అన్వేషించండి

Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

బీజేపీ చేస్తున్న మత రాజకీయాలపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ఓ రాయి, ఎర్రజెండా రావిచెట్టు కింద పెడితే గుడి అయిపోతుందని విమర్శలు చేశారు.

Akilesh Comments On Temple : " ఓ రాయి, ఎర్ర జెండా వాటిని రావి చెట్టు కింద ఉంచితే చాలు గుడి రెడీ అయిపోయినట్లే..." సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భారతీయ జనతా పార్టీ విభజన రాజకీయాలు చేస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్న అఖిలేష్.. తాజాగా ఆలయాల వివాదంపై స్పందించారు. ఇటీవల కాలంలో  జ్ఞానవాపి మసీదు అంశం హాట్ టాపిక్‌గా మారింది. అక్కడ శివలింగం బయటపడిన అంశం కూడా చర్చనీయాంశమవుతోంది. వీటిని రాజకీయ కోణంలో అఖిలేష్ యాదవ్ విశ్లేషించినట్లుగా కనిపిస్తోంది. 

మసీదు, ఆలయాల పేరుతో భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసి.. ప్రజల మధ్య విభజన రేఖ గీస్తోందని అఖిలేష్ ఆరోపిస్తున్నారు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఈ విధంగా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పెరుగుతున్న ధరలు, ద్రవోల్బణం వంటి వాటిపై మాట్లాడేందుకు బీజేపీ సిద్ధంగా లేదన్నారు. ఈ పరిణామాలన్నింటికీ బీజేపీ, ఆరెస్సెస్‌దే బాధ్యత అని.. అసలు కుట్రంతా అవే చేస్తున్నాయని అఖిలేష్ ఆరోపించారు. 

యూపీలోని సిద్ధార్థనగర్ లో ఇటీవల ఓ ముస్లిం మహిళను కొంత మంది కొట్టి చంపారు. ఈ ఘటనపై అఖిలేష్ యాదవ్ హైకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఈ హత్య అంశాన్ని లేవనెత్తుతానని ప్రకటించారు. గోవుల్ని వధిస్తున్నారన్న ఆరోపణలపై సిద్ధార్ధనగర్‌ లో దాడులు నిర్వహించిన సమయంలోనే మహిళ దాడికి గురయ్యారు. అందుకే పోలీసులే ఆ మహిళను చంపారని అఖిలేష్ ఆరోపిస్తున్నారు. చందోలిలో ఇటీవల ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోతే ఉరి వేసుకున్నట్లుగా పోలీసులు కథ అల్లారని అఖిలేష్ ఆరోపిస్తున్నారు. యూపీలో పోలీస్ ఫేక్ ఎన్ కౌంటర్స్, కస్టడీ మరణాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ బీజేపీకి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ...  అధికారం చేజిక్కించుకోలేకపోయారు. భారతీయ జనతా పార్టీ మత వ్యూహంతోనే అధికారం నిలబెట్టుకుందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇటీవలి కాలంలో యూపీలో పెద్ద ఎత్తున మతపరమైన ఘటనలు జరుగుతున్నాయని..పోలీసులు కూడా బాధితులకు అండగా ఉండటం లేదని అంటున్నారు. ఏదో ఓ వివాదం తెరమీదకు వస్తూండటంతో ఆయన ఆలయాలపై వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు.  అఖిలేష్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు సీరియస్‌గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.  దీంతో మరోసారి యూపీలో  మత పరమైన రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget