అన్వేషించండి

Mission Divyastra: మిషన్ దివ్యాస్త్ర సక్సెస్ వెనక ఉంది మన హైదరాబాదీయే, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే

Divya Putri Sheena Rani: అగ్ని 5 మిజైల్ విజయం వెనక దివ్యపుత్రి షీనా రాణి కృషి ఎంతో ఉంది.

Divya Putri Sheena Rani: భారత్ ఇటీవలే మిషన్ దివ్యాస్త్రలో భాగంగా అగ్ని-5 మిజైల్‌ని విజయవంతంగా పరీక్షించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ DRDO శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. Multiple Independently Targetable Re-entry Vehicle (MIRV) టెక్నాలజీతో దీన్ని తయారు చేశారు. అయితే..ఈ మిజైల్ సిస్టమ్‌ని తయారు చేయడంలో మహిళలే కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా R షీనా రాణి పేరు ఎక్కువగా వినబడుతోంది. ఆమెకి Divya Putri అనే బిరుదు కూడా ఇచ్చేశారు. 57 ఏళ్ల షీనా రాణి మిజైల్స్ సిస్టమ్స్ తయారు చేయడంలో నిపుణురాలు. హైదరాబాద్‌లోని  Advanced Systems Laboratory (ASL)లో ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1999లో DRDO చేరారు. అప్పటికే భారత్‌ Pokhran-II అణుపరీక్షల్ని పూర్తి చేసింది. అప్పటి నుంచి Agni missile program లో భాగస్వామిగా ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఆమె 2012 నాటి Agni-5 మిజైల్ టెస్ట్‌ని గుర్తు చేసుకున్నారు. లాంఛింగ్‌కి అంతా సిద్ధం చేసుకున్నప్పటి నుంచే ఎంతో ఆందోళన చెందినట్టు వివరించారు. ఇప్పుడు మరోసారి టెస్ట్ చేసి విజయవంతంగా పూర్తి చేసినందుకు ఆనందం వ్యక్తం చేశారు. 

అబ్దుల్ కలామ్ స్ఫూర్తితో..

తిరువనంతపురంలో జన్మించిన షీనా రాణి పదో తరగతిలోనే తండ్రిని కోల్పోయారు. ఆ తరవాత అమ్మే అంతా తానై పెంచారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు అమ్మే కారణం అని చాలా గర్వంగా చెబుతారు షీనా రాణి. College of Engineering Trivandrum (CET)  లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తరవాత విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో 8 ఏళ్ల పాటు పని చేశారు. అక్కడి నుంచి DRDOకి వెళ్లారు. అప్పటి నుంచి అగ్ని-5 మిజైల్‌పై నిత్యం శ్రమించారు. కేవలం సరిహద్దుల్ని రక్షించుకోడానికే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో భారత రక్షణ రంగం సామర్థ్యం ఏంటో తెలియజెప్పేలా ఈ మిజైల్ ఉండాలని కలలుగన్నారు షీనా రాణి. వ్యూహాత్మకంగా భారత్‌ని ముందుంచాలన్న పట్టుదలతో  MIRV technologyని డెవలప్ చేశారు. ఒకే ఒక్క మిజైల్‌తో పలు వార్‌హెడ్స్‌ని ధ్వంసం చేయగల సామర్థ్యంతో ఈ టెక్నాలజీని రూపొందించారు. భారత దేశ మిజైల్‌ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న మాజీ రాష్ట్రపతి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ స్ఫూర్తితో తన కెరీర్‌ని ప్రారంభించారు షీనా రాణి. మిజైల్ టెక్నాలజిస్ట్ డాక్టర్ అవినాశ్ చందర్‌ శిష్యరికం చేశారు. ఆమె భర్త PSRS శాస్త్రి కూడా DRDOలోనే మిజైల్స్ టెక్నాలజీపైనే పని చేశారు. మొదటి నుంచి ఆమెకి ప్రోత్సాహాన్నిచ్చారు. MIRV టెక్నాలజీతో అగ్ని-5 క్షిపణిని తయారు చేసి విజయంవంతంగా పరీక్షించడం వల్ల ఈ సాంకేతికత ఉన్న దేశాల సరసన నిలబడింది భారత్. ప్రస్తుతానికి అమెరికా,యూకే, రష్యా, ఫ్రాన్స్ వద్దే ఈ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు ఈ జాబితాలోకి భారత్ కూడా వచ్చి చేరింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ మిజైల్‌ని తయారు చేసుకోవడం చాలా గొప్ప విషయం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ కితాబునిచ్చారు. 

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Actress Shobita: సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!కేజ్రీవాల్‌పై రసాయన దాడి, గ్లాసుతో పోసిన దుండగుడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Actress Shobita: సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Peelings Song Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
Maharastra CM: ఉత్కంఠకు తెర పడుతుందా? - రేపే మహారాష్ట్ర సీఎం పేరు ఖరారు!
ఉత్కంఠకు తెర పడుతుందా? - రేపే మహారాష్ట్ర సీఎం పేరు ఖరారు!
Mulugu Encounter: 'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
Kia Syros: చవకైన 7 సీటర్ కారును తీసుకురానున్న కియా - రూ.9 లక్షల్లోనే సైరోస్ ఎంట్రీ!
చవకైన 7 సీటర్ కారును తీసుకురానున్న కియా - రూ.9 లక్షల్లోనే సైరోస్ ఎంట్రీ!
Embed widget