలో రేవంత్ రెడ్డి,  చంద్రబాబు నాయుడు ఇద్దరూ తెలంగాణ ,  ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాలపై చర్చించే అవవకాశం ఉంది.  ఈ సమావేశానికి ఇద్దరు ముఖ్యమంత్రులను కేంద్రం ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.  తెలంగాణ,  ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా ,  గోదావరి నదుల జలాల విభజనపై దీర్ఘకాలంగా వివాదం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర జలశక్తి మంత్రితో జరిగే సమావేశం కీలకమైనది.   బనకచర్ల పైన వివాదం కొనసాగుతున్న సమయంలో.. ఇద్దరు సీఎంలు కలిసి సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.           

బనకచర్ల సమస్యకు పరిష్కారం అంత తేలిక కాదు !        

బనకచర్ల విషయం రాజకీయం కావడంతో సమస్యను రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా పరిష్కరించడం అంత తేలిక కాదన్న అభిప్రాయం ఉంది. అయితే ముఖ్యమంత్రులు ఈ అంశంపై కేంద్ర జలశక్తి మంత్రి సమక్షంలో చర్చిస్తే.. తాత్కాలికంగా అయినా ప్రస్తుత వివాదానికి ముగింపు లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  బనకచర్ల అంశంపై ఏపీలోనూ ఇప్పుడిప్పుడే అది అంత లాభదాయకమైన ప్రాజెక్టు కాదన్న చర్చ జరుగుతోంది. ప్రజాభిప్రాయం మేరుకు  చంద్రబాబు ప్రస్తుతం పూర్తిగా పోలవరంపైనే దృష్టి పెట్టి ఆ తర్వాత..   బనకచర్ల అంశాన్ని  అందుకోవచ్చని.. ఇప్పటికి అంత దూకుడు చూపించకపోవచ్చని అంచనా వేస్తున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
India vs Sri Lanka Colombo Test Updates: కుల్దీప్ కు ఉద్వాసన తప్పదా...! బౌలింగ్ కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు
కుల్దీప్ కు ఉద్వాసన తప్పదా...! బౌలింగ్ కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు
Mobile Recharge Price Hike: త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Embed widget