అన్వేషించండి

Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

బీజేపీ చేస్తున్న మత రాజకీయాలపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ఓ రాయి, ఎర్రజెండా రావిచెట్టు కింద పెడితే గుడి అయిపోతుందని విమర్శలు చేశారు.

Akilesh Comments On Temple : " ఓ రాయి, ఎర్ర జెండా వాటిని రావి చెట్టు కింద ఉంచితే చాలు గుడి రెడీ అయిపోయినట్లే..." సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భారతీయ జనతా పార్టీ విభజన రాజకీయాలు చేస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్న అఖిలేష్.. తాజాగా ఆలయాల వివాదంపై స్పందించారు. ఇటీవల కాలంలో  జ్ఞానవాపి మసీదు అంశం హాట్ టాపిక్‌గా మారింది. అక్కడ శివలింగం బయటపడిన అంశం కూడా చర్చనీయాంశమవుతోంది. వీటిని రాజకీయ కోణంలో అఖిలేష్ యాదవ్ విశ్లేషించినట్లుగా కనిపిస్తోంది. 

మసీదు, ఆలయాల పేరుతో భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసి.. ప్రజల మధ్య విభజన రేఖ గీస్తోందని అఖిలేష్ ఆరోపిస్తున్నారు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఈ విధంగా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పెరుగుతున్న ధరలు, ద్రవోల్బణం వంటి వాటిపై మాట్లాడేందుకు బీజేపీ సిద్ధంగా లేదన్నారు. ఈ పరిణామాలన్నింటికీ బీజేపీ, ఆరెస్సెస్‌దే బాధ్యత అని.. అసలు కుట్రంతా అవే చేస్తున్నాయని అఖిలేష్ ఆరోపించారు. 

యూపీలోని సిద్ధార్థనగర్ లో ఇటీవల ఓ ముస్లిం మహిళను కొంత మంది కొట్టి చంపారు. ఈ ఘటనపై అఖిలేష్ యాదవ్ హైకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఈ హత్య అంశాన్ని లేవనెత్తుతానని ప్రకటించారు. గోవుల్ని వధిస్తున్నారన్న ఆరోపణలపై సిద్ధార్ధనగర్‌ లో దాడులు నిర్వహించిన సమయంలోనే మహిళ దాడికి గురయ్యారు. అందుకే పోలీసులే ఆ మహిళను చంపారని అఖిలేష్ ఆరోపిస్తున్నారు. చందోలిలో ఇటీవల ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోతే ఉరి వేసుకున్నట్లుగా పోలీసులు కథ అల్లారని అఖిలేష్ ఆరోపిస్తున్నారు. యూపీలో పోలీస్ ఫేక్ ఎన్ కౌంటర్స్, కస్టడీ మరణాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ బీజేపీకి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ...  అధికారం చేజిక్కించుకోలేకపోయారు. భారతీయ జనతా పార్టీ మత వ్యూహంతోనే అధికారం నిలబెట్టుకుందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇటీవలి కాలంలో యూపీలో పెద్ద ఎత్తున మతపరమైన ఘటనలు జరుగుతున్నాయని..పోలీసులు కూడా బాధితులకు అండగా ఉండటం లేదని అంటున్నారు. ఏదో ఓ వివాదం తెరమీదకు వస్తూండటంతో ఆయన ఆలయాలపై వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు.  అఖిలేష్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు సీరియస్‌గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.  దీంతో మరోసారి యూపీలో  మత పరమైన రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

 

 

టాప్ హెడ్ లైన్స్

అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
Court Denies Sushil Bail: ఒలింపియన్ సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget