అన్వేషించండి

Jharkhand Trust Vote: విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్న ఝార్ఖండ్ సీఎం సోరెన్, అప్రమత్తమైన భాజపా

Jharkhand Trust Vote: ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నారు.

Jharkhand Trust Vote:

బల నిరూపణ కోసమే..

ఝార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పైనే అవినీతి ఆరోపణలు రావటం  వల్ల ప్రభుత్వం కుప్ప కూలుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే...సీఎం సోరెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సెషన్ నిర్వహించనున్నారు. ఇదే విషయమై సెక్రటేరియట్ నుంచి అందరి ఎమ్మెల్యేలకు లేఖలు అందాయి. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునేందుకు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు ఆ లేఖల్లో పేర్కొన్నారు. కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితికి తెర దించాలంటే...ఇదొక్కటే మార్గమని భావిస్తున్నారు సోరెన్. "రాష్ట్ర రాజకీయాల్లో చాలా రోజులుగా కన్‌ఫ్యూజన్‌ నడుస్తోంది. ఇది తొలగిపోయేందుకు గవర్నర్‌ను కలిశాం. రెండు మూడు రోజుల్లో స్పష్టతనిస్తామని
చెప్పారు. కానీ ఇంతవరకూ అలాంటిదేమీ జరగలేదు. అందుకే...అసెంబ్లీ సెషన్‌ నిర్వహించి మా బలం నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నాం" అని మంత్రి అలమ్‌గిర్ అలమ్ వెల్లడించారు. ఈలోగా భాజపా కూడా అప్రమత్తమైంది. వెంటనే మీటింగ్ పెట్టుకుంది. అసెంబ్లీలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో ముందుగానే లెక్కలు వేసుకుంది. అందుకు అనుగుణంగా...సోరెన్ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో సోరెన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఆయనపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేశారు గవర్నర్ రమేష్ బెయిస్. అప్పటి నుంచి రాజకీయాలు మలుపు తిరిగాయి. కావాలనే భాజపా టార్గెట్ చేసిందిన, JMM ఆరోపిస్తోంది. ప్రస్తుతానికి ఝార్ఖండ్‌లో కాంగ్రెస్, జేఎమ్‌ఎమ్‌, ఆర్‌జేడీ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. అయితే...ఎవరెన్ని కుట్రలు చేసినా తమకు వచ్చే నష్టం ఏమీ లేదని, స్పష్టమైన మెజార్టీ ఉందని ధీమాగా చెబుతోంది యూపీఏ. రాష్ట్రంలోని పరిస్థితులపై సెప్టెంబర్ 1 వ తేదీన యూపీఏ ఎమ్మెల్యేలతో గవర్నర్ భేటీ అయ్యారు. ఆ తరవాత గవర్నర్ ఢిల్లీ వెళ్లారు. అయితే...కేవలం తాను మెడికల్ చెకప్ కోసమే వెళ్లానని ఆయన స్పష్టతనిచ్చారు. అటు యూపీఏ ఎమ్మెల్యేలు మాత్రం..గవర్నర్ కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

రిసార్ట్ రాజకీయాలు..

అధికార యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్ (UPA)కు చెందిన 31 ఎమ్మెల్యేలను ఛత్తీస్‌గఢ్‌కు తరలించారు. భాజపా ఈ ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తోందన్న అనుమానంతో ఇలా వారందరినీ వేరే చోటకు తరలించారు. రాయ్‌పూర్‌లోని మే ఫేర్ రిసార్ట్‌లో ఈ ఎమ్మెల్యేలకు నివాసం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతలు గిరీశ్ దేవాంగన్, సన్నీ అగర్వాల్, రామ్‌ గోపాల్ అగర్వాల్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి ఎమ్మెల్యేలను రిసీవ్ చేసుకున్నారు. వీరిలో కాంగ్రెస్‌తో పాటు ఝార్ఖండ్ ముక్తి మోర్ఛ్ (JMM)కి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం 
భూపేష్ బాగేల్ రిసార్ట్‌కు వెళ్లారు. కొందరు JMM ఎమ్మెల్యేలు, మంత్రులు రాంచీలోనే ఉండి ప్రస్తుత సంక్షోభాన్ని ఎలా అధిగమించాలనే అంశంపై సమాలోచనలు చేశారు. కాంగ్రెస్‌కు చెందిన నలుగురు మంత్రులు కూడా రాయ్‌పూర్‌ బాట పట్టారు. ఇప్పటికే సీఎం హేమంత్ సోరెన్‌పై అనర్హతా వేటు వేశారు. "రాష్ట్రంలో జరుగుతున్న కుట్ర గురించి ఎప్పుడైనా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం" అని సోరెన్ ఇప్పటికే ప్రకటించారు. ఎలాంటి పరిస్థితుల్నైనా ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. 

Also Read: Bangladesh PM Sheikh Hasina: రోహింగ్యాలను మేమిక భరించలేం, భారత్ మాత్రమే ఈ సమస్య పరిష్కరించలగదు - బంగ్లాదేశ్ ప్రధాని

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Trai Accident: రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
KTR Reaction: పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ

వీడియోలు

Trump on Greenland | గ్రీన్‌ లాండ్ కోసం ట్రంప్ ఎందుకు పట్టుబుతున్నాడు | ABP Desam
Ind vs NZ Abhishek Sharma Records | అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్
Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య
Sanju Samson Catch in Ind vs NZ | సూపర్ క్యాచ్ పట్టిన సంజూ
India vs New Zealand First T20 | న్యూజిలాండ్ పై భారత్ విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trai Accident: రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
KTR Reaction: పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Bangladesh Cricket: భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో - ఇక టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌కు చాన్స్ !
భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో - ఇక టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌కు చాన్స్ !
Adilabad Latest News:ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
FIR at home: బాధితుల వద్దకే పోలీసులు - స్పాట్‌లోనే ఎఫ్ఐఆర్ - దుండిగల్ పోలీసుల కొత్త ప్రయత్నం వైరల్
బాధితుల వద్దకే పోలీసులు - స్పాట్‌లోనే ఎఫ్ఐఆర్ - దుండిగల్ పోలీసుల కొత్త ప్రయత్నం వైరల్
SIT notice to KTR: ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు - కేటీఆర్‌కు నోటీసులు - శుక్రవారమే ముహుర్తం
ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు - కేటీఆర్‌కు నోటీసులు - శుక్రవారమే ముహుర్తం
Embed widget