అన్వేషించండి

Telangana: కేసీఆర్ అండతోనే రాయలసీమ ఎత్తిపోతల, జగన్‌తో చీకటి ఒప్పందం- అసెంబ్లీలో బాంబు పేల్చిన కాంగ్రెస్

Rayalaseema Lift Irrigation: కేసీఆర్ అండతోనే రాయలసీమ ఎత్తిపోతల. ఏపీ సీఎం జగన్‌తో చీకటి ఒప్పందం- తెలంగాణ అసెంబ్లీలో బాంబు పేల్చిన కాంగ్రెస్

KCR supports for Rayalaseema Lift Irrigation: హైదరాబాద్: తెలంగాణ నీటి పంపకాలపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చ.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య యుద్ధంలా మారింది. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో సాగునీటి రంగాన్ని నాశనం చేసిందని తెలంగాణ ప్రయోజనాలను కాలరాసిందని అధికార కాంగ్రెస్ సభ్యులు బలంగా వాదించారు. కృష్ణా ప్రాజెక్టులను KRMB కి అప్పగించకూడదనే తీర్మానంపై మొదలైన చర్చ.. మరో మలుపు తిరిగింది. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏపీతో పూర్తిగా రాజీపడిపోయిందని తెలంగాణ మంత్రులు విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించే రాయలసీమ ప్రాజెక్టు ప్రారంభం కావడానికి కేసీఆర్ కారణమంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 

రాయలసీమ ప్రాజెక్టు టెండర్లకు సహకరించిన కేసీఆర్ 
అసెంబ్లీలో సోమవారం (ఫిబ్రవరి 12న) ఉదయం నుంచి తీర్మానంపై జరుగుతున్న చర్చ.. రాయలసీమ ఎత్తిపోతలపైకి వెళ్లింది. కిందటి ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దేందుకే తీర్మానం అంటూ.. పదేళ్లలో ఏం జరిగిందో నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిని సరిచేయడానికి తీర్మానానికి ఆమోదం తెలపాలని కోరారు. దీనిపై మాజీ నీటి పారుదల మంత్రి హరీష్‌రావు సమాధానం ఇస్తుండగా ఉత్తమ్‌తో పాటు... మంత్రులు పొన్నం, సుధీర్‌బాబు, కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క పలు సందర్భాల్లో అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం మాట్లాడారు. అయితే చర్చ జరుగుతున్న క్రమంలో రాయలసీమ ఎత్తిపోతల పాపం పూర్తిగా కేసీఆర్‌దే అని  ఉత్తమ్ కుమార్ అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు రేయింబవళ్లు జరుగుతున్నా అప్పటి తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు ఖరారవుతున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకపోగా.. కావాలనే టెండర్లకు సహకరించిందన్నారు. ఏపీ సీఎం జగన్‌తో ఉన్న రహస్య ఒప్పందం కారణంగానే అప్పటి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుకు సహకరించిందని ఆరోపించారు. 

అభ్యంతరం చెప్పాల్సి ఉంటుందని కేసీఆర్ హాజరు కాలేదా!
రాయలసీమ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రులతో అపెక్స్ కమిటీ సమావేశం నిర్వహించాలనుకుందని.. దీనికి హాజరైతే ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి కేసీఆర్ ఈ మీటింగ్‌కు హాజరుకాలేదన్నారు. ఆగస్టు 10, 2020 న ప్రాజెక్టుకు టెండర్లు ఫైనలైజ్ అయ్యాయని.. అంతకంటే ముందే అపెక్స్ కమిటీ సమావేశం జరగాల్సి ఉన్నా.. కేసీఆర్ గైర్హాజరీ వల్ల అది జరగలేదని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేందుకు జగన్ మోహనరెడ్డికి సహకరించారన్నారు. “తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున సమావేశాన్ని 20వ తేదీ జరపాలని” కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని.. ఇదంతా ఏపీ ప్రభుత్వంతో ముందస్తు ఒప్పందంలో భాగమేనని ఆరోపించారు. 

ప్రభుత్వం ఆరోపణలు ఖండించిన హరీష్ 
మంత్రుల ముప్పేట దాడిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ఎదుర్కొన్నారు. ఒకరి తర్వాత ఒకరు మంత్రులు ఆరోపణలు సంధిస్తున్నా ఆయనొక్కరే సమాధానం ఇచ్చారు. పోతిరెడ్డిపాడు కాలువ వెడల్పు చేస్తున్నప్పుడు.. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్లంతా అసెంబ్లీలోనే ఉన్నారని.. అప్పుడు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేసి ప్రాజెక్టుపై స్టే తీసుకొచ్చామని వాదించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget