అన్వేషించండి

ఏ పార్టీపైనా పక్షపాతం చూపించం,పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తాం - ఈసీ

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.

Lok Sabha Polls 2024: త్వరలోనే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈలోగా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటించి స్థానిక ఎన్నికల అధికారులతో సమావేశమవుతోంది. ఈ క్రమంలోనే యూపీలో పర్యటించింది. ఆ తరవాత ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. ఎన్నికలు ఎలా నిర్వహించనున్నారో మీడియాకి వివరించారు. ఎన్నికల ప్రక్రియని పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఏ పార్టీపైనా పక్షపాతం చూపించే అవకాశముండదని తేల్చి చెప్పారు. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే తమతో మాట్లాడాయని, ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలని డిమాండ్ చేశాయని తెలిపారు. ఎన్నికల్లో ధన బలాన్ని వినియోగించడం మానుకోవాలని సూచించారు. 

"లోక్‌సభ ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. నిబంధనలు అన్ని పార్టీలకూ ఒకే విధంగా అమలవుతాయి. ఏ పార్టీపైనా పక్షపాతం చూపించం. ఆప్‌, బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో పాటు కొన్ని ప్రాంతీయ పార్టీలూ మాతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఎన్నికల్లో ఎక్కడా అవకతవకలు జరగకుండా సమర్థంగా నిర్వహించాలని డిమాండ్ చేశాయి. పోలీసులు ఏకపక్షంగా పని చేయడం మానుకోవాలని చెప్పాయి. అంతే కాదు. ఎన్నికల్లో కొన్ని పార్టీలు ధనబలాన్ని వినియోగిస్తున్నాయని, దీనిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశాయి"

- రాజీవ్ కుమార్, ప్రధాన ఎన్నికల అధికారి 

ఇదే సమయంలో యూపీలోని ఎన్నికల స్థితిగతులపైనా మాట్లాడారు రాజీవ్ కుమార్. తొలిసారి ఓటు వేసే మహిళల సంఖ్య ఈ సారి ఎక్కువగా ఉందని, వాళ్లందరి కోసం అన్ని పోలింగ్‌ బూత్‌లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు. 85  ఏళ్లు పైబడిన ఓటర్లు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు. 

"ఈ సారి తొలిసారి ఓటు వేసే మహిళల సంఖ్య 7 లక్షల 26 వేల వరకూ ఉంది. పోలింగ్ బూత్‌లలో వీళ్లందరికీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. వాళ్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండూ చూసుకుంటాం. కొన్ని పోలింగ్ బూత్‌లను పూర్తిగా మహిళలే నిర్వహిస్తారు. 85 ఏళ్లు పైబడిన వాళ్లు ఇంట్లో నుంచే ఓటు వేసేలా వెసులుబాటు తీసుకొస్తాం. ఈ ఎన్నికల ప్రక్రియలో అర్హులందరూ భాగస్వాములు కావాలి"

- రాజీవ్ కుమార్, ప్రధాన ఎన్నికల అధికారి 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
Breaking News: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం: మస్కటీన్‌లో ఏడుగురి దుర్మరణం
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం: మస్కటీన్‌లో ఏడుగురి దుర్మరణం
IPL 2026 Flop Playing XI: ఐపీఎల్ 2026 ఫ్లాప్ ప్లేయింగ్ ఎలెవన్ : రిషభ్ పంత్ కెప్టెన్.. సూర్య, హార్దిక్ ,  బుమ్రాలకు చోటు.. నిరాశపరిచిన స్టార్ ప్లేయర్స్
ఐపీఎల్ 2026 ఫ్లాప్ ప్లేయింగ్ ఎలెవన్ : రిషభ్ పంత్ కెప్టెన్.. సూర్య, హార్దిక్ ,  బుమ్రాలకు చోటు.. నిరాశపరిచిన స్టార్ ప్లేయర్స్
Hyderabad Traffic Diversions: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
YS Sharmila Rajya Sabha Seat Congress: షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
EPFO 3.0 PF withdrawal via ATM:ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
Hyderabad Traffic Diversions: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
Dry ginger vs Fresh ginger: అల్లం Vs శొంఠి ఆరోగ్యానికి ఏది మంచిది? ఎలా వినియోగించాలి?
అల్లం Vs శొంఠి ఆరోగ్యానికి ఏది మంచిది? ఎలా వినియోగించాలి?
ABP India at 2047: అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
Embed widget