Modi US Visit LIVE: ముగిసిన క్వాడ్ సదస్సు.. న్యూయార్క్కు మోదీ పయనం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్- ప్రధాని నరేంద్ర మోదీ మధ్య నేడు గంటపాటు ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. అనంతరం క్వాడ్ సదస్సులో మోదీ పాల్గొంటారు.
LIVE
Background
ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే..
అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. అధ్యక్షుడు బైడెన్తో భేటీ కానున్నారు. తీవ్రవాదం, సీమాంతర ఉగ్రవాదం, అంతర్జాతీయ పరిణామాలపై ఇరు దేశాధినేతల మధ్య చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా పేర్కొన్నారు.
వాణిజ్యం,పెట్టుబడి సంబంధాల బలోపేతం, రక్షణ సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ఇరుదేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు శ్వేతసౌధ అధికారులు ప్రకటించారు. ఈ భేటీకి మోదీతోపాటు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ హాజరుకానున్నారు.
8.30 PM (IST): ప్రధాని నరేంద్ర మోదీ- బైడెన్ మధ్య దాదాపు గంటపాటు ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి.
11.30 PM IST (Sept 24) to 3.30 AM (Sept 25): ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాల కూటమి 'క్వాడ్' దేశాధినేతల మధ్య శ్వేతసౌధంలో దాదాపు 4 గంటలపాటు ఈ సమావేశం జరగనుంది.
న్యూయార్క్కు పయనం..
క్వాడ్ సదస్సు ముగిసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. న్యూయార్క్ పయనం కానున్నారు. ఐరాస 76వ జనరల్ అసెంబ్లీలో పాల్గొనేందుకు మోదీ వెళ్లనున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా పేర్కొన్నారు.
Prime Minister Narendra Modi will depart later this evening for New York. He is scheduled to address at the 76th session of UNGA tomorrow morning: Foreign Secretary Harsh Vardhan Shringla pic.twitter.com/RxDwV4x5fY
— ANI (@ANI) September 24, 2021
శాంతి స్థాపనకు..
శ్వేతసౌధంలో దాదాపు 4 గంటలపాటు సుదీర్ఘంగా సాగిన 'క్వాడ్' దేశాధినేతల సదస్సు ముగిసింది. ఇండో పసిఫిక్ ప్రాంతం సహా ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనకు ఐకమత్యంగా కృషిచేయాలని క్వాడ్ కూటమి నిర్ణయించింది. వాతావరణ మార్పులు, ఇండో పసిఫిక్ ప్రాంత అభివృద్ధి వంటి అంశాలపై ప్రధానంగా చర్చించింది.
ప్రపంచ దేశాలకు మేలు చేసే శక్తి..
ప్రపంచ దేశాలకు మేలు చేసే ఓ శక్తిగా క్వాడ్ కూటమిని అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ.
#WATCH "The Quad- a force for global good," says Prime Minister Narendra Modi at the first in-person Quad Leaders' Summit at The White House pic.twitter.com/urFIhjhGCQ
— ANI (@ANI) September 24, 2021
ప్రపంచ శ్రేయస్సు..
[quote author=ప్రధాని నరేంద్ర మోదీ]2004లో వచ్చిన సునామీ తర్వాత మన నాలుగు దేశాలు సమావేశం కావడం ఇదే తొలిసారి. ఇప్పుడు కరోనా సంక్షోభంలో మళ్లీ భేటీ అయ్యాం. ప్రపంచ శ్రేయస్సుకోసమే ఈ సమావేశం. క్వాడ్ వ్యాక్సిన్ కార్యక్రమం ఇండో-పసిఫిక్ దేశాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మన ప్రజాస్వామ్య విలువల ఆధారంగా క్వాడ్ మరింత ముందుకు వెళ్లాలి. సప్లై చైన్, ప్రపంచ భద్రత, వాతావరణ మార్పులు, కొవిడ్పై యుద్ధం సహా పలు అంశాలపై నా స్నేహితులతో మాట్లాడటం ఆనందంగా ఉంది. [/quote]
క్వాడ్ సదస్సు ప్రారంభం..
శ్వేతసౌధంలో క్వాడ్ సదస్సు మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిదే సుగా సమావేశంలో పాల్గొన్నారు.
క్వాడ్ సదస్సు..
బైడెన్తో భేటీ ముగిసిన అనంతరం మోదీ క్వాడ్ సదస్సుకు హాజరుకానున్నారు. కాసేపట్లో క్వాడ్ సదస్సు మొదలుకానుంది.
మరింత బలోపేతం చేద్దాం..
[quote author=ప్రధాని నరేంద్ర మోదీ]ఈరోజు జరిపిన ద్వైపాక్షిక చర్చలు చాలా ముఖ్యం. ఈ శతాబ్దంలో మూడో దశాబ్దం మొదట్లోనే మన చర్చలు జరిగాయి. మీ నాయకత్వం.. ఈ దశాబ్దంలో కీలక మార్పులు తెస్తుందని నమ్ముతున్నాను. భారత్- అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేద్దాం. ప్రస్తుతం సాంకేతికత ప్రపంచాన్ని నడిపిస్తోంది. ఆ సాంకేతికత సాయంతో మనం మరింత ముందుకు సాగాలి. [/quote]
Technology is becoming a driving force. We have to utilise our talents to leverage technology for the greater global good: PM Modi during bilateral meeting with US President Biden pic.twitter.com/MVRgel98Uh
— ANI (@ANI) September 24, 2021
నేను అప్పుడే చెప్పాను..
[quote author= జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు]అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్- అమెరికా బంధం చాలా ముఖ్యం. 2020 నాటికి భారత్, అమెరికా మధ్య బలమైన స్నేహం ఏర్పడుతుందని నేను 2006లో ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే చెప్పాను. [/quote]
బైడెన్ కీలక వ్యాఖ్యలు..
ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలకు ముందు బైడెన్ ట్వీట్ చేశారు.
This morning I’m hosting Indian PM Narendra Modi at the White House for a bilateral meeting. I look forward to strengthening the deep ties between our two nations, working to uphold a free & open Indo-Pacific, and tackling everything from COVID-19 to climate change: US President pic.twitter.com/TNq38sRX3M
— ANI (@ANI) September 24, 2021
[quote author= జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు]ప్రధాని నరేంద్ర మోదీతో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరపబోతున్నాను. ఇరుదేశాల మధ్య ఉన్న బలమైన బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తాను. ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని సురక్షితంగా ఉచ్చేందుకు అవసరమైన చర్యలపై చర్చిస్తాను. కొవిడ్-19, వాతావరణ మార్పులపైనా అభిప్రాయాలు పంచుకుంటాం. [/quote]
ఘనస్వాగతం..
బైడెన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు శ్వేతసౌధం చేరుకున్న ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. శ్వేతసౌధం అధికారులు మోదీని సాదరంగా ఆహ్వానించారు.
#WATCH | Washington DC: Prime Minister Narendra Modi arrives at the White House to hold a bilateral meeting with US President Joe Biden. pic.twitter.com/f4v129fLbG
— ANI (@ANI) September 24, 2021
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets