అన్వేషించండి

Indian Railways: జనరల్‌ బోగీలకు, స్లీపర్ క్లాస్‌లకు ఆధునిక హంగులు- ప్రక్షాళన దిశగా రైల్వే వ్యవస్థ

తూర్పు ఉత్తర ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గడ్, డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో సాధారణ కోచ్‌లు, నాన్-ఏసీ స్లీపర్ క్లాస్‌తో కూడిన సాధారణ రైళ్లను నడిపేందుకు ఇండియన్ రైల్వే సిద్ధమవుతోంది

దేశంలో కీలకంగా ఉన్న రైల్వేను ఆధునీకరించే విధంగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గడ్ ఇతర డిమాండ్ ఉన్న ప్రాంతాల‌లో సాధారణ కోచ్‌లు, నాన్-ఏసీ స్లీపర్ క్లాస్‌తో కూడిన సాధారణ్‌ రైళ్లను నడిపేందుకు ఇండియన్ రైల్వే సిద్ధమవుతోంది. ఈ మేరకు డిమాండ్‌ ఎక్కువగా ఉన్న ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై లాంటి పెద్ద నగరాలను అనుసంధానం చేసేలా రైళ్లను నడుపనుంది. ఈ నేపథ్యంలో రైళ్లను అత్యాధుని వసతులతో ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే వందే భారత్ ట్రైన్‌లను కేంద్రం విజయవంతంగా నడుపుతోంది. రానున్న రెండేళ్లలో భారతీయ రైల్వేలను ఆధునీకరించేందుకు కేంద్రం కృషి చేస్తోంది. ఈ మేరకు రాబోయే రెండేళ్లలో అనేక మార్పులు చేయాలని చూస్తోందని ప్రభుత్వంలోని ఉన్నత వర్గాలు తెలిపాయి.

అన్ని రైళ్లకు ఆటోమేటిక్ డోర్లు ఏర్పాట్లు చేయనున్నారు. ఆకస్మిక కుదుపుల నుంచి ప్రయాణికులను విముక్తి చేయడానికి యాంటీ-జెర్క్ కప్లర్‌లు, సెమీ-హై స్పీడ్ ట్రైన్‌సెట్‌లకు తక్కువ-ధర ప్రత్యామ్నాయంగా రైలును లాగడానికి రెండు ఇంజన్లు ఏర్పాటు చేసే ఆలోచనలు చేస్తున్నారు. పుష్-పుల్ పద్ధతిలో నడిచే రైళ్లకు వెనుక, ముందు భాగంలో ఇంజన్లు ఉంటాయి. వీటి ద్వారా రైళ్లు త్వరగా వేగం అందుకోవడంతో పాటు అంతే త్వరగా రైళ్లను ఆపేందుకు వీలవుతోంది. ఇలాంటి టెక్నాలజీ ఇప్పటికే వందే భారత్ రైళ్లలో ఉపయోగిస్తున్నారు. ఫలితంగా ఇప్పటికే ఉపయోగిస్తున్న LHB కోచ్‌ల ట్రైన్ల సమయంతో పోలిస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.  

ముంబై - ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ 2019 వరకు చాలా ఆలస్యంగా నడిచేది. అయితే దాని ప్రయాణ సమయాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టారు. సెమీ హైస్పీడుతో రైలు ప్రయాణ వేగాన్ని పెంచారు. తక్కువ ధర, సెమీ-హై స్పీడ్ రైలు గంటకు 160 కి.మీల వేగంతో పరుగెత్తే సామర్థ్యం ఉన్నందున దీనిని విస్తరించాలని రైల్వే బోర్డు నిర్ణయించినట్లు వర్గాలు తెలిపాయి. చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్‌లో ఇటువంటి వేగాన్ని కలిగి ఉండే WAP-5, WAP-7 తరగతుల ఇంజిన్‌లలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అక్టోబర్ నాటికి ఒక రేక్‌ను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఖర్చుల నియంత్రణ, మెయింటెనెన్స్ తగ్గించుకునే క్రమంలో రైళ్ల ఆధునీకరణకు బీజం వేసిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇలా అధునీకరించే రైళ్లను తొలుత తూర్పు ఉత్తర్ ప్రదేశ్,  బిహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ ఇతర అదనపు డిమాండ్‌ను ఉన్న మార్గాల్లో నడుపుతారు.

వందేభారత్ ప్రత్యేకతలు తెలుసా?
వందేభారత్ రైలును వెలుపల రూపు ఏరోడైనమిక్‌ డిజైన్‌తో రూపొందించారు. గరిష్టంగా 160 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ఈ గరిష్ట వేగాన్ని 140 సెకన్లలో అందుకుంటుంది.  ఫుల్లీ సస్పెండెడ్‌ ట్రాక్షన్‌ మోటార్‌తో రూపొందించిన ఆధునిక బోగీలను ఈ రైలులో వినియోగించారు. ప్రత్యేకంగా లోకోమోటివ్‌ను జత చేసే అవసరం ఉండదు. ఎంఎంటీఎస్‌ రైలు తరహాలో లోకోపైలట్‌ కేబిన్‌లు ట్రైన్‌కు వెనుకా ముందు ఉంటాయి. సీట్లు 180 డిగ్రీల కోణంలో తిప్పుకోవచ్చు. కోచ్‌లో 32 అంగుళాల డిజిటల్‌ స్క్రీన్‌ ఉంటుంది. అందులో ప్రయాణికులకు రైలు వేగంతో సహా అన్ని వివరాలు కనిస్తాయి. ఆటోమేటిక్‌ తలుపులుంటాయి. వాటి ని­యంత్రణ లోకోపైలట్‌ వద్దే ఉంటుంది. మధ్య­లో ప్రయాణికులు వాటిని తెరవలేరు, మూయలేరు. రైలు ఆగిన కొన్ని క్షణాలకు డోర్లు తెరుచు­కుంటాయి. బయలుదేరటానికి కొన్ని సెకన్ల ముందు మూసుకుంటాయి. రైలులో సీసీటీవీ కెమెరాలుంటాయి. లోపల వైఫై వసతులు ఉంటాయి. విద్యుత్తు సరఫరాలో అవాంతరాలు ఏర్పడినప్పుడు వెలిగేలా ప్రతి కోచ్‌లో నాలుగు ఎమర్జెన్సీ లైట్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ ట్రైన్లు కేవలం పగటి పూట మాత్రమే ప్రయాణిస్తాయి.

టాప్ హెడ్ లైన్స్

Rohit Captaincy Drama: రోహిత్ వన్డే కెప్టెన్సీ వేటు వెనుక అసలు నిజాలు.. గంభీర్, అగార్కర్ ల మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, హిట్‌మ్యాన్ ఫ్యూచర్ పై సంచలన ట్విస్ట్లు!
రోహిత్ వన్డే కెప్టెన్సీ వేటు వెనుక అసలు నిజాలు.. గంభీర్, అగార్కర్ ల మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, హిట్‌మ్యాన్ ఫ్యూచర్ పై సంచలన ట్విస్ట్లు!
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Cricket Legend Sir Garfield Sobers Demise: వెస్టిండీస్ లెజెండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కన్నుమూత, ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల వీరుడి ప్రస్థానం! 
వెస్టిండీస్ లెజెండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కన్నుమూత, ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల వీరుడి ప్రస్థానం! 
ABP Desam Top 10, 17 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 17 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget