అన్వేషించండి
Land slide: హిమాచల్ ప్రదేశ్ లో కొండచరియలు విరిగిపడి 9 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్ లో కొండచరియలు విరిగిపడి 9 మంది మృతి చెందారు. వీరంతా దిల్లీకి చెందినవారుగా గుర్తించారు.

హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లా సంగాల్ లోయలో విషాదం. కొండచరియలు విరిగిపడి దిల్లీకి చెందిన 9 మంది పర్యటకులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
వీరంతా టెంపోలో ఉండగా పెద్ద బండరాయి వచ్చి వాహనాన్ని ఢీ కొట్టినట్టు తెలుస్తోంది. ఇదే ప్రమాదంలో మరో చోట ఇంకో వ్యక్తి గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మృతుల్లో రాజస్థాన్కు చెందినవారు నలుగురు, ఛత్తీస్గఢ్- ఇద్దరు, మహారాష్ట్ర- ఒకరు, దిల్లీ- ఇద్దరు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
భూకంపం సంభవించినట్లుగా ఒక్కసారిగా కొండ పైనుంచి బండరాళ్లు వేగంగా కిందకు దూసుకొచ్చాయి. రాళ్ల ధాటికి లోయలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో పలు వాహనాలు, పర్యటకుల విశ్రాంతి గదులు ధ్వంసం అయ్యాయి. ఈ దృశ్యాలను పలువురు పర్యటకులు తమ ఫోన్లలో చిత్రీకరించారు.
#WATCH | Himachal Pradesh: Boulders roll downhill due to landslide in Kinnaur district resulting in bridge collapse; vehicles damaged pic.twitter.com/AfBvRgSxn0
— ANI (@ANI) July 25, 2021
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
అమరావతి
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion