అన్వేషించండి

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల ఎజెండా సిద్ధం చేస్తున్న బీజేపీ, 2 రోజుల పాటు జాతీయ స్థాయి సమావేశాలు

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల ఎజెండాని సిద్ధం చేసేందుకు బీజేపీ రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనుంది.

Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికలకు ఎజెండా సిద్ధం చేసుకుంటోంది బీజేపీ. ఇప్పటికే ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్‌షా నేతృత్వంలో భేటీ జరిగింది. ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. అయితే...ఇంకా ఎన్నికల ఎజెండాని మాత్రం ఖరారు చేయలేదు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 17,18వ తేదీల్లో జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహించనుంది అధిష్ఠానం. ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 17న సమావేశాలను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 18న ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆయన చేతుల మీదుగా ఈ సమావేశాలు ముగుస్తాయి. అంతకన్నా ముందే మరో కీలక భేటీ జరగనుంది. జనరల్ సెక్రటరీలు, మున్సిపల్ కార్పొరేషన్‌, నగర పంచాయితీలు, జిల్లా పంచాయితీల అధ్యక్షులందరికీ హైకమాండ్ ఆహ్వానం అందించింది. ఇక రెండు రోజుల సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ కార్యదర్శితో పాటు జిల్లాల అధ్యక్షులు, లోక్‌సభ కన్వీనర్‌లు, క్రమశిక్షణా కమిటీ, ఆర్థిక కమిటీ సభ్యులు, ఐటీ సెల్‌ అధికారులకు ఆహ్వానం పంపింది. రెండు రోజుల పాటు మేధోమథనం సాగనుంది. ఈ సమావేశాల్లోనే పూర్తిస్థాయి ఎజెండాని సిద్ధం చేసి ఆ తరవాత అధికారికంగా ప్రకటించనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు మరో రెండు నెలల సమయమే ఉన్నందున వీలైనంత వేగంగా ఎజెండాని సిద్ధం చేసుకుని ప్రచారానికి రెడీ అయిపోవాలని భావిస్తోంది బీజేపీ. అంతే కాదు. ప్రధానిగా మూడోసారి మోదీ కచ్చితంగా గెలుస్తారన్న ధీమా వ్యక్తం చేస్తోంది. గతంలో కన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. 

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోంది. హ్యాట్రిక్‌ సాధించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లు, కో ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. బిహార్‌ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా వినోద్‌ తవ్‌దే, ఝార్ఖండ్‌కి లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్, హరియాణాకి విప్లవ్ కుమార్ దేవ్‌ని ఎంపిక చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 96 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీళ్లలో 47 కోట్ల మంది మహిళలున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ పోలింగ్ కోసం దేశవ్యాప్తంగా 12 లక్షల పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయనున్నారు. 18-19 ఏళ్ల మధ్య ఉన్న యువ ఓటర్ల సంఖ్య కోటి 73 లక్షల వరకూ ఉంది. ఎన్నికల నిర్వహణ కోసం కోటిన్నర మంది సిబ్బందిని నియమించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. 1951 నాటికి దేశవ్యాప్తంగా ఓటర్ల సంఖ్య 17.32 కోట్లుగా ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 1957 నాటికి అది 19.37 కోట్లకు పెరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయానికి ఓటర్ల సంఖ్య 91.20 కోట్లుగా ఉంది. ఇప్పుడది 96 కోట్లకు పెరిగింది. ఓటు హక్కు కోసం రిజిస్టర్ చేసుకున్న వాళ్లలో 18 లక్షల మంది దివ్యాంగులున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 67% ఓటింగ్ నమోదైనట్టు ఈసీ స్పష్టం చేసింది.  Modi Ko Chunte Hain పేరుతో ఈ క్యాంపెయిన్‌ని ప్రారంభించింది. ప్రత్యేకంగా ఓ పాట కూడా విడుదల చేసింది. "కల కాదు..ఇదే నిజం. మళ్లీ ప్రజలు మోదీనే ఎన్నుకుంటారు" అనే అర్థం వచ్చేలా ఉన్న ఈ పాటను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు బీజేపీ నేతలు.

Also Read: అద్వానీకి భార‌త‌రత్న వెనుక‌ మోడీ రాజ‌కీయ వ్యూహాలు.. తెలిస్తే ఆశ్చ‌ర్యపోతారు !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget