అన్వేషించండి

ఏ పార్టీపైనా పక్షపాతం చూపించం,పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తాం - ఈసీ

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.

Lok Sabha Polls 2024: త్వరలోనే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈలోగా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటించి స్థానిక ఎన్నికల అధికారులతో సమావేశమవుతోంది. ఈ క్రమంలోనే యూపీలో పర్యటించింది. ఆ తరవాత ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. ఎన్నికలు ఎలా నిర్వహించనున్నారో మీడియాకి వివరించారు. ఎన్నికల ప్రక్రియని పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఏ పార్టీపైనా పక్షపాతం చూపించే అవకాశముండదని తేల్చి చెప్పారు. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే తమతో మాట్లాడాయని, ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలని డిమాండ్ చేశాయని తెలిపారు. ఎన్నికల్లో ధన బలాన్ని వినియోగించడం మానుకోవాలని సూచించారు. 

"లోక్‌సభ ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. నిబంధనలు అన్ని పార్టీలకూ ఒకే విధంగా అమలవుతాయి. ఏ పార్టీపైనా పక్షపాతం చూపించం. ఆప్‌, బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో పాటు కొన్ని ప్రాంతీయ పార్టీలూ మాతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఎన్నికల్లో ఎక్కడా అవకతవకలు జరగకుండా సమర్థంగా నిర్వహించాలని డిమాండ్ చేశాయి. పోలీసులు ఏకపక్షంగా పని చేయడం మానుకోవాలని చెప్పాయి. అంతే కాదు. ఎన్నికల్లో కొన్ని పార్టీలు ధనబలాన్ని వినియోగిస్తున్నాయని, దీనిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశాయి"

- రాజీవ్ కుమార్, ప్రధాన ఎన్నికల అధికారి 

ఇదే సమయంలో యూపీలోని ఎన్నికల స్థితిగతులపైనా మాట్లాడారు రాజీవ్ కుమార్. తొలిసారి ఓటు వేసే మహిళల సంఖ్య ఈ సారి ఎక్కువగా ఉందని, వాళ్లందరి కోసం అన్ని పోలింగ్‌ బూత్‌లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు. 85  ఏళ్లు పైబడిన ఓటర్లు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు. 

"ఈ సారి తొలిసారి ఓటు వేసే మహిళల సంఖ్య 7 లక్షల 26 వేల వరకూ ఉంది. పోలింగ్ బూత్‌లలో వీళ్లందరికీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. వాళ్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండూ చూసుకుంటాం. కొన్ని పోలింగ్ బూత్‌లను పూర్తిగా మహిళలే నిర్వహిస్తారు. 85 ఏళ్లు పైబడిన వాళ్లు ఇంట్లో నుంచే ఓటు వేసేలా వెసులుబాటు తీసుకొస్తాం. ఈ ఎన్నికల ప్రక్రియలో అర్హులందరూ భాగస్వాములు కావాలి"

- రాజీవ్ కుమార్, ప్రధాన ఎన్నికల అధికారి 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget