అన్వేషించండి

Melodi: అది మోదీజీలోని గొప్ప క్వాలిటీ, మెలోని సెల్ఫీ వీడియోపై కంగనా రనౌత్ ఇంట్రెస్టింగ్ కామెంట్

Melodi Video: ప్రధాని మోదీ, మెలోనీ సెల్ఫీ వీడియోపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

PM Modi Meloni Selfie: సోషల్ మీడియాలో #Melodi హ్యాష్‌ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలో జరిగిన G7 సదస్సుకి హాజరయ్యారు. అక్కడ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మెలోని మోదీతో సెల్ఫీ తీసుకున్నారు. సెల్ఫీ వీడియో కూడా రికార్డ్ చేశారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. పైగా "Hi friends, from #Melodi" అని ఆ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. కొందరు మీమ్ వీడియోలూ చేసి పోస్ట్ చేస్తున్నారు.

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ ఈ ఫొటోపై స్పందించారు. మహిళలకు మోదీ ఎప్పటికీ ఇలాగే మద్దతుగా ఉంటారని ప్రశంసల జల్లు కురిపించారు. మోదీని మెలోని అంతగా అభిమానించడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదని అన్నారు. మెలోని షేర్ చేసిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ఇదంతా రాసుకొచ్చారు కంగనా రనౌత్. 

"మహిళలకు మద్దతునివ్వడం వాళ్లకు అండగా ఉండడం ప్రధాని మోదీజీలో ఉన్న గొప్ప లక్షణాల్లో ఒకటి. మహిళలు ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆయన ఆకాంక్షిస్తారు. ఇటలీ ప్రధాని మెలోని మోదీని అంతగా అభిమానించడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అది మోదీలో ఉన్న గొప్ప క్వాలిటీ"

- కంగనా రనౌత్, బీజేపీ ఎంపీ

Kangana's story.

మూడోసారి ప్రధాని అయ్యాక మోదీ తొలి విదేశీ పర్యటన ఇదే. G7లో భారత్ సభ్య దేశం కాకపోయినా ఆహ్వానం అందింది. గతంలోనూ ఫ్రాన్స్‌లో జరిగిన G7 సదస్సుకి మోదీ హాజరయ్యారు. ఈ సారి కూడా హాజరైన ఆయన కీలక చర్చలు జరిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో పాటు మేక్రాన్, రిషి సునాక్‌తోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక బంధాన్ని బలపరుచుకునే దిశగా చర్చించారు. పలు కీలక రంగాల్లో పరస్పర సహకారానికి చొరవ చూపించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. సదస్సులో ఏర్పాట్లు చాలా గొప్పగా చేశారని ఇటలీ ప్రధాని మెలోనిపై ప్రశంసలు కురిపించారు. ఇటలీతో మైత్రిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రానున్న తరాలకు మంచి భవిష్యత్ అందించే దిశగా చర్చలు జరిగినట్టు వివరించారు. 

Also Read: G7 Summit: స్మైల్ ప్లీజ్, G7 సమ్మిట్‌లో మెలోని మోదీ స్పెషల్ సెల్ఫీ - ఫొటో వైరల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Warangal BRS Office :  అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు -   కూల్చేస్తారా ?
అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు - కూల్చేస్తారా ?
TGRTC Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
PM Modi: 'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Warangal BRS Office :  అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు -   కూల్చేస్తారా ?
అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు - కూల్చేస్తారా ?
TGRTC Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
PM Modi: 'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Embed widget