News
News
X

Liquor Price: మందు బాబుల జేబులకు చిల్లు, ఒక్కో బాటిల్‌పై అదనపు బాదుడు

Liquor Price Himachal: హిమాచల్‌ప్రదేశ్‌లో మద్యంపై సెస్‌ను భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

FOLLOW US: 
Share:

Liquor Price Himachal Pradesh: 

లిక్కర్‌పై సెస్ పెంపు..

మందు బాబులకు ఇదో చేదు వార్త. లిక్కర్, బీర్ ధరలు మరింత ప్రియం కానున్నాయి. సెస్‌ కింద ఒక్కో బాటిల్‌పై అదనంగా రూ.17 కట్టాల్సి ఉంటుంది. అంతకు ముందు ఈ పన్ను కేవలం రూ.7గా ఉండేది. ఇప్పుడు ఏకంగా పది రూపాయలు పెంచి షాక్ ఇచ్చింది ప్రభుత్వం. ఇంతకీ ఇదెక్కడో చెప్పలేదు కదూ. హిమాచల్‌ ప్రదేశ్‌లో. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచే ఈ ధరలు అమల్లోకి రానున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మద్యంపై సెస్‌ను పెంచుతున్నట్టు సీఎం సుఖ్వీందర్ సింగ్ సుకు వెల్లడించారు. వీటితో పాటు మిల్క్ సెస్‌ను కూడా పెంచారు. ఒక్కో పెట్ బాటిల్‌పై రూ.10 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాదు. Godhan Development Fund కింద మరో రూ.2.50 కట్టాలి. ఇటీవలే హిమాచల్ ప్రదేశ్‌లో కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలోనే సెస్‌ను పెంచాలన్న చర్చ వచ్చింది. అయితే అంతకు ముందు ఉన్న కొవిడ్ సెస్‌ను తొలగించి ఆ స్థానంలో కొత్త సెస్‌లను తీసుకురావాలని నిర్ణయించారు. అందులో భాగంగానే మద్యం, పాలపై పన్ను భారం మోపారు. ఈ సెస్‌లో ప్రతి బాటిల్‌పై రూ.1.50 మేర ఎక్సైజ్ డెవలప్‌మెంట్ ఫండ్‌కు వెళ్తుంది. రూ.2 మేర సెస్‌ను పంచాయతీ రాజ్‌ నిధులకు తరలిస్తారు. పంచాయతీలను అభివృద్ధి చేసేందుకు ఈ నిధులు ఖర్చు చేస్తారు. వీటితో పాటు హెల్త్ సర్వీసెస్‌ విభాగానికీ రూ.1 మేర సెస్‌ కేటాయిస్తారు. ఆంబులెన్స్ సేవల్ని మెరుగు పరిచేందుకు ఈ నిధులను ఖర్చు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 

హిమాచల్‌ప్రదేశ్‌లో ఏటా రూ.1,829 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతాయి. ఏటా తలసరి వినియోగం 9  బాటిళ్లుగా ఉన్నట్టు ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. నెలకు 75 లక్షల బాటిళ్లు అమ్ముడవుతున్నాయి. రోజుకు 2.5 లక్షల బాటిళ్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఈ మద్యం విక్రయాల ద్వారా ఏటా కనీసం రూ.2,400 కోట్లు ఆర్జించాలని టార్గెట్‌గా పెట్టుకుంది హిమాచల్ ప్రభుత్వం. 

 

Published at : 10 Mar 2023 12:53 PM (IST) Tags: Liquor Price Himachal Pradesh Himachal Pradesh Liquor Price Cess

సంబంధిత కథనాలు

Covid Guidlines: కరోనా పెరుగుతున్న వేళ కేంద్రం కీలక మార్గదర్శకాలు, ఆ మందులు వాడొద్దదని వార్నింగ్!

Covid Guidlines: కరోనా పెరుగుతున్న వేళ కేంద్రం కీలక మార్గదర్శకాలు, ఆ మందులు వాడొద్దదని వార్నింగ్!

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌