అన్వేషించండి

Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

బీజేపీ చేస్తున్న మత రాజకీయాలపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ఓ రాయి, ఎర్రజెండా రావిచెట్టు కింద పెడితే గుడి అయిపోతుందని విమర్శలు చేశారు.

Akilesh Comments On Temple : " ఓ రాయి, ఎర్ర జెండా వాటిని రావి చెట్టు కింద ఉంచితే చాలు గుడి రెడీ అయిపోయినట్లే..." సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భారతీయ జనతా పార్టీ విభజన రాజకీయాలు చేస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్న అఖిలేష్.. తాజాగా ఆలయాల వివాదంపై స్పందించారు. ఇటీవల కాలంలో  జ్ఞానవాపి మసీదు అంశం హాట్ టాపిక్‌గా మారింది. అక్కడ శివలింగం బయటపడిన అంశం కూడా చర్చనీయాంశమవుతోంది. వీటిని రాజకీయ కోణంలో అఖిలేష్ యాదవ్ విశ్లేషించినట్లుగా కనిపిస్తోంది. 

మసీదు, ఆలయాల పేరుతో భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసి.. ప్రజల మధ్య విభజన రేఖ గీస్తోందని అఖిలేష్ ఆరోపిస్తున్నారు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఈ విధంగా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పెరుగుతున్న ధరలు, ద్రవోల్బణం వంటి వాటిపై మాట్లాడేందుకు బీజేపీ సిద్ధంగా లేదన్నారు. ఈ పరిణామాలన్నింటికీ బీజేపీ, ఆరెస్సెస్‌దే బాధ్యత అని.. అసలు కుట్రంతా అవే చేస్తున్నాయని అఖిలేష్ ఆరోపించారు. 

యూపీలోని సిద్ధార్థనగర్ లో ఇటీవల ఓ ముస్లిం మహిళను కొంత మంది కొట్టి చంపారు. ఈ ఘటనపై అఖిలేష్ యాదవ్ హైకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఈ హత్య అంశాన్ని లేవనెత్తుతానని ప్రకటించారు. గోవుల్ని వధిస్తున్నారన్న ఆరోపణలపై సిద్ధార్ధనగర్‌ లో దాడులు నిర్వహించిన సమయంలోనే మహిళ దాడికి గురయ్యారు. అందుకే పోలీసులే ఆ మహిళను చంపారని అఖిలేష్ ఆరోపిస్తున్నారు. చందోలిలో ఇటీవల ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోతే ఉరి వేసుకున్నట్లుగా పోలీసులు కథ అల్లారని అఖిలేష్ ఆరోపిస్తున్నారు. యూపీలో పోలీస్ ఫేక్ ఎన్ కౌంటర్స్, కస్టడీ మరణాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ బీజేపీకి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ...  అధికారం చేజిక్కించుకోలేకపోయారు. భారతీయ జనతా పార్టీ మత వ్యూహంతోనే అధికారం నిలబెట్టుకుందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇటీవలి కాలంలో యూపీలో పెద్ద ఎత్తున మతపరమైన ఘటనలు జరుగుతున్నాయని..పోలీసులు కూడా బాధితులకు అండగా ఉండటం లేదని అంటున్నారు. ఏదో ఓ వివాదం తెరమీదకు వస్తూండటంతో ఆయన ఆలయాలపై వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు.  అఖిలేష్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు సీరియస్‌గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.  దీంతో మరోసారి యూపీలో  మత పరమైన రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
NEET Paper Leak Talks: NEET వివాదంపై కేంద్రంతో సీజేపీ చర్చలు - రెండు డిమాండ్లకు ఓకే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే చిక్కుముడి !
NEET వివాదంపై కేంద్రంతో సీజేపీ చర్చలు - రెండు డిమాండ్లకు ఓకే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే చిక్కుముడి !
Gambhir - Dravid System Comparison: గంభీర్ కోచింగ్ స్టైల్ పై  అశ్విన్ విమర్శలు.. ద్రవిడ్ వ్యూహాలతో పోలుస్తూ కీలక వ్యాఖ్యలు!
గంభీర్ కోచింగ్ స్టైల్ పై  అశ్విన్ విమర్శలు.. ద్రవిడ్ వ్యూహాలతో పోలుస్తూ కీలక వ్యాఖ్యలు!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget