అన్వేషించండి

Kakinada News: కరోనా భయంతో ఇంటికే పరిమితం అయిన తల్లీకూతుళ్లు - దాదాపు మూడేళ్లుగా చీకట్లోనే జీవనం!

Kakinada News: కరోనా భయంతో ఓ తల్లీ, కూతురు నాలుగేళ్లుగా చీకటి గదిలోనే బంధీలుగా మారారు. బయటకు వస్తే కరోనా వచ్చి చనిపోతామని బయటకు రావడమే మానేశారు. చివరకు ఏమైందంటే..?

Kakinada News: కరోనా.. ఈ పేరు వింటేనే చాలా మంది వణికిపోయారు ఒకప్పుడు. ఇప్పటికీ ఆ పేరు వింటే చాలా మంది కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎందుకంటే కరోనా సోకి వారు పడ్డ ఇబ్బందులు, తమ వాళ్లను పోగొట్టుకొని అనాథలు అయిన వారిలో ఇంకా కరోనా వైరస్ భయాలు పోలేదు. కానీ ఆ తల్లీ, కూతుళ్లకు ఇప్పటికీ కరోనా అంటే వెన్నులో వణుకు పుడుతోంది. అందుకే దాదాపు మూడేళ్ల నుంచి పడక గదిలోనే బంధీలుగా మారారు. బయటకు వస్తే కరోనా వచ్చి చనిపోతామంటూ ఇంట్లోంచి అడుగు బయట పెట్టకుండా చీకట్లోనే కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఈ వింత ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. 

అసలేం జరిగిందంటే..?

కాకినాడ జిల్లా కాజులూరు మండలం కుయ్యేరు గ్రామానికి చెందిన తల్లి మణి, కూతురు భవాని కరోనా భయంతో బయటకి రావడమే మానేశారు. ఈ వింత ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు మూడేళ్ల నుంచి బెడ్ రూంలో చీకట్లోనే ఉంటున్నారు. అయితే తల్లి మణి తీవ్ర అనారోగ్యం పాలవ్వగా ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో వైద్య సిబ్బంది వచ్చి వీరిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ వారు దుప్పటి ముసుగు లోనుంచి బయటకు రాకుండా బయట కరోనా ఉందని, తాము కరోనా వచ్చి చనిపోతామని చెబుతుండడం గమనార్హం. కరోనా భయం అనే మానసిక ఫోబియాతో వీరు ఇంటి ప్రధాన ద్వారం వద్దకు కూడా రాలేదని చెబుతున్నారు. 24 గంటలూ గదిలోనే బందీలుగా ఉంటున్నారని స్థానికులు అంటున్నారు.

వీరుంటున్న వీధిలో కరోనా రావడంతో.. 

2020లో కరోనా మొదటి వేవ్‌లో కుయ్యేరులోని మణి, భవానీలు ఉంటున్న ఇంటి సమీపంలోనే ఒకరికి కరోనా సోకింది.  అప్పట్లో కరోనా సోకిన ప్రాంతమంతా ఎవ్వరూ బయటకు రాకూడదని ప్రచారం జరగడంతో పాటు ఆప్రాంతం అంతా రాకపోకలు నిషేధించారు. దీంతో కరోనా భయంతో ఇంట్లో నుంచి బయటకు రావడం మానేశారు తల్లీకూతురు. మణి, భవానీలు అదే భయంతో ఆనాటి నుంచి ఇంట్లోనే ఉండడం మొదలు పెట్టారు. కరోనా భయం ఫోబియాగా మారి బయటకు వస్తే కరోనా వచ్చి మరణిస్తామని బలంగా మనసులో నాటుకుపోవడంతో అక్కడకు ఎవ్వరు వెళ్లినా దుప్పట్లో ఉండే మాట్లాడుతూ కరోనా వస్తుంది, వెళ్లిపొమ్మని అంటున్నారని స్థానికులు చెబుతున్నారు.

రెండు గంటల పాటు శ్రమించి ఆసుపత్రికి..

దాదాపు మూడేళ్ల నుంచి గదికే పరిమితిమైన తల్లీకూతుర్లు అనారోగ్యం పాలవ్వగా తల్లి మణి పరిస్థితి మరింత విషమించింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది వచ్చి ఎంత ప్రయత్నించినా  వాళ్లు సహకరించలేదు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. స్థానికుల సాయంతో వారిని ఆసుపత్రికి తరిలించారు. అయితే తండ్రి వీరికి వండి పెట్టడం, లేదా బయట నుంచి ఆహారాన్ని తీసుకురావడం జరుగుతుండగా.. కరోనా తగ్గిపోయిందని చెబుతున్నప్పటికీ వారు బయటకు రాలేదని, వాళ్లే మెళ్లిగా మారుతారని అనుకుంటున్నాని ఆయన చెప్పారు. అయితే ఆరోగ్యం బాగోకపోయినా వీరి పరిస్థితి మారకపోవడంతో చివరకు స్థానిక సర్పంచ్‌, పక్కింటి వారికి చెప్పానని తండ్రి తెలిపాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Latest News:ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
CM Revanth Reddy: నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
CM Revanth Reddy: నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
Earthquake: అఫ్గాన్‌లో భారీ భూకంపం, భారత్‌లో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కంపించిన భూమి
అఫ్గాన్‌లో భారీ భూకంపం, భారత్‌లో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కంపించిన భూమి
IPL 2025 KKR VS PBKS Result Update:  చరిత్ర సృష్టించిన పంజాబ్ .. లీగ్ లో లోయెస్ట్ స్కోరును డిఫెండ్ చేసిన కింగ్స్.. 16 రన్స్ తో కేకేాఆర్ ఓటమి.. రాణించిన ప్రభు సిమ్రాన్, చాహల్
చరిత్ర సృష్టించిన పంజాబ్ .. లీగ్ లో లోయెస్ట్ స్కోరును డిఫెండ్ చేసిన కింగ్స్.. 16 రన్స్ తో కేకేాఆర్ ఓటమి.. రాణించిన ప్రభు సిమ్రాన్, చాహల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PBKS vs KKR Match Highlights | కేకేఆర్ పై 16 పరుగుల తేడాతో పంజాబ్ సెన్సేషనల్ విక్టరీ | ABP DesamMS Dhoni Player of the Match vs LSG | ఆరేళ్ల తర్వాత తొలిసారి IPL 2025 లో ధోని కి అవార్డ్PBKS vs KKR Match preview IPL 2025 | నేడు పంజాబ్ ను ఢీకొట్టనున్న కోల్ కతాRishabh Pant 63 vs CSK | IPL 2025 సీజన్ లో తొలిసారి టచ్ లోకి వచ్చిన రిషభ్ పంత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Latest News:ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
CM Revanth Reddy: నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
CM Revanth Reddy: నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
Earthquake: అఫ్గాన్‌లో భారీ భూకంపం, భారత్‌లో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కంపించిన భూమి
అఫ్గాన్‌లో భారీ భూకంపం, భారత్‌లో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కంపించిన భూమి
IPL 2025 KKR VS PBKS Result Update:  చరిత్ర సృష్టించిన పంజాబ్ .. లీగ్ లో లోయెస్ట్ స్కోరును డిఫెండ్ చేసిన కింగ్స్.. 16 రన్స్ తో కేకేాఆర్ ఓటమి.. రాణించిన ప్రభు సిమ్రాన్, చాహల్
చరిత్ర సృష్టించిన పంజాబ్ .. లీగ్ లో లోయెస్ట్ స్కోరును డిఫెండ్ చేసిన కింగ్స్.. 16 రన్స్ తో కేకేాఆర్ ఓటమి.. రాణించిన ప్రభు సిమ్రాన్, చాహల్
AP Government Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 2,260 టీచర్ పోస్టుల భర్తీకీ గ్రీన్ సిగ్నల్, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 2,260 టీచర్ పోస్టుల భర్తీకీ గ్రీన్ సిగ్నల్, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
Kalvakuntla Kavitha: కేసీఆర్‌లా కాదు నేను కాస్త రౌడీ టైప్ - కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన కల్వకుంట్ల కవిత
కేసీఆర్‌లా కాదు నేను కాస్త రౌడీ టైప్ - కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన కల్వకుంట్ల కవిత
AP Cabinet decisions: ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
Vizag Flight Issue:విశాఖ నుంచి విజయవాడ వెళ్లాలంటే ఇంత కష్టమా? గంటా అసంతృప్తి!
విశాఖ నుంచి విజయవాడ వెళ్లాలంటే ఇంత కష్టమా? గంటా అసంతృప్తి!
Embed widget