By: Ram Manohar | Updated at : 08 Apr 2023 04:15 PM (IST)
కర్ణాటకలో సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్, బీజేపీ విమర్శలు చేసుకుంటున్నాయి.
Karnataka Elections 2023:
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పూర్తి స్థాయిలో ఎలక్షన్ మూడ్లోకి వచ్చేశాయి. కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఇప్పుడీ విషయంలోనే కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. టికెట్లు కేటాయించడంలో రెండు పార్టీలు అంతర్మథనం చెందుతున్నాయి. సీనియర్ నేతలందరూ టికెట్ కోసం క్యూ కడుతున్నారు. వాళ్లను కాదని కొత్త వాళ్లకు ఇచ్చే పరిస్థితుల్లో రెండు పార్టీలు లేనట్టే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ 166 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బీజేపీ ఇంత వరకూ ఒక్క అభ్యర్థినీ ప్రకటించలేదు. ఈ విషయంలో కాంగ్రెస్ కాస్త ముందంజలోనే ఉంది. అందుకే..బీజేపీపై విమర్శలు మొదలు పెట్టింది. బీజేపీలోని నేతలందరూ ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకోలేకపోతున్నారని, ఎక్కడ పోటీ చేయాలో అర్థం కాక సందిగ్ధంలో ఉన్నారని కాంగ్రెస్ ప్రతినిధి రణ్దీప్ సింగ్ సుర్జేవాలా చేసిన కామెంట్స్ బీజేపీకి ఆగ్రహం కలిగించాయి. సీనియర్ నేతలందరూ పోటీకి దూరంగా ఉన్నారనీ అన్నారు సుర్జేవాలా. అందుకే స్టార్ క్యాంపెయినర్లపైన ఆధారపడ్డారంటూ విమర్శించారు. దీనిపై గట్టిగానే బదులు చెబుతోంది కాషాయ పార్టీ. బీజేపీ రాజ్యసభ ఎంపీ లహర్ సింగ్ సిరోయా ట్విటర్ వేదికగా కాంగ్రెస్పై విమర్శలు చేశారు. సిద్దరామయ్యను ఎక్కడి నుంచి బరిలోకి దింపాలో అర్థంకాక కాంగ్రెస్ తలపట్టుకుంటోందంటూ సెటైర్లు వేశారు. అంతకు ముందు 2018లో సిద్దరామయ్య బదామీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇప్పుడా నియోజకవర్గాన్నే ఆయన కాదనుకుంటున్నారని అన్నారు లహర్ సింగ్. చాముండేశ్వరి నియోజకవర్గంలో దారుణంగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు.
#WATCH | "Because CM doesn't want to fight election from his seat & his ministers don’t want to contest from their seats either. All are running away from their seats. Nobody wants to contest the election therefore, they’re dependent on film stars & rowdy sheeters… No one would… pic.twitter.com/ucjfFRN56J
— ANI (@ANI) April 7, 2023
సందిగ్ధంలో కాంగ్రెస్
రాహుల్ గాంధీపైనా విమర్శలు చేసిన లహర్ సింగ్...ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే విషయంలో కాంగ్రెస్ ఎన్నో ఇబ్బందులు పడుతోందని అన్నారు. సిద్దరామయ్య రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని డిమాండ్ చేస్తున్నారని, ఇది అధిష్ఠానానికి ఇబ్బందికరంగా మారిందని తేల్చి చెప్పారు. అయితే..మొదట కోలార్ నుంచి పోటీ చేస్తానని సిద్దరామయ్య ప్రకటించారు. ఆ తరవాత పరిణామాలు మారిపోయాయి. వరుణ నియోజకవర్గం ఫైనల్ అయింది. దీంతో పాటు మరో చోట నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అధిష్ఠానం మాత్రం ఈ విషయంలో తర్జనభర్జన పడుతోంది. "ఒక అభ్యర్థికి ఒకే సీటు" పాలసీని అమలు చేస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే మరో విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది కాంగ్రెస్. ఇక బీజేపీ మరో రెండు రోజుల్లో ఈ లిస్ట్ను ఫైనలైజ్ చేయనుంది.
Can you first explain why @siddaramaiah has run away from Badami, Chamundeshwari and Kolar? He is your ‘mass leader’ without a constituency. Why did @RahulGandhi run away to Wayanad? Can you name the constituency you lost in Haryana? @rssurjewala @INCIndia @INCKarnataka
— Lahar Singh Siroya (@LaharSingh_MP) April 7, 2023
1/2 https://t.co/RcAyG6hedE
Also Read: Ukrainian Minister: భారత్కు రానున్న ఉక్రెయిన్ మంత్రి, మానవతా సాయం కోసం అభ్యర్థిస్తారా?
మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్ చేసేందుకు సీఐడీకీ అనుమతి
CIBIL Score: సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా లోన్ వస్తుంది! ఈ చిట్కాలు ప్రయోగించండి
Coin Deposit: బ్యాంక్ అకౌంట్లో ఎన్ని నాణేల్ని డిపాజిట్ చేయవచ్చు?
ICAR JRF: ఐసీఏఆర్ ఏఐసీఈ- జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్డీ)-2023 నోటిఫికేషన్, ప్రవేశాలు ఇలా!
Gold-Silver Price Today 30 May 2023: ఎటూ కదలని పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు
Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం
CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్లో జీటీపై చెన్నై విక్టరీ!
MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?