అన్వేషించండి

Minister Vidadala Rajini: నారా లోకేష్ చేస్తున్నది వృథాయాత్ర - విశాఖలో మంత్రి రజనీ కామెంట్స్

King George Hospital Visakha: విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కోటి రూపాయల నిధులతో ఆధునికీకరణ పనుల కోసం ప్రారంభించారు మంత్రి విడుదల రజిని. అలాగే క్యాన్సర్ క్రిటికల్ యూనిట్ ను కూడా ప్రారంభించారు.  

Vidala Rajani In King George Hospital Visakha: నారా లోకేష్ యువగళం చూస్తే టీడీపీ పరిస్థితి ఏంటో అర్థం అవుతుందన్నారు మంత్రి విడుదల రజిని అన్నారు. లోకేష్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. నారా లోకేష్ చేస్తున్నది వృథాయాత్ర అని చెప్పుకొచ్చారు.

ఏపీ అడ్వాంటేజ్ పేరిట విశాఖను అభివృద్ధి చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు వివరించారు విడదల రజిని. వైజాగ్ వైపు ప్రపంచం చూస్తోందన్నారు. సీఎం వైజాగ్ వస్తారని చెప్పడంతో ఉత్తరాంధ్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. ఐటీ పరంగా, పారిశ్రామికంగా విశాఖ చురుకుగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. సీఎం విశాఖకు వస్తే ప్రజలు ఊహించని ప్రగతిని చూస్తారని అన్నారు. 

విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కోటి రూపాయలతో నిధులతో రాజేంద్రప్రసాద్ వార్డు ఆధునీకరణ పనులను వైద్యఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ప్రారంభించారు. కింగ్ జార్జ్ ఆసుపత్రిలో క్యాన్సర్ క్రిటికల్ యూనిట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున, సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, జడ్పీ ఛైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర ఉన్నారు. 

120 కోట్లతో క్యాన్సర్ కేర్ యూనిట్

2030 నాటికి క్యాన్సర్ నివారణలో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంటుందని మంత్రి విడుదల రజినీ తెలిపారు. క్యాన్సర్ నివారణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని.. ఏపీ బడ్జెట్‌లో 400 కోట్లను క్యాన్సర్ నివారణకు కేటాయించారన్నారు. కర్నూలులో 120 కోట్లతో క్యాన్సర్ కేర్ యూనిట్ ఏర్పాటు జరుగుతుందని చెప్పారు. విశాఖ కేజీహెచ్‌లో 60 కోట్లతో క్యాన్సర్ క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభించినట్లు వెల్లడించారు. క్యాన్సర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాలను బట్టి కోటి 60 లక్షల మంది ప్రతి ఏటా క్యాన్సర్‌కు గురవుతున్నారన్నారు. 2030 నాటికి 30 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నట్టు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే క్యాన్సర్ స్క్రీనింగ్ కి హోమీబాబా క్యాన్సర్ కేర్ సెంటర్ తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని మంత్రి విడుదల రజిని స్పష్టం చేశారు. 

పూర్తి ఉచితంగా, వేగంగా పేదలకు వైద్యం

మంత్రి రజని మాట్లాడుతూ పేద‌ల‌కు మెరుగైన వైద్యం పూర్తి ఉచితంగా, వేగంగా అందించేందుకు జ‌గ‌న‌ చిత్త‌ శుద్ధితో ప‌నిచేస్తున్నార‌ని తెలిపారు. ఆస్ప‌త్రుల్లో స‌రిప‌డా సిబ్బందిని  నియమించేందుకు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎంత ఖ‌ర్చైనా చేయ‌డానికైనా వెనుకాడ‌టం లేద‌ని తెలిపారు. నెల‌కు రూ.3ల‌క్ష‌ల‌ కంటే ఎక్కు‌వ చెల్లించేలా బిడ్డింగ్ పద్ధతి ద్వారా నిపుణులైన వైద్యుల నియామకం చేప‌డుతున్న ఏకైక ప్ర‌భుత్వం త‌మ‌ద‌ని చెప్పారు. పీహెచ్‌సీల నుంచి టీచింగ్ ఆస్ప‌త్రుల వ‌ర‌కు ఎక్క‌డా సిబ్బంది కొర‌త లేకుండా చూడాల్సిన బాధ్య‌త ఉన్న‌తాధికారుల‌పై ఉంద‌ని సూచించారు. మారుమూల ప్రాంతాల్లో సైతం ప్ర‌భుత్వం నిర్దేశించిన విధంగా సిబ్బంది ఉండేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని అన్నారు. 

ఈ మధ్యే ఢిల్లీలో కీలక ప్రకటన చేసిన కేసీఆర్

ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖపట్నం ఏపీ రాజధానిగా మారబోతోందని ప్రకటించారు. తాను కూడా అక్కడికి మారుతున్నట్లుగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ సన్నాహక సదస్సులో మాట్లాడుతూ స్వయంగా చెప్పారు. ఇన్వెస్టర్లను ఉద్దేశించి ఈ సమావేశంలో సీఎం జగన్‌ ప్రసంగించారు. పెట్టుబడిదారులు విశాఖపట్నానికి రావాలని ఆహ్వానించారు. మార్చి 3, 4 తేదీల్లో ఇన్వెస్టర్ల సదస్సు విశాఖపట్నంలోనే జరగనుందని జగన్ చెప్పారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Weather Latest Update: తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
Pushpa 2: నార్త్ ఇండియాలో 'పుష్ప' రూల్: థియేట్రికల్ రైట్స్‌‌తో కొత్త రికార్డ్స్ - ‘RRR’ను మించిపోయిందిగా!
నార్త్ ఇండియాలో 'పుష్ప' రూల్: థియేట్రికల్ రైట్స్‌‌తో కొత్త రికార్డ్స్ - ‘RRR’ను మించిపోయిందిగా!
Civils Topper: 'గోల్డ్ మన్ శాక్స్'లో కొలువు వదిలి సివిల్స్ వైపు - ఫస్ట్ ర్యాంకర్ శ్రీవాస్తవ ఏం చెప్పారంటే?
'గోల్డ్ మన్ శాక్స్'లో కొలువు వదిలి సివిల్స్ వైపు - ఫస్ట్ ర్యాంకర్ శ్రీవాస్తవ ఏం చెప్పారంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

BJP Madhavi Latha Srirama Navami Sobhayatra: శోభాయాత్రలో పాల్గొని ఎంఐఎంపై మాధవీలత విమర్శలుRaja Singh Srirama Navami Sobhayatra: శోభాయాత్ర సందడి, యువకులను ఉద్దేశిస్తూ రాజాసింగ్ ప్రసంగంJake Fraser McGurk Batting Ganguly Reaction: ఆ ఒక్క సిక్స్ చూసి జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిపోయిన గంగూలీRishabh Pant Tristan Stubbs Bowling: స్టంప్ మైక్ దగ్గర నుంచి స్టబ్స్ తో హిందీలో మాట్లాడిన పంత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Weather Latest Update: తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
Pushpa 2: నార్త్ ఇండియాలో 'పుష్ప' రూల్: థియేట్రికల్ రైట్స్‌‌తో కొత్త రికార్డ్స్ - ‘RRR’ను మించిపోయిందిగా!
నార్త్ ఇండియాలో 'పుష్ప' రూల్: థియేట్రికల్ రైట్స్‌‌తో కొత్త రికార్డ్స్ - ‘RRR’ను మించిపోయిందిగా!
Civils Topper: 'గోల్డ్ మన్ శాక్స్'లో కొలువు వదిలి సివిల్స్ వైపు - ఫస్ట్ ర్యాంకర్ శ్రీవాస్తవ ఏం చెప్పారంటే?
'గోల్డ్ మన్ శాక్స్'లో కొలువు వదిలి సివిల్స్ వైపు - ఫస్ట్ ర్యాంకర్ శ్రీవాస్తవ ఏం చెప్పారంటే?
Google Pixel 8a Colour: గూగుల్ పిక్సెల్ 8ఏ కలర్ ఆప్షన్లు లీక్ - ఈసారి నాలుగు కొత్త రంగుల్లో!
గూగుల్ పిక్సెల్ 8ఏ కలర్ ఆప్షన్లు లీక్ - ఈసారి నాలుగు కొత్త రంగుల్లో!
Preethi Pagadala: మా నాన్న ముద్దు సీన్లు వద్దన్నారు, అయినా వాళ్లు వినలేదు: ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రీతి పగడాల
మా నాన్న ముద్దు సీన్లు వద్దన్నారు, అయినా వాళ్లు వినలేదు: ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రీతి పగడాల
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
Embed widget