By: ABP Desam | Updated at : 17 Oct 2021 07:40 PM (IST)
Edited By: Murali Krishna
విజయన్కు ప్రధాని మోదీ ఫోన్
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. కేరళలో వర్షాలు, వరదల ధాటికి 21 మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని విచారం వ్యక్తం చేశారు. కేరళను అన్ని విధాలా ఆదుకుంటామని మోదీ హామీ ఇచ్చారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు.
Spoke to Kerala CM Shri @vijayanpinarayi and discussed the situation in the wake of heavy rains and landslides in Kerala. Authorities are working on the ground to assist the injured and affected. I pray for everyone’s safety and well-being.
— Narendra Modi (@narendramodi) October 17, 2021
It is saddening that some people have lost their lives due to heavy rains and landslides in Kerala. Condolences to the bereaved families.
— Narendra Modi (@narendramodi) October 17, 2021
కేరళ సీఎం శ్రీ పినరయి విజయన్తో రాష్ట్రంలో సంభవించిన వరదల గురించి చర్చించాను. క్షతగాత్రులను, బాధితులను కాపాడేందుకు అధికార యంత్రాంగం శ్రమిస్తోంది. అందరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను.
వర్షాలు, వరదల వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించింది. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
21 మంది మృతి..
భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ఘటనలో కేరళలో మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కొట్టాయంలో 13 మంది, ఇడుక్కి జిల్లాలో 8 మంది మృతి చెందారు. ఈ మేరకు కేరళ ప్రభుత్వం వెల్లడించింది.
సీఎం సమావేశం..
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని విజయన్ ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు.
భారీ వర్షాలకు నదులు, డ్యామ్లలో నీరు పెరుగుతుందని తదుపరి 24 గంటలు హై అలర్ట్లో ఉండాలన్నారు. ఇప్పటికే సైన్యం, వాయుసేన, నౌకాదళం సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని సీఎం విజయన్ వెల్లడించారు.
అమిత్ షా హామీ..
కేరళలో కురుస్తోన్న భారీ వర్షాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. వర్షాలు, వరదల పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు అమిత్ షా అన్నారు. ప్రజలను కాపాడేందుకు కేంద్రం అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వానికి సాయమందిస్తుందన్నారు.
Also Read: Kerala Rain Fury: కేరళలో మహా విలయం.. వర్షాలు, వరదల ధాటికి 21 మంది మృతి
Also Read: హైదరాబాద్లో ఉల్టా సీన్.. యువకుడి న్యూడ్ వీడియోలతో యువతి బ్లాక్ మెయిల్
Also Read: భర్త నిద్రిస్తుండగా అక్కడ వేడి వేడి నీళ్లు పోసిన భార్య
JEE Advanced 2022 Registration: జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
TS VROs G.O 121 : వీఆర్వోల సర్దుబాటు జీవో 121 పై తెలంగాణ హైకోర్టు స్టే
Ticket booking: ఐదు నిమిషాల ముందే రైలులో టికెట్ బుక్ చేస్కోవచ్చు!
Mla Jeevan Reddy : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యాయత్నం కేసు, దాడికి అసలు కారణమిదే?
Palnadu News : పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన కానిస్టేబుల్, రూ.5 లక్షలతో పరారీ
India Medal Tally: 22 స్వర్ణాలతో నాలుగో స్థానంలో భారత్ - కామన్వెల్త్ గేమ్స్లో మన ప్రస్థానం ఇదే!
కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్మీ కొత్త ఫోన్ లాంచ్కు రెడీ!
రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!
Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం