అన్వేషించండి

Kharge on Modi Govt: 'పార్లమెంటులో చైనాకు వ్యతిరేకంగా మాట్లాడకూడదా?'- మోదీకి ఖర్గే ప్రశ్న

Kharge on Modi Govt: భారత్- చైనా సైనికుల మధ్య తాజాగా జరిగిన ఘర్షణపై పార్లమెంటులో చర్చించేందుకు మోదీ సర్కార్ ఎందుకు భయపడుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నిలదీశారు.

Kharge on Modi Govt: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ సమీపంలో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

" మోదీ ప్రభుత్వం తమ ఎర్రటి కళ్లను చైనా కళ్లద్దాలతో కప్పుకున్నట్లు అనిపిస్తోంది. భారత పార్లమెంటులో చైనాకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు అనుమతి లేదా?                                     "
-  మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు

ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చకు డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు గత రెండు రోజులుగా సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నాయి. సున్నితమైన భారత్-చైనా సరిహద్దు సమస్యపై చర్చకు ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపిస్తూ సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీలు, తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ్యులు బుధవారం సభ నుంచి వాకౌట్ చేశారు.

డిమాండ్

ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే 'ఇండో-చైనా సరిహద్దు పరిస్థితి'పై చర్చ జరగాలని కాంగ్రెస్ సభా నాయకుడు అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. 1962లో చైనా యుద్ధం సమయంలో దివంగత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ లోక్‌సభలో చర్చకు అనుమతించారని గుర్తు చేశారు.

" మేము భారత్-చైనా సరిహద్దు పరిస్థితులపై చర్చకు డిమాండ్ చేస్తున్నాం. 1962లో భారత్- చైనా యుద్ధం సమయంలో, జవహర్‌లాల్ నెహ్రూ ఈ సభలో 165 మంది ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాతే ఏమి చేయాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు.                   "
-అధీర్ రంజన్ చౌదరి, లోక్‌సభలో కాంగ్రెస్ సభా పక్ష నేత 

కాంగ్రెస్ నేత డిమాండ్‌పై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఇదీ జరిగింది 

డిసెంబర్ 9న అరుణాచల్‌ ప్రదేశ్‌ తవాంగ్‌ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్దకు చైనా సైనికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పీఎల్‌ఏ సేనలు తమ సరిహద్దు దాటి భారత భూభాగంలో పెట్రోలింగ్‌కు వచ్చిన సమయంలో ఈ ఘర్షణ జరిగింది. యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించిన.. చైనా జవాన్లను మన దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. మన భూభాగంలోకి చొరబడకుండా చైనా సైనికులను.. భారత దళాలు ధైర్యంగా నిలువరించి వారిని తిరిగి తమ స్థానానికి వెళ్లేలా చేశాయి. 

ఘర్షణ జరిగిన సమయంలో సుమారు 600 మంది పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ దళ సభ్యులు అక్కడున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్‌కు చెందిన కనీసం మూడు వేర్వేరు యూనిట్లు ఘర్షణ స్థలంలో ఉన్నట్లు సమాచారం.  మరోవైపు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఈ ఘటనపై లోక్‌సభలో ప్రకటన చేశారు.

Also Read: FIFA World Cup 2022: బీభత్సం సృష్టించిన మొరాకో ఫ్యాన్స్- ఓటమిని తట్టుకోలేక!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu CM Vijay: ఒకప్పుడు అవమానం... నేడు తమిళనాడు సీఎంగా విజయ్ - నెహ్రూ స్టేడియంలో దళపతికి చేదు అనుభవం!
ఒకప్పుడు అవమానం... నేడు తమిళనాడు సీఎంగా విజయ్ - నెహ్రూ స్టేడియంలో దళపతికి చేదు అనుభవం!
Mahindra Bolero Price Hike: మహీంద్రా బొలెరో ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు! క్లాసిక్, నియో మోడళ్లపై ఎఫెక్ట్
మహీంద్రా బొలెరో ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు! క్లాసిక్, నియో మోడళ్లపై ఎఫెక్ట్
Suzuki Swift Hydrogen Prototype: హైడ్రోజన్ పవర్ తో దూసుకెళ్లనున్న స్విఫ్ట్.. నితిన్ గడ్కరీ కలల కారు సిద్ధం! అదిరిపోయే పవర్, క్లీన్ ఎనర్జీ
హైడ్రోజన్ పవర్ తో దూసుకెళ్లనున్న స్విఫ్ట్.. నితిన్ గడ్కరీ కలల కారు సిద్ధం! అదిరిపోయే పవర్, క్లీన్ ఎనర్జీ
Trisha Krishnan Car Collection: దక్షిణ భారత సినీ రాణి త్రిష కార్ల క‌లెక్ష‌న్ తెలుసా.. మెర్సిడెస్ నుంచి రేంజ్ రోవ‌ర్ వ‌రకు అద్భుతమైన కార్లు సొంతం
దక్షిణ భారత సినీ రాణి త్రిష కార్ల క‌లెక్ష‌న్ తెలుసా.. మెర్సిడెస్ నుంచి రేంజ్ రోవ‌ర్ వ‌రకు అద్భుతమైన కార్లు సొంతం

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadapa Tipu Sultan Issue: కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల కుర్రాడు
వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల కుర్రాడు
Tamil Nadu Updates: తమిళనాడు రాజకీయాల్లో ముగిసిన సస్పెన్స్ -ఆదివారమే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం!
తమిళనాడు రాజకీయాల్లో ముగిసిన సస్పెన్స్ -ఆదివారమే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం!
PM Modi Hyderabad Tour: ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
Panchali Panchabhartruka: అప్పటి రాజేంద్ర ప్రసాద్‌ను చూస్తారు... 'పాంచాలి పంచభర్తృక'పై నటకిరీటి ధీమా
అప్పటి రాజేంద్ర ప్రసాద్‌ను చూస్తారు... 'పాంచాలి పంచభర్తృక'పై నటకిరీటి ధీమా
India next CDS : భారత త్రివిధ దళాల నూతన అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి - అజిల్ ధోవల్ మార్క్ !
భారత త్రివిధ దళాల నూతన అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి - అజిల్ ధోవల్ మార్క్ !
Pumpkin Seeds : ఉదయాన్నే నానబెట్టిన గుమ్మడి గింజలు తింటే కలిగే లాభాలు.. ఆరోగ్య ప్రయోజనాల కోసం తినేయండి
ఉదయాన్నే నానబెట్టిన గుమ్మడి గింజలు తింటే కలిగే లాభాలు.. ఆరోగ్య ప్రయోజనాల కోసం తినేయండి
Suzuki Swift Hydrogen Prototype: హైడ్రోజన్ పవర్ తో దూసుకెళ్లనున్న స్విఫ్ట్.. నితిన్ గడ్కరీ కలల కారు సిద్ధం! అదిరిపోయే పవర్, క్లీన్ ఎనర్జీ
హైడ్రోజన్ పవర్ తో దూసుకెళ్లనున్న స్విఫ్ట్.. నితిన్ గడ్కరీ కలల కారు సిద్ధం! అదిరిపోయే పవర్, క్లీన్ ఎనర్జీ
Embed widget