అన్వేషించండి

Youtube chanels : ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే

ఉద్యోగులు యూట్యూబ్ చానల్స్ నిర్వహించకూడదని కేరళ ప్రభత్వం ఆదేశాలు జారీ చేసింది.

 

Youtube chanels  :   యూట్యూబ్ చానల్ అనేది ఇప్పుడు చాలా మందికి ఓ అదనపు ఆదాయ వనరు అయింది. తమ దగ్గర ఉన్న స్కిల్ లేదా మరో విధమైన టాలెంట్ ను చూపించి అత్యధిక వ్యూయర్ షిప్ సాధించి ఎంతో కొంత ఆదాయాన్ని పొందాలనుకుంటున్నారు. ఇలాంటి వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉంటున్నారు. ఇప్పటి వరకూ యూట్యూబ్ చానల్ పెట్టుకోవడానికి ఒక్క ఈమెయిల్ ఉంటే చాలు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఇంక అలాంటి చాన్స్ లేదు. ఖచ్చితంగా ఎలాంటి చానల్ నిర్వహించడానికి అవకాశం లేదు. అయితే ఇది అందరికీ కాదు.. కేరళ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే.                

ఇటీవల కేరళ ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి యూట్యూబ్‌ ఛానల్‌ ను నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. విధులు నిర్వహించే ఏ ఉద్యోగి కూడా యూట్యూబ్‌ ఛానల్‌ను నడపరాదని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా అలాచేస్తే కేరళ ప్రభుత్వ ఉద్యోగుల నియమావళి 1960 ప్రకారం ఉల్లంఘనే అవుతుందని తేల్చి చెప్పింది.ఉద్యోగులు ఇంటర్నెట్, సోషల్ మీడియాను ఉపయోగించేందుకు మాత్రమే వారి వ్యక్తిగత స్వేచ్ఛ పరిమితమని, సబ్‌స్క్రైబర్లను కలిగి ఉండేందుకు, యూట్యూబ్ చానల్ ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందేందుకు దానిని ఉపయోగించకూడదని జీవోలో పేర్కొంది.                           

యూట్యూబ్ చానల్ నిర్వహణకు అనుమతి కోరుతూ అగ్నిమాపక సిబ్బంది  విజ్ఞప్తి చేశారు. అయితే అధికారికంగా శాఖల తరరపు నిర్వహించుకోవచ్చు కానీ.. వ్యక్తిగతంగా నిర్వహించడం సాధ్యం కాదని..  ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఇప్పటికే యూట్యూబ్ ఛానళ్లు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు తమ చానళ్లను మూసివేయాలని ఆ జీవోలో కోరింది. కేరళలో యూట్యూబ్ చానల్స్ నిర్వహించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అక్షరాస్యత  శాతం ఎక్కువ కావడం... అక్కడ ప్రతీ కుటుంబం నుంచి కనీసం ఒకరైనా గల్ఫ్ లో ఉద్యోగం చేస్తూ ఉండటం వంటి కారణాలతో పాటు రాజకీయంగానూ యువత ఎతో యాక్టివ్ గా ఉంటుంది. ఈ కారణంగా యూట్యూబ్ చానల్స్ ను నిర్వహిస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇందులో ఏ మాత్రం తీసిపోలేదు.              

హఠాత్తుగా.. ప్రభుత్వం యూట్యూబ్ చానల్స్ ను ఉద్యోగులు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వడంతో కొన్ని వేల మంది ఉద్యోగులకు షాక్ లాంటిదే. అయితే ఉద్యోగులు ఏ ఇతర ఆదాయాన్ని కూడా పొందకుండా...  సర్వీస్ రూల్స్ ఉన్నాయని .. యూట్యూబ్ చానల్ ద్వారా ఆదాయం వస్తుందని.. అందుకే కేరళ ప్రభుత్వం  ఈ నిర్ణయం తీసుకుందని  భావిస్తున్నారు. ఒకవేళ ఇతర  ప్రభుత్వాలు కూడా ఈ నిర్ణయం పట్ల ఆసక్తి చూపిస్తే..  కొన్ని వేల మంది ఇతర రాష్ట్రాల ఉద్యోగులకూ షాక్ తప్పదు.                     

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

భారత్‌లో కొత్త Skoda Kushaq Facelift లాంచింగ్.. క్రెటా, డస్టర్‌లకు గట్టి పోటీ తప్పదు
భారత్‌లో కొత్త Skoda Kushaq Facelift లాంచింగ్.. క్రెటా, డస్టర్‌లకు గట్టి పోటీ తప్పదు
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
Harish Rao vs Revanth Reddy: హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget