అన్వేషించండి

Microsoft Exchange Hack: ఓ చైనా.. ఎందుకిలా? సినిమాలో విలన్ లా

ఇటీవల మైక్రోసాఫ్ట్‌ సర్వర్ల ఎక్స్‌ఛేంజీని చైనా హ్యాక్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 30,000 కంపెనీల కీలక సమాచారాన్ని చైనా అపహరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చైనా.. మొన్నమొన్నటి వరకు ఈ పేరు వింటే మన పక్క దేశమే కదా అనిపించేది. కానీ కరోనా పేరు వినిపించినప్పటి నుంచి చైనాను సినిమాలో విలన్ లా చూస్తున్నాయి ప్రపంచ దేశాలు. అంత పెద్ద తప్పు చైనా ఏం చేసింది? అని తప్పులో కాలేయకండి. ఏం తప్పు చేయలేదు అని ఓసారి ఆలోచించండి. చైనా వుహాన్ లో పుట్టినట్లు భావిస్తోన్న కరోనా వైరస్.. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రపంచదేశాల్ని ఓ కుదుపు కుదిపేస్తోంది. పోని అంతటితో ఆగిందా? 
 
భారత్ లాంటి సరిహద్దు దేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. తనది కాని భూమిని తమదని బుకాయిస్తోంది. పోనీ.. అంతటితో ఆగిందా? ఇక హ్యాకింగ్ మొదలుపెట్టింది. ఇది చైనాకు కొత్తేం కాదనుకోండి. కానీ ఈసారి అంతకుమించి చేస్తోంది. ఈ జనవరిలో మైక్రోసాఫ్ట్‌ సర్వర్ల ఎక్స్‌ఛేంజీని చైనా హ్యాక్‌ చేసింది.. ఈ విషయాన్ని అమెరికా, యూకే, నాటో కూటమి ధ్రువీకరించింది. ప్రపంచ వ్యాప్తంగా 30,000 కంపెనీల కీలక సమాచారాన్ని అపహరించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అమెరికా మిత్రపక్షాలు- చైనా మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి.
 
ఇప్పటికే చైనాలోని మినిస్ట్రీ ఆఫ్‌ స్టేట్‌ సెక్యూరిటీ గూఢచర్యం చేయిస్తోందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. అదే సమయంలో ఈ హ్యాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంలో వెలుగులోకి వస్తున్నఅంశాలు గతంలో ఎన్నడూ చూడనంత తీవ్రమైనవని పశ్చిమదేశాలసెక్యూరిటీ ఏజెన్సీలు చెబుతున్నాయి.
 
ఇవేం పనులురా బాబు..!

చైనాతో సంబంధాలు ఉన్న హఫ్నిం అనే హ్యాకింగ్‌ గ్రూపు ఈ ఏడాది జనవరిలో మైక్రోసాఫ్ట్‌ సర్వర్‌ ఎక్స్‌ఛేంజీలో జీరోడేను గుర్తించింది. వీటిని వాడుకొని ఆ సర్వర్లలోకి చొరబడటానికి అవసరమైన బ్యాక్‌డోర్లను సిద్ధం చేసుకొంది. ఆ తర్వాత వీటిని ఉపయోగించుకొని ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ సర్వర్లలో చొరబడి డేటాను తస్కరించింది. సర్వర్లలో హ్యాకింగ్‌ అంటే.. భారీగా సమాచార తస్కరణ జరిగిందనే అర్థం. వ్యక్తిగత సమాచారం, పరిశోధనలకు సంబంధించిన కీలకమైన అంశాల వివరాలు వారికి లక్ష్యంగా మారాయి. ముఖ్యంగా రక్షణ రంగ కాంట్రాక్టర్లు, వ్యూహ బృందాలు, విశ్వవిద్యాలయాలను హఫ్నిం గ్రూపు లక్ష్యంగా చేసుకొన్నట్లు యూకే అధికారులు వెల్లడించారు.

జీరోడే అంటే..

ఒక సాఫ్ట్‌వేర్‌ లేదా ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తయారు చేసే సమయంలో ఇంజినీర్లు అత్యంత పకడ్బందీగా ఉంటారు. కానీ, ఏదో ఒక చిన్నలోపం వారి కన్నుగప్పుతుంది. అసమగ్రంగా, రక్షణ పరమైన బలహీనతలు, ప్రోగ్రామ్‌లో తప్పుల కారణంగా ఇవి పుట్టుకొస్తాయి. భవిష్యత్తులో కంప్యూటర్‌ రక్షణను బలహీన పరుస్తాయి. ఇటువంటి సాఫ్ట్‌వేర్‌ లోపాన్ని జీరోడేగా వ్యవహరిస్తారు.  గతంలో ఎవరూ గుర్తించని లోపమన్నమాట. హ్యాకర్లు ఈ బలహీనతలను లక్ష్యంగా చేసుకొనే మాల్‌వేర్‌కు కోడింగ్‌ రాస్తారు. అలాంటి మాల్‌వేర్లతో కంప్యూటర్లలోకి చొరబడి కీలక సమాచారం అపహరిస్తారు.

తెలిసేలోపే..

చైనా హ్యాకర్లు జీరోడేను గుర్తించిన వెంటనే దానిని వాడుకోవడానికి వేగంగా రంగంలోకి దిగినట్లు తేలింది. మరెవరైనా దీనిని గుర్తించి బహిర్గతం చేస్తే వాడుకోవడం కష్టమవుతుందని హ్యాకర్లు భావించినట్లు దర్యాప్తు బృందాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి నుంచి హ్యాకింగ్‌ బృందాలు.. కీలక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకొని భారీ ఎత్తున సైబర్‌ దాడులు చేశాయి. మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఈ జీరోడేను సరిదిద్దే ప్రయత్నాలను ముందుగానే పసిగట్టిన హ్యాకర్లు.. ఆ సాఫ్ట్‌వేర్‌ లోపాన్ని మిగిలిన చైనా హ్యాకింగ్‌ బృందాలతో పంచుకున్నారు.

దీంతో వీలైనంత పెద్ద ఎత్తున సమాచారాన్ని తస్కరించారు. మార్చి 2వ తేదీన ఈ మొత్తం హ్యాకింగ్‌ విషయాన్ని మైక్రోసాఫ్ట్‌ బహిర్గతం చేసి క్లైంట్లను అప్రమత్తం చేసింది. లోపాన్ని సరిచేస్తూ అవసరమైన ప్యాచ్‌ను కూడా విడుదల చేసింది. అప్పటికే భారీ నష్టం వాటిల్లింది.  ఈ హ్యాకింగ్‌తో కనీసం 2.5 లక్షల కంప్యూటర్ల భద్రత ప్రమాదంలో పడగా.. ఎంత తక్కువగా అంచనా వేసినా.. 30 వేల కంప్యూటర్లలో సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించారని దర్యాప్తు బృందాలు తేల్చాయి. దీని వెనుక చైనాకు చెందిన ఏటీపీ 40, ఏటీపీ 31 బృందాల హస్తం ఉందని పేర్కొన్నాయి.

పెద్దన్న ఏం చేస్తోంది..? 

చైనా సైబర్‌ కార్యకలాపాలపై ఎప్పుడైనా చర్యలు తీసుకొనే హక్కు అమెరికాకు ఉందని వైట్ హౌస్ ఈ విషయంపై స్పందిస్తూ పేర్కొంది. ఇక యూకే అధికారులు నేరుగా చైనాను నిందించారు. చైనా మద్దతుతో హ్యాకింగ్‌లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయం బయటపడినా.. డ్రాగన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జపాన్‌, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌ దేశాలు కూడా చైనా తీరును తప్పుబట్టాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Embed widget