అన్వేషించండి

Pawan Kalyan: విశాఖలో స్టీల్ ప్లాంట్ వస్తే జగిత్యాల వారికి ఉద్యోగాలు వస్తాయా?: పవన్ లాజిక్ విన్నారా

Janasena Chief Pawan Kalyan: నేరమయ రాజకీయాలకి వైసీపీ ఉదాహరణ అని.. ఈ తరహా రాజకీయాలకి వ్యతిరేకంగా జనసేన పోరాటం చేస్తుందని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

Janasena Chief Pawan Kalyan:  నోవాటెల్‌ హోటల్‌లో మీడియా సమక్షంలో విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత చంద్ర జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆదివారం నోటీసులు అందజేశారు. నెల రోజుల పాటు విశాఖ పరిధిలో సభలు, సమావేశాలు నిర్వహించడానికి అనుమతిలేదని నోటీసులలో పేర్కొన్నారు. నోటీసులు తీసుకున్న అనంతరం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మర్డర్లు మానభంగాలు చేసే వారిని వెనకేసుకొస్తే ఇలాంటి వారే రాజ్యాలు ఏలుతారని అన్నారు. నేరమయ రాజకీయాలకి వైసీపీ ఉదాహరణ అని.. ఈ తరహా రాజకీయాలకి వ్యతిరేకంగా జనసేన పోరాటం చేస్తుందని అన్నారు. యుద్ధం మొదలయ్యింది. యుద్ధాన్ని మీరు ప్రారంభించారు. దాన్ని స్వీకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని వైసీపీకి హెచ్చరికలు పంపించారు.

విశాఖలో స్టీల్ ప్లాంట్ వస్తే జగిత్యాల వారికి ఉద్యోగాలు వస్తాయా?
నెల్లూరులో ఉండగా నాకు గఢాఫీ గురించి చాలా గొప్పగా చెప్పే వారు. ప్రజల్ని బాగా చూసుకుంటాడు అని. అలాంటి వ్యక్తిని నడిరోడ్డు మీద కొట్టి ఎందుకు చంపేశారు? దశాబ్దాల తరబడి ప్రజలను హింసిస్తే తిరగబడతారని పవన్ కళ్యాణ్ అన్నారు. రేపటి రోజున మీరు కూడా అంతే.స్కీములు, రాయతీలు అంటూ బెనిఫిట్స్ ఇస్తున్నామంటారు. అభివృద్ధి చేయరు. దాని గురించి ఎవరూ అడగకూడదు. మాట్లాడితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తులో ఉన్నారు కదా వారికి చెప్పవచ్చు కదా అంటారు. గొడవ జరిగిన ప్రతి సారీ వెళ్తామా? నేను ఒక పార్టీ అధ్యక్షుడిని. మాకు లక్షల ఓట్లు ఉన్నాయి. మేము మాట్లాడితే కోట్లాది మందికి చేరుతుంది. మేమే పోరాటం చేస్తాం. ఇది మా యుద్ధం. తెలుగు నేల కోసం చేస్తున్న యుద్దం అని అభివర్ణించరారు జనసేనాని.

ఇష్టారాజ్యంగా చేసే వ్యక్తులు రాజ్యాలు ఏలుతుంటే మాట్లాడేవారు ఎవరూ లేరు. ఉభయ సభల్లో 30 మంది ఎంపీలు ఉన్నారు. వారు ప్రత్యేక హోదా గురించి అడగరు. అప్పుడు కోపాలు రావు. ప్రజలకు కోపం లేకపోతే నేనేం చేస్తాను. స్టీల్ ఫ్యాక్టరీ కోసం 32 మంది అధికారికంగా చనిపోయారు. అనధికారికంగా 180 మంది చనిపోయారు. అందులో అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. జగిత్యాలకు చెందిన వారు చనిపోయారు. వాళ్లంతా రకరకాల జిల్లాల వారు. అప్పుడు లేని ప్రాంతీయ విభేదాలు ఇప్పుడు ఎందుకు తెస్తారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ వస్తే జగిత్యాలలో ఉద్యోగాలు వస్తాయా? ఆనాటి తరం అంతా మనది అనుకుని చేశారు.
మీరు చెప్పిన వీకేంద్రీకరణ ఇదేనా?
ఇప్పుడు ఏం చేసినా గొంతెత్తకూడదు. నోరెత్తకూడదు. నిరసన తెలపకూడదు. ప్రతిసారి భయపెట్టే పరిస్థితులు వచ్చేశాయి. ఒకప్పుడు జర్నలిజంలో ఉన్నవారు ఉమ్మడిగా సమస్య మీద పోరాడే వారు. ఇప్పుడు మనం కూడా ప్రాంతీయత, కులంగా విడిపోతే ప్రజలకు ఏం మంచి జరుగుతుంది. ఒక పరిమిత ఆలోచనా విధానంతో కూడిన ఏ సిద్ధాంతం నిలబడింది లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంతో ప్రారంభమైన టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అని ఎందుకు పేరు మార్చుకోవాల్సి వచ్చింది. ఎప్పటికప్పుడు సిద్ధాంతాల విస్తృతి పెరుగుతూ ఉంటుంది. నేను ఒక కులంతో, ప్రాంతంతో ముడిపడి పార్టీ పెట్టలేదు. ఓ మంత్రి గారు మా కులం అ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. ఆ హక్కు ఎవరిచ్చారు. మీరు మెప్పు పొందడం కోసం మమ్మల్ని తిడతారా? అమరావతి భూములు అన్ని ఒకే సామాజికవర్గానివి అన్నారు. ఇప్పుడున్న నాయకుడి సామాజికవర్గానికి 70 శాతం భూములు ఉంటే ఆ రాజధాని ఆ వర్గానిదే అవుతుంది కదా? చుక్కల భూములు కూడా తీసేసుకున్నారు. అణగారిన వర్గాలు ఈ రోజుకీ గుర్తింపుకోసం కొట్టుకుంటూ ఉన్నారు. వికేంద్రీకరణ అంటే ఇదేనా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

ప్రజల్లో మార్పు తెస్తామనే జనసేనంటే భయం
జనసేన పార్టీ అంటే ఎందుకు భయపడతారో తెలియదు. రెండు చోట్లా ఓడిన మా గురించి భయపడాల్సిన పనేంటి? వీరికి మేమంటే ఏదో భయం ఉంది. ప్రజలను ఆలోచింప చేస్తారనో.. ప్రజలు మారుతారనో భయం ఉంది. ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుకుంటే.. మాస్కులు లేవన్నందుకు డాక్టర్ సుధాకర్ ని పిచ్చోడిని చేసి చనిపోయేలా చేశారు. పోలీసుల సమక్షంలో కూర్చోబెట్టి గుండు గీయించేశారు. కేవలం ఇది ఒక కులం, వర్గం అని చెప్పాలా? ప్రతి కులానికీ నన్ను తిట్టే చాలా మంది. కాపు కులానికి చెందిన వైసీపీ మంత్రి మా సోదరుడు అంటూ తిట్టడానికి మీరేమైనా నాకు బొడ్డు కోసి పేరు పెట్టారా? వాళ్ల మెచ్చుకోళ్ల కోసం మమ్మల్ని తిట్టే హక్కు ఎవరిచ్చారు" అన్నారు పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు నాగబాబు పాల్గొన్నారు.

 Also Read: Pawan Kalyan : జనసేన నేతలను విడుదల చేసే వరకూ విశాఖలోనే ఉంటా- పవన్ కల్యాణ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Pemmasani Chandra Sekhar: ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
Duvvada Vani: టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Allari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP DesamDuvvada Srinivas Interview | టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఇంటర్వ్యూ | ABPHyderabad 16Cars Fire Accident | హైదరాబాద్ యూసుఫ్ గూడలో అగ్నికి ఆహుతైపోయిన 16కార్లు | ABP DesamPawan kalyan Touches feet of Pastor | పిఠాపురంలో మహిళా పాస్టర్ కాళ్లు మొక్కిన పవన్ కళ్యాణ్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Pemmasani Chandra Sekhar: ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
Duvvada Vani: టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
IMD: దేశంలో మరో 5 రోజులు భానుడి ఉగ్రరూపం - ఐఎండీ అలర్ట్
దేశంలో మరో 5 రోజులు భానుడి ఉగ్రరూపం - ఐఎండీ అలర్ట్
Prabhas: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
Embed widget