అన్వేషించండి

Perseverance Rover: మార్స్ మీద మనుషులు బతికే అవకాశం ఉందా, మిస్టరీని ఛేదించనున్న ఆ శాంపిల్

Perseverance Rover: మార్స్‌పై మనుషులు మనుగడ సాగించే అవకాశముందో లేదో నాసా పంపిన పర్‌సివరెన్స్ రోవర్ తేల్చనుంది.

Perseverance Rover: 

పర్ సివరెన్స్..

నాసా మార్స్ మీదకు ఓ రోవర్ ను పంపించందని తెలుసుకదా. పర్ సివరెన్స్ అని పిలుచుకుంటున్న ఈ రోవర్ 2021 నుంచి ఫిబ్రవరి నుంచి మార్స్ మీదే తిరుగుతూ వందల ఫోటోలు తీసింది. అక్కడి రాళ్లు, మట్టి, గాలి నుంచి శాంపుల్స్ తీసుకుంది. సరే తీసుకుంది మరి వాటిని భూమి 
మీదకు తీసుకురావటం ఎలా.  ఆ మట్టిని రాళ్లను తీసుకువచ్చి పరిశోధనలు చేస్తేనే కదా అసలు అంగారుకుడి మీద జీవం బతికేందుకు ఆస్కారం ఉందో లేదో తెలిసేది. ఇప్పుడు ఆ దిశగా ఓ కీలక అడుగు వేసింది పర్ సివరెన్స్ రోవర్. 


Perseverance Rover: మార్స్ మీద మనుషులు బతికే అవకాశం ఉందా, మిస్టరీని ఛేదించనున్న ఆ శాంపిల్

(Photo Credits : Nasa/JPL/ESA)

రెండు నెలల్లో...పది శాంపుల్స్ :

నాసా పర్ సివరెన్స్ రోవర్ మార్స్ మీద తిరుగుతూ ఇప్పటి వరకూ 17 శాంపుల్స్ కలెక్ట్ చేసింది. ఇందులో ఒక ఎయిర్ శాంపుల్ కూడా ఉంది. ఇప్పుడు ఈ రోవర్ తను కలెక్ట్ చేసిన శాంపుల్స్ లో 10 శాంపుల్స్ ను మార్స్ మీద జాగ్రత్త జార విడిచే పని ప్రారంభించింది. అందులో మొదటి 
శాంపుల్ గా ఓ టైటానియం ట్యూబ్ ను ఇదుగో ఇలా సక్సెస్ ఫుల్ గా విడిచి పెట్టింది. ఈ శాంపుల్ ను జనవరి 31న కలెక్ట్ చేసింది రోవర్. మార్స్ మీద జెజెరో క్రేటర్ లో ముందుగా నిర్దేశించిన ఓ స్పెసిఫైడ్ ప్లేస్ లో ఈ శాంపుల్ ను పర్ సివరెన్స్ రోవర్ విడిచి పెట్టింది. ఇలా మొత్తం పదిశాంపుల్స్ ను రానున్న రెండు నెలల్లో విడిచి పెడుతుంది. ఈ మొత్తం పదిశాంపుల్స్ ఉండే ఏరియా ఇదుగో ఇలా మ్యాప్ లా ఉంటుంది. దీన్ని త్రీ ఫోర్క్ అని పిలుస్తోంది నాసా.  మిగిలిన ఏడు శాంపుల్స్ ను బ్యాకప్ శాంపుల్స్ గా  రోవర్ తన దగ్గరే పెట్టుకుంటుంది. వాటిని మరో పాయింట్ దగ్గర జాగ్రత్త భద్రపరుస్తుంది. ఇదంతా ఎందుకంటే మనం మార్స్ శాంపుల్ రిటర్న్ క్యాంపెయిన్ గురించి మాట్లాడుకోవాలి.

మార్స్ శాంపుల్ రిటర్న్ క్యాంపెయిన్ :

నాసా పర్ సివరెన్స్ తీసిన శాంపుల్స్ ను భూమి మీదకు తీసుకువచ్చే ప్రాజెక్టే ఈ మార్స్ శాంపుల్ రిటర్న్ క్యాంపెయిన్. ఇందుకోసం 2027 నాటికి మార్స్ కక్ష్యలోకి ఓ ఆర్బిటర్ చేరుకునే ఈ ప్రయోగాన్ని ప్లాన్ చేస్తోంది నాసా. 2028 సంవత్సరం మొదట్లో ఈ ఆర్బిటర్ నుంచి ల్యాండర్ మార్స్ మీదకు దిగుతుంది. ఎగ్జాట్ గా ఈ శాంపుల్స్ ఇప్పుడు రోవర్ వదిలేస్తున్న పాయింట్ లోనే దిగుతుంది నాసా ల్యాండర్. సపోజ్ మన నాసా పర్ సివరెన్స్ కు అప్పటికి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం రావచ్చు కదా. అందుకే ఇలా ముందు జాగ్రత్తగా కలెక్ట్ చేసుకునే విధంగా శాంపుల్స్ ను కొంచెం దూరం దూరంగా విడిచి పెడుతుంది. 2028 లో దిగే ల్యాండర్ లో మూడు ప్రధాన భాగాలు ఉంటాయి. ఒక రోవర్ మిషన్ పర్ సివరెన్స్ రోవర్ వదిలిపెట్టిన శాంపుల్స్ ను తీసుకుని...శాంపుల్స్ స్టోరేజ్ ప్లేస్ లో జాగ్రత్తగా పెడుతుంది. అప్పుడు ఈ ల్యాండర్ లో ఉన్న చిన్నపాటి రాకెట్ ద్వారా శాంపుల్స్ అన్నీ మార్స్ కక్ష్యలోకి తిరుగు ప్రయాణం మొదలు పెడతాయి.  ఇదే టైం లో నాసా మరో స్పేస్ క్రాఫ్ట్ ను మార్స్ కక్ష్యలో సిద్ధంగా ఉంచుతుంది. రాకెట్ ద్వారా వచ్చిన శాంపుల్స్ ను ఆ స్పేస్ క్రాఫ్ట్ తీసుకుని...అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టి 2033 నాటికి భూమి మీదకు చేరుకుంటుంది. నాసా శాస్త్రవేత్తలు ఆ శాంపుల్స్ పై పరిశోధనలు చేసి అంగాకరుడిపై జీవం ఉండేందుకు ఆస్కారం ఉందా లేదా తేల్చి చెబుతారు. సో మరో పదేళ్లలో మనుషులు అంగారకుడిపైకి వెళ్లి నివాసాలు ఏర్పరుచుకోగలరా లేదా అనే అంశంపై ఓ క్లారిటీ అయితే రానుంది. అందుకే నాసా ఈ మొత్తం ప్రయోగాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా భావించి జాగ్రత్తగా ఒక్కో స్టేజ్ ను జాగ్రత్తగా కంప్లీట్ చేస్తోంది.

Also Read: Covid-19 Surge: వీలైనంత త్వరగా ప్రికాషనరీ డోస్ తీసుకోండి - ప్రజలకు IMA సూచన

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi Convoy Reduction : పొదుపు పిలుపే కాదు..పాటిస్తున్నారు కూడా - కాన్వాయ్‌ సైజ్ తగ్గించుకున్న మోదీ - అదే బాటలో వీఐపీలు
పొదుపు పిలుపే కాదు..పాటిస్తున్నారు కూడా - కాన్వాయ్‌ సైజ్ తగ్గించుకున్న మోదీ - అదే బాటలో వీఐపీలు
Mahindra Car Discounts: మహీంద్రా కార్లపై భారీ ఆఫర్లు: ఈ మే నెలలో ఏ మోడల్‌పై ఎంత డిస్కౌంట్ ఉందో తెలుసా..!
మహీంద్రా కార్లపై భారీ ఆఫర్లు: ఈ మే నెలలో ఏ మోడల్‌పై ఎంత డిస్కౌంట్ ఉందో తెలుసా..!
CBSE 12th Result 2026: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల.. 85.20 శాతం మంది ఉత్తీర్ణత.. రిజల్ట్స్ లింక్
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల.. 85.20 శాతం మంది ఉత్తీర్ణత.. రిజల్ట్స్ లింక్
Mahabharat: ఉచిత పథకాలు ప్రకటించడం కాదు ఆ అవసరం లేకుండా చేయడమే రాజధర్మం! ఈ కథ మీకోసమే!
ఉచిత పథకాలు ప్రకటించడం కాదు ఆ అవసరం లేకుండా చేయడమే రాజధర్మం! ఈ కథ మీకోసమే!

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBSE 12th Result 2026: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల.. 85.20 శాతం మంది ఉత్తీర్ణత.. రిజల్ట్స్ లింక్
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల.. 85.20 శాతం మంది ఉత్తీర్ణత.. రిజల్ట్స్ లింక్
PM Modi Convoy Size: ప్రధాని మోదీ కాన్వాయ్ వాహనాలు తగ్గింపు.. వాటికి ఎంత ఫ్యూయల్ వాడేవారు, ఎంత ఆదా అవుతుంది
ప్రధాని మోదీ కాన్వాయ్ వాహనాలు తగ్గింపు.. వాటికి ఎంత ఫ్యూయల్ వాడేవారు, ఎంత ఆదా అవుతుంది
Hyderabad Crime News: హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం.. ఓ ఇంట్లో 75 తులాల బంగారం, 20 కిలోల వెండి చోరీ
హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం.. ఓ ఇంట్లో 75 తులాల బంగారం, 20 కిలోల వెండి చోరీ
Vijay Trisha: సూర్య కోసమా? త్రిష కోసమా? సీఎం విజయ్ బంపరాఫర్ బాగుందమ్మా
సూర్య కోసమా? త్రిష కోసమా? సీఎం విజయ్ బంపరాఫర్ బాగుందమ్మా
Gold Import Duty: బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. ప్రధాని మోదీ మాటలకు అర్థం ఇదే!
బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. ప్రధాని మోదీ మాటలకు అర్థం ఇదే!
Heat Wave Alert : రోజు రోజుకి పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. వేడి వల్ల శరీరానికి, మనసుకు పొంచి ఉన్న ప్రమాదాలు ఇవే
రోజు రోజుకి పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. వేడి వల్ల శరీరానికి, మనసుకు పొంచి ఉన్న ప్రమాదాలు ఇవే
Peddi Tickets Rate: తెలంగాణలో 'పెద్ది'కి పెద్ద దెబ్బ... మైత్రి వర్సెస్ ఎగ్జిబిటర్స్ ఇష్యూలో చరణ్ సినిమాకు భారీ లాస్
తెలంగాణలో 'పెద్ది'కి పెద్ద దెబ్బ... మైత్రి వర్సెస్ ఎగ్జిబిటర్స్ ఇష్యూలో చరణ్ సినిమాకు భారీ లాస్
AP Local Body Elections: మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
Embed widget