అన్వేషించండి

Akash Missile System: పాకిస్తాన్ డ్రోన్ల పాలిట సింహస్వప్నం ఆకాశ్ మిస్సైల్స్ - రూపకర్త మన ప్రహ్లాద రామారావు గారే !

Akash Missile Prahlada Ramarao: భారత సైన్యం ఆకాశ్ క్షిపణి వ్యవస్థను ఉపయోగించి పాకిస్తాన్ డ్రోన్ దాడులను విజయవంతంగా అడ్డుకుంది. ఈ వ్యవస్థను మాజీ DRDO శాస్త్రవేత్త ప్రహ్లాద రామారావు రూపొందించారు.

Genius Behind Made In India Akash Missile System:  మే 8,  మే 9  రాత్రి సమయంలో జమ్మూ కాశ్మీర్‌లోని పశ్చిమ సరిహద్దు , నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ చేసిన అనేక డ్రోన్ దాడులను భారత సైన్యం విజయవంతంగా  కూల్చివేసింది.  మేడ్-ఇన్-ఇండియా ఆకాశ్ క్షిపణి వ్యవస్థ ఆకాశ్ ఈ పని తీరు చూపించింది. ఆకాశ్ క్షిపణి  పాకిస్తాన్‌కు కలిగించిన విధ్వంసం  భారతదేశంలో తయారు చేసిన ఆయుధాలను కూడా శత్రువులను సమర్థవంతంగా అడ్డుకోగలదని నిరూపించింది. 

 ఆకాశ్ మిస్సైల్  డెడ్లీ ఫైటర్ 

 ఆకాశ్ మిస్సైల్  స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన మధ్య శ్రేణి సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్  వ్యవస్థ. ఇది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (IGMDP)లో భాగంగా రూపొందించారు.   ఈ వ్యవస్థ భారత సైన్యం , వైమానిక దళంలో క్రియాశీలంగా ఉంది ఆకాశ్-NG వెర్షన్‌లో 70-80 కి.మీ. వరకు ఇది లక్ష్యాలను చేధిస్తుంది.  ఫైటర్ జెట్‌లు, క్రూయిజ్ మిస్సైళ్లు, డ్రోన్లు, హెలికాప్టర్లు, బాలిస్టిక్ మిస్సైళ్ల నుండి విడుదలైన వార్‌హెడ్‌లను నాశనం చేయగలదు. ఒకే మిస్సైల్‌తో 88 శాతం, రెండు మిస్సైళ్లతో 98.5 శాతం ఖచ్చితత్వంతో లక్ష్యాలను అందుకుంటుంది. 

ఆకాష్ మిస్సైళ్లను అభివృద్ధి చేయడానికి బారత్ చాలా కష్టపడింది.  1983లో  పరిశోదనలు ప్రారంభమయ్యాయి.  1990లో మొదటి టెస్ట్ ఫైరింగ్ చేశారు. 20 సంవత్సరాల పాటు అభివృద్ధి చేశారు.  భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, లార్సెన్ అండ్ టుబ్రో సంస్థలు తయారు చేస్తున్నాయి. వీటిని విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు.  మే 2015లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వాడటం ప్రారంభించార..ుు  మే 8-9, 2025 రాత్రి జమ్మూ కాశ్మీర్ మరియు పశ్చిమ సరిహద్దులో పాకిస్తాన్ డ్రోన్లు , మిస్సైళ్లను ఆకాశ్ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. ఇది భారత రక్షణ సామర్థ్యాలను, స్వదేశీ సాంకేతికత   శక్తిని నిరూపించింది.  

ఆకాష్ సృష్టికర్త  డాక్టర్ ప్రహ్లాద రామారావు  

ఆకాష్ క్షిపణి వెనుక మాస్టర్ మైండ్  డాక్టర్ ప్రహ్లాద రామారావు.  భారతదేశంలోని ప్రముఖ మిస్సైల్ సైంటిస్ట్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, DRDOలో దశాబ్దాల పాటు సేవలందించి, భారత రక్షణ సామర్థ్యాలను గణనీయంగా బలోపేతం చేశారు.  డాక్టర్ APJ అబ్దుల్ కలాం ఆయనను 37 ఏళ్ల వయసులో ఆకాశ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమించారు.  అతి చిన్న వయసులో ఈ బాధ్యత తీసుకున్న రికార్డు ప్రహ్లాద రామారావు సొంతం.  15 సంవత్సరాల్లో అభివృద్ధి చేయాలనుకున్నారు కానీ   బదులుగా 20 సంవత్సరాలు (1983-2003) పట్టినప్పటికీ, ఆకాశ్ వ్యవస్థను పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేశారు. అనేక దేశాలు ఆకాశ్ విజయవంతం కాదని విమర్శించాయి, కానీ డాక్టర్ కలాం మద్దతుతో, రామారావు 1,000 మంది శాస్త్రవేత్తల బృందంతో విజయం సాధించారు. 2005-2008 మధ్య జరిగిన ట్రయల్స్‌లో ఆకాశ్ విజయవంతంగా లక్ష్యాలను నాశనం చేసింది, 2008లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరింది  

 ఆకాశ్ వ్యవస్థ పాకిస్తాన్ దాడులను నిరోధించినప్పుడు, ఆయన దీనిని తన “జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు”గా వర్ణించారు, “నా బిడ్డ అద్భుతంగా పనిచేసింది” అని మీడియా సంస్థతో చెప్పారు. ప్రస్తుతం  హైలెనర్ టెక్నాలజీస్‌లో LENR రీసెర్చ్‌పై దృష్టి సారించారు.  ఇది న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా సస్టైనబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు.  

టాప్ హెడ్ లైన్స్

 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Dada Sourav Ganguly Comments: గంగూలీ 54వ బర్త్‌డే వేళ టీమిండియా ఓటమిపై సంచలన కామెంట్స్.. సంజూ శాంసన్ వివాదంపై 'దాదా' సేఫ్ గేమ్, రాజ్ కుమార్ రావు 'బయోపిక్' పోస్టర్ లాంచ్!
గంగూలీ 54వ బర్త్‌డే వేళ టీమిండియా ఓటమిపై Hot కామెంట్స్.. సంజూ శాంసన్ వివాదంపై 'దాదా' సేఫ్ గేమ్, రాజ్ కుమార్ రావు 'బయోపిక్' పోస్టర్ లాంచ్!
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Scindia Royal Family Property Dispute Settlement: 40 ఏళ్ల రాయల్ వార్‌కు తెర! గ్వాలియర్ కోర్టులో రూ. 40,000 కోట్ల సింధియా ఆస్తి వివాదం సుఖాంతం!
40 ఏళ్ల రాయల్ వార్‌కు తెర! గ్వాలియర్ కోర్టులో రూ. 40,000 కోట్ల సింధియా ఆస్తి వివాదం సుఖాంతం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget