అన్వేషించండి

Pawan Kalyan : జనసేన నేతలను విడుదల చేసే వరకూ విశాఖలోనే ఉంటా- పవన్ కల్యాణ్

Pawan Kalyan : విశాఖలో ఎలాంటి ర్యాలీలు, కార్యక్రమలు నిర్వహించొద్దని పోలీసులు పవన్ కల్యాణ్ కు నోటీసులు అందజేశారు. పోలీసుల నోటీసులపై పవన్ ఫైర్ అయ్యారు.

Pawan Kalyan : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు విశాఖ సిటీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. పవన్‌ బస చేసిన నోవాటెల్‌ హోటల్‌లో మీడియా సమక్షంలో విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత చంద్ర పవన్ కల్యాణ్ కు నోటీసులు అందజేశారు. విశాఖ నగరంలో పోలీస్ యాక్ట్, సెక్షన్‌ 30 అమల్లో ఉన్నప్పుడు జనసేన పార్టీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించినందుకు నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.  500 మందికిపైగా ర్యాలీలో పాల్గొన్నట్లు నోటీసుల్లో పోలీసులు తెలిపారు. అలాగే విశాఖ గర్జన ర్యాలీకి హాజరై తిరిగి వెళ్తోన్న మంత్రులు, స్థానికులు, పోలీసులపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని తెలిపారు. స్థానికులు, పోలీసుల ఫిర్యాదుతో నోటీసులు అందజేస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 31వ తేదీ వరకూ నగరంలో ఎలాంటి ర్యాలీలు, కార్యక్రమాలు అనుమతి లేదని తెలిపారు. అనుమతి లేకుండా జనసేన భారీ ర్యాలీ నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు కలిగించాలని పోలీసులు అన్నారు. జనసేన జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్‌ కల్యాణ్ శనివారం సాయంత్రం ఎయిర్‌పోర్టుకు వచ్చిన సమయంలో భారీగా జనసేన కార్యకర్తలు అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో మంత్రులు కార్లపై రాళ్ల దాడి జరిగినట్లు వైసీపీ నేతలు ఆరోపించారు. దీంతో పలువురు జనసేన నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే జనసేన జనవాణి కార్యక్రమం నిర్వహించకుండా ఆంక్షలు విధించి నోటీసులు అందజేశారు.

Pawan Kalyan : జనసేన నేతలను విడుదల చేసే వరకూ విశాఖలోనే ఉంటా- పవన్ కల్యాణ్

జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం

పోలీసుల నోటీసులు తీసుకున్న అనంతరం పవన్‌ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం పోరాడితే నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. తాను విశాఖకు రాకముందే గొడవ జరిగిందన్నారు. తాము రెచ్చగొట్టడం వల్లే ఘటన జరిగినట్లుగా పోలీసులు నోటీసులిచ్చారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని పవన్ ప్రకటించారు. ఉత్తరాంధ్ర దోపిడీని చూపిస్తామని డ్రోన్లు నిషేధించారని ఆరోపించారు. ప్రజల్లో మార్పు వచ్చే వరకు జనసేన పోరాడుతోందన్నారు. ప్రశ్నించేతత్వం లేకపోతే దోపిడీలు ఎక్కువైపోతాయన్నారు.

విశాఖలోనే ఉంటా 

"నేను నోటీసులు తీసుకున్నాను. ఋషికొండ దోపిడీని డ్రోన్ ద్వారా చూపిస్తామని డ్రోనులు నిషేధించారు. ఏ పార్టీ కూడా మరో పార్టీని ఎదగడానికి ఒప్పుకోదు. నేను జైలుకు వెళ్లడానికి సిద్ధం. ప్రశ్నించేతత్వం లేకపోతే దోపిడీ రాజ్యం ఉంటుంది. క్రిమినల్ పాలసీతో వైసీపీ పాలన సాగుతోంది. అరెస్ట్ చేసిన మా వాళ్లను వెంటనే విడుదల చెయ్యాలి. అప్పటి వరకూ విశాఖలో ఉంటాను. వందలాది మంది మా కార్యకర్తలను అరెస్టులు చేశారు. తెల్లవారు జామున 3 గంటల నుండి పోలీసులు చాలా ఓవర్ యాక్షన్ చేశారు. అరెస్టు చేసిన మా నాయకులు వచ్చే వరకు నేను వైజాగ్ లోనే ఉంటాను. అధికారం ఉన్నవాళ్లు గర్జించడం ఏంటి. చాలా మంది మా జనసేన నాయకులను జనవాణికు రాకుండా ముందస్తు హౌస్ అరెస్టలు చేశారు. పోలీసులు నేరస్తులకు కొమ్ముకాయకండి. అమాయకులను అరెస్టు చేస్తారా?". కోడి కత్తి కేసు అన్నది పెద్ద డ్రామా. దాడి సమయంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు పోలీసు బందోబస్తు లేదా? ఉంటే ఏమైనట్లు. వైఎస్ఆర్సీపీ నాయకులకు జనసేన అంటే భయం పట్టుకుంది. కోనసీమలో ఎలా ఉద్రిక్తత రెచ్చగొట్టారో ఇప్పుడు విశాఖలో అలాగే సృష్టించారు."- పవన్  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget