అన్వేషించండి

Warangal News: చదివింది ఏంబీఏ - పారిశుద్ధ్య కార్మికురాలిగా భార్య, ఆటో డ్రైవర్ గా భర్త, ఆ కష్టం వెనుక కథ ఇదే!

MBA Graduate Couple: హన్మకొండ జిల్లాకు చెందిన ఆ దంపతులు చదివింది ఎంబీఏ. అయితే, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భార్య పారిశుద్ధ్య కార్మికురాలిగా చేస్తుండగా, భర్త ఆటో డ్రైవర్ గా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.

MBA Graduate Couple Doing Sanitation and Auto Driver Work in Warangal: ఆ దంపతులు ఉన్నత చదువులు చదివారు. అందరిలా మంచి ఉద్యోగాల్లో స్థిరపడి, సమాజంలో గొప్ప పేరు తెచ్చుకోవాలని భావించారు. అయితే, ఆర్థిక ఇబ్బందులు, చదువుకు తగ్గ ఉపాధి అవకాశాలు దొరక్క వారి ఆశలు అడియాశలయ్యాయి. కుటుంబ పోషణ కోసం భార్య పారిశుద్ధ్య కార్మికురాలిగా మారగా, భర్త ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. హన్మకొండ (Hanmakonda) జిల్లాకు చెందిన ఈ దంపతుల కష్టం వెనుక కథ అందరినీ ఆవేదనకు గురి చేస్తోంది.

హన్మకొండ జిల్లా వెంకటాపూర్ (Venkatapur) గ్రామానికి చెందిన మానస (Manasa), దిలీప్ కుమార్ (Dileepkumar) దంపతులు. ఒకే గ్రామానికి చెందిన వీరు పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ వివాహం చేసుకున్నారు. మానస ఎంబీఏ ఫైనాన్స్ చేయగా, దిలీప్ కుమార్ ఎంబీఏ మార్కెటింగ్ పూర్తి చేశారు. ఉన్నత విద్య పూర్తి చేశాం. ఇక జీవితం సాఫీగా సాగిపోతుందనుకున్న తరుణంలో ఆర్థిక ఇబ్బందులు, పరిస్థితులు వారిని ఎదుగుదలకు అడ్డంకిగా మారాయి. చదువుకు తగ్గ ఉపాధి అవకాశాలు లేక, కుటుంబ భారం పెరగడంతో మానస వెంకటాపూర్ పంచాయతీలోనే పారిశుద్ధ్య కార్మికురాలిగా మారారు. భర్త దిలీప్ కుమార్ ఆటో డ్రైవర్ గా మారి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.

ఆ విధుల్లో ఎలా చేరారంటే.?

ఎంబీఏ అర్హతతో ప్రైవేట్ ఉద్యోగంలో చేరితే రూ.7 వేలకు మించి రాకపోవడంతో మానస పారిశుద్ధ్య కార్మికురాలిగా చేరారు. ఇందులో నెలకు రూ.9 వేల వరకూ వస్తుందని, అందుకే పారిశుద్ధ్య కార్మికురాలిగా కొనసాగుతున్నట్లు ఆమె వెల్లడించారు. అయితే, పారిశుద్ధ్య కార్మికురాలిగా కూడా విచిత్రంగా ఆమె విధుల్లోకి వచ్చారు. మానస అత్తమ్మ కనికర వెంకటాపూర్ గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులిగా పనిచేసేది. ఆమెకు పక్షవాతం రావడంతో, ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా మానస గత రెండేళ్లుగా ఇలా విధులు నిర్వహిస్తున్నారు. మానస విద్యార్హతలు తమకు తెలియవని, ఆమె అత్తమ్మకు పక్షవాతం రాగా ఆ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారని, దీంతో పంచాయతీలో తీర్మానించి పారిశుద్ధ్య కార్మికురాలిగా నియమించామని పంచాయతీ సర్పంచ్ వెల్లడించారు.

కొద్దిలో చేజారిన ప్రభుత్వ ఉద్యోగం

తనకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కొద్దిలోనే మిస్ అయ్యాయని మానస తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం 2 మార్కులతో మిస్ అయ్యిందని చెప్పారు. ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లలో పరీక్షలు రాసిన తర్వాత రద్దు కావడంతో ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఉన్నత చదువులు చదివి ఈ ఉద్యోగం చేయడం పట్ల తోటి కార్మికులు ఆశ్చర్యానికి గురవుతున్నారని, అయినా పరిస్థితుల వల్ల తప్పడం లేదని మానస వాపోయారు. ప్రభుత్వం దృష్టి సారించి తన చదువుకు తగ్గ ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంత చదువుకుని కూడా తమతో పాటు కలిసి పారిశుద్ధ్య కార్మికురాలిగా మానస పని చేయడం బాధ కలిగిస్తుందని తోటి కార్మికులు అన్నారు. 

భర్త ఆటో డ్రైవర్ గా 

అటు, ఎంబీఏ చదివిన మానస భర్త దిలీప్ కుమార్ సైతం ఆటో డ్రైవర్ గా మారి జీవనం సాగిస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు చేసినా తనకు సంతృప్తి ఇవ్వలేదని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిద్దామంటే నోటిఫికేషన్లు లేక డ్రైవర్ గా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. తన లాంటి వారు చాలా మంది ఉపాధి అవకాశాలు లేక చదువుకొని కూడా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. 

ఏది ఏమైనా ఉన్నత విద్యను అభ్యసించిన దంపతులు ఇలా పారిశుద్ధ్య కార్మికురాలిగా, ఆటో డ్రైవర్ గా కుటుంబాన్ని పోషించుకోవాల్సి రావడం బాధాకరమనే చెప్పాలి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులు ఇలా కారణాలేవైనా వారు ఇలా ఉపాధి పొందడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Telangana Auto Drivers : ఆటోడ్రైవర్ల సమస్యలపై రేవంత్ సర్కార్ దృష్టి - న్యాయం చేస్తామన్న మంత్రి ప్రభాకర్ !

టాప్ హెడ్ లైన్స్

NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
CJP Protest: రెండు డిమాండ్లకు ప్రభుత్వం సిద్ధం! ధర్మేంద్ర రాజీనామా వీడని చిక్కుముడి! రెండో విడత సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకోండి!
రెండు డిమాండ్లకు ప్రభుత్వం సిద్ధం! ధర్మేంద్ర రాజీనామా వీడని చిక్కుముడి! రెండో విడత సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకోండి!
NEET Paper Leak:పరీక్ష పత్రాల లీకేజీకి పదేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా! ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం !
పరీక్ష పత్రాల లీకేజీకి పదేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా! ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం !
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget