అన్వేషించండి

సీఎం జగన్‌ను శత్రువుగా ప్రకటించుకున్న పాల్- పవన్‌కు తానే రోల్ మోడల్ అంటూ కామెంట్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేయడం మంచి పరిణామమని కేఏ పాల్ అన్నారు. కోమటిరెడ్డి బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారని తెలిపారు.

ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డితో తనకు నేటి నుంచి శత్రుత్వం మొదలైందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్ధాపకుడు కేఏ పాల్ ప్రకటించారు. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన పాల్.. అధికార పార్టీపై తీవ్ర స్ధాయిలో‌ మండిపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డితో శత్రుత్వం మొదలైందన్న పాల్‌... ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే పోలీసులు తనను టార్గెట్ చేసుకున్నారు. పోలీసులు తన పట్ల చాలా దురుసుగా ప్రవర్తించారని వెల్లడించారు. పద్మావతి మహిళా విశ్వ విద్యాలయ విద్యార్థినులను కలిసి ఆశీర్వదించానే తప్ప... వారితో తప్పుగా ప్రవర్తించలేదని తెలిపారు. విశ్వవిద్యాలయ సిబ్బందితో కూడా దురుసుగా ప్రవర్తించలేదని, అసలు పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం హాస్టల్‌లోకి వెళ్లనేలేదని ఆయన వివరణ ఇచ్చారు.

కేఏ పాల్.. సీఎం అంటూ నినాదాలు చేశారు..

వైసీపీ కార్యకర్త ప్రేమ్ కుమార్ తనను తప్పుదారి పట్టించారని.. కేఏ పాల్ సీఎం అని విద్యార్థులు నినాదాలు చేస్తుండగా జీర్ణించుకోలేక పోయారన్నారు. మహిళా విశ్వ విద్యాలయంలో ఉండగానే పోలీసులకు వైసీపీ కార్యకర్త ప్రేమ్ కుమార్ ఫోన్ చేసి చెప్పారని వివరించారు.  ఎం.ఆర్.పల్లి సీఐ సురేందర్ రెడ్డి తనపై చేయి చేసుకున్నట్లు కే.ఏ.పాల్ చెప్పారు. తనకు జరిగిన అవమానానికి సీఐ సురేందర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం జగన్‌కు చిత్తశుద్థి ఉంటే తనపై జరిగిన దాడికి వెంటనే స్పందించాలని అన్నారు. మూడు రోజుల్లో జగన్ స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తానని కే.ఏ.పాల్ హెచ్చరించారు.

కావాలనే సీఎం జగన్ దాడి చేయించారు: పాల్

జగన్ అక్రమాస్తుల విషయంలో సీబీఐ డైరెక్టర్‌తో మాట్లాడానని, జగన్‌కు ఎన్నో సార్లు సపోర్ట్ చేశానని, అలాంటి తనపై సీఎం దాడి చేయించారని కేఏ పాల్ ఆరోపించారు. కడప జిల్లాకు రోడ్డు మార్గం గుండా వస్తున్నామని, సాయంత్రం కడప నగరంలో సభ పెట్టామని తెలిపారు. దమ్ముంటే సీఎం తనను ఆపగలరా అని ఆయన సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది సీఎం జగనే అంటూ ఆరోపించారు. ప్రస్తుతం అప్పు 8 లక్షల కోట్లకు చేరుకుందని.. ఇకపై అప్పు ఇచ్చే వాళ్లు కూడా లేని దౌర్భాగ్య స్థితికి చేరుకున్నామని విమర్శించారు. తనను రోల్‌ మోడల్‌గా తీసుకుంటానని చెప్పిన పవన్ కల్యాణ్‌ తన పార్టీతో ఎందుకు కలవడం లేదని ప్రశ్నించారు.  

రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారు..

కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని కేఏ పాల్ అన్నారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుంచో బీజేపీ అగ్ర నేతలతో టచ్ లో ఉన్నారని.. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పూర్తిగా పతనమైన పార్టీ అని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కే.ఏ.పాల్ విమర్శించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Embed widget