అన్వేషించండి

PK meet Rahul: ప్రశాంత్ కిశోర్ ప్లాన్ ఏంటీ? కాంగ్రెస్ తో కలిసి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారా?

ప్రశాంత్ కిషోర్ తర్వాతి.. స్ట్రాటజీ ఏంటీ? కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ వెనక ఉన్న సీక్రెట్ ఏంటీ? ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందిన ఆయన.. ఇప్పుడు సెంకడ్ ఇన్నింగ్ ప్రారంభించబోతున్నారా?

 

ప్రశాంత్ కిశోర్.. దేశ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్. ఎక్కడ కనిపిస్తే.. అక్కడ ఊహాగానాలు జోరందకుంటాయి. పీకే ఇది చేస్తున్నాడు.. పీకే ఆ పార్టీలో జాయిన్ అవుతున్నాడంటూ.. బహిరంగ చర్చలు. కొన్నిరోజుల క్రితం ఎన్సీపీ అధినేత శరద్ పవర్ ను కలవడంతో ఇక బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టేస్తున్నాడంటూ.. చర్చ జరిగింది. మెున్న కాంగ్రెస్ అగ్రనేతలతో కలవడంతో ఇక కాంగ్రెస్ లోకి పీకే అంటూ వార్తలొచ్చాయి.

ప్రస్తుతం పీకే అడుగులు చూస్తుంటే.. రాజకీయ వ్యూహకర్తగానే కాదు.. సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ గా నిరూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమైన రాజకీయ నేతలతో భేటీ అయ్యారు ప్రశాంత్ కిశోర్. మెున్నటికి మెున్న సోనియాతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతోనూ సమావేశమయ్యారు. కాంగ్రెస్ పెద్ద నేతలతో భేటీతో.. ఏదో పెద్ద ప్లాన్ జరుగుతున్నట్టు విశ్లేషణలు వచ్చాయి.  

ఇప్పటికే పీకే.. వారితో చాలా సార్లు సమావేశమైనట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.. మోదీని ఎలాగైనా గద్దె దింపాలని చూస్తోంది. ఈ ప్లాన్ లో భాగంగానే పీకేతో సమావేశాలని విశ్లేషకులు చెబుతున్నారు. 
అయితే పీకే... పాత స్ట్రాటజిస్ట్ గా వెళ్తాడా? లేక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని నేరుగా మోదీపైకి దండెత్తుతాడా? అనేది తెలియాల్సి ఉంది. తన వ్యూహాలతో గెలిచిన మోదీ నిర్ణయాలను పీకే బహిరంగంగానే చాలా సార్లు వ్యతిరేకించారు.

కొంత కాలంగా పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం ఏర్పడింది. అమరీందర్ సింగ్, సిద్ధు మధ్య పొలిటికల్ చిచ్చు రేగింది. ఇరు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో పంజాబ్ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారిపోయాయి.  ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్  ముఖ్య నేతల భేటీ  ప్రాధాన్యత సంతరించుకొంది. ఇదే సమావేశంలో మరో ముగ్గురు పంజాబ్ కాంగ్రెస్ ప్యానెల్ సభ్యులు కూడా పాల్గొనడంపైనా చర్చలు జరిగాయి. పంజాబ్ కాంగ్రెస్ లో గొడవలను సరిచేసేందుకు పీకే కాంగ్రెస్ అగ్రనేతలను కలిశారని వార్తలు కూడా వచ్చాయి.

2014 ఎన్నిక‌ల్లో బీజేపీకి స్ట్రాట‌జిస్ట్ గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్.. మోదీ ప్రచారాన్ని ఓ రేంజీకి తీసుకెళ్లారు. అప్పటి నుంచే పీకే పేరు మారుమోగింది. ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్ కు కూడా పని చేశారు.  చాలా రాష్ట్రాల్లో పార్టీలకు పని చేసి.. ఆ పార్టీల గెలుపులో తన మార్క్ ను చూపించారు. త‌న సొంత రాష్ట్రం బీహార్ లో అధికార పార్టీ జేడీయూలో చేరిన పీకేకు ఆ పార్టీ ఉపాధ్యక్ష  ప‌ద‌వి కూడా ద‌క్కింది. విభేదాలతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.  తాజాగా పశ్చిమ బెంగాల్ లో మమతకు, తమిళనాడులో స్టాలిన్ కు కూడా అధికారం దక్కేలా వ్యూహాలు రచించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాతే.. దేశంలోని ముఖ్యమైన నేతలను కలుస్తూ వస్తున్నారు. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా పీకే మారతాడేమోనని విశ్లేషకులు చెబుతున్నారు. 

 

Also Read: KTR BIRTHDAY : గులాబీ దళంలో ఈ ఉత్సాహం  పట్టాభిషేక సూచికేనా..!?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
Embed widget