అన్వేషించండి

Bhagat Singh: భగత్ సింగ్ టోపీ రహస్యం: విప్లవానికి చిహ్నంగా మారిన ఫోటో వెనుక అసలు కథేంటి?

Bhagat Singh: భగత్ సింగ్ భారత స్వాతంత్య్ర చరిత్రలో మండే అగ్నికణం. ఆయన జీవితం, చేసిన త్యాగం, ప్రవచించిన సిద్ధాంతాలు నేటి తరానికి కూడా పిడికిలి బిగించేలా చేస్తాయి.

Bhagat Singh: భగత్ సింగ్ భారత స్వాతంత్య్ర చరిత్రలో మండే అగ్నికణం. ఆయన జీవితం, చేసిన త్యాగం, ప్రవచించిన సిద్ధాంతాలు నేటి తరానికి కూడా పిడికిలి బిగించేలా చేస్తాయి. సమాజం కోసం ఆలోచించేలా తీర్చిదిద్దుతాయి. భగత్ సింగ్ అనగానే మనకు టోపీ పెట్టుకున్న నవ యువకుడి ఫోటో కళ్ల ముందు కనిపిస్తుంది. అయితే ఆ టోపీతో ఉన్న ఫోటో కేవలం ఫోటో కాదు, అది విప్లవానికి చిహ్నం, భగత్ సింగ్ త్యాగానికి రూపం. ఆ టోపీ ఫోటో వెనుక ఉన్న చారిత్రక విప్లవ కథ ఏంటో తెలుసుకుందాం.

భగత్ సింగ్ దిగిన ఫోటోలు ఇవే...

ప్రతి ఫోటోకు ఒక జ్ఞాపకం ఉంటుంది. అందరూ ఫోటోలు దిగుతారు, కానీ కొందరి ఫోటోలు మాట్లాడతాయి, స్ఫూర్తిని కలుగజేస్తాయి. అలాంటి ఫోటోలలో భగత్ సింగ్ దిగిన ఫోటోలు ముఖ్యమైనవి. ఆయన దిగిన చిత్రాల్లో మనకు అధికారికంగా అందుబాటులో ఉన్నవి కేవలం నాలుగు మాత్రమే.

1. భగత్ సింగ్ బాలుడిగా ఉన్నప్పుడు దిగిన ఫోటో.

2. విద్యార్థిగా ఉన్నప్పుడు ఫోటో, ఇది ఆయన కాలేజీ రోజుల్లో తీసిన ఫోటో.

3. టోపీతో ఉన్న ఫోటో, ఇది భగత్ సింగ్ ఒక విప్లవ వీరుడిలా మారిన తర్వాత బాగా ప్రాచుర్యం పొందిన ఫోటో.

4. జైలులో ఉన్నప్పుడు ఫోటో, ఇది భగత్ సింగ్‌ను అరెస్ట్ తర్వాత జైలులో తీసిన ఫోటో.

భగత్ సింగ్ ప్రసిద్ధ టోపీ ఫోటో ఎక్కడ, ఎప్పుడు తీశారు?

టోపీలో ఒక దొరబాబులా ఠీవిగా, అందంగా కనిపించే భగత్ సింగ్ ఫోటో దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా మనకు కనిపిస్తుంది. అంతటి ప్రాచుర్యం పొందిన టోపీ ఫోటోను ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ ప్రాంతంలో ఉన్న "రామ్‌నాథ్ స్టూడియో"లో 1929లో తీశారు. సెంట్రల్ అసెంబ్లీలో బాంబు విసిరే ముందు, అంటే 1929, ఏప్రిల్ 8వ తేదీకి కొన్ని రోజుల ముందు ఈ ఫోటో తీసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ ఫోటో తీసే సమయంలో భగత్ సింగ్ తన సహచరుడు అయిన బటుకేశ్వర్ దత్‌తో కలిసి ఉన్నారు.

విప్లవ వ్యూహంలో భాగంగానే టోపీ ఫోటో

టోపీతో భగత్ సింగ్ ఫోటో సరదాగా దిగిందేమీ కాదు, అది ఒక వ్యూహంతో దిగిన ఫోటో. ఆనాడు సాండర్స్ హత్య కేసులో భగత్ సింగ్‌ను పట్టుకోవడానికి నాటి బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ సమయంలో పోలీసులు తనను గుర్తించకుండా ఉండేందుకు భగత్ సింగ్ ఈ వేషం ధరించాల్సి వచ్చింది. అందుకోసం తన సిక్కు మత విశ్వాసాలను పక్కనపెట్టి గడ్డం తొలగించారు, తల జుట్టు కత్తిరించుకున్నారు. ఇలా చేసిన తర్వాత ఆయన తన కొత్త రూపంతో టోపీ ధరించి, స్వాతంత్ర్య ఉద్యమంలో విప్లవ పంథాను ప్రచారం చేయాలని భగత్ సింగ్ నిర్ణయించుకున్నారు. అయితే ఈ ఫోటోకు మరో ప్రధాన కారణం ఒకవేళ తాను అరెస్ట్ అయితే వార్తా పత్రికల్లో తన కొత్త రూపంతో కూడిన ఫోటోనే ప్రచురితం కావాలని, తన పోరాటాన్ని ప్రజలకు తెలియజెప్పేలా ఈ ఫోటో సాధనంగా వాడబడాలని భగత్ సింగ్ ఆకాంక్షించినట్లు చెబుతారు. అసెంబ్లీలో బాంబు విసిరి తమ విప్లవ ఆకాంక్షలను ప్రపంచానికి చాటాలని భగత్ వ్యూహాత్మకంగా ఈ టోపీ ఫోటో దిగినట్లు చరిత్ర చెబుతోంది.

భగత్ సింగ్ అసెంబ్లీలో బాంబు ఎందుకు వేశారంటే?

1929లో బ్రిటిష్ ప్రభుత్వం రెండు నిరంకుశ బిల్లులను ప్రవేశపెట్టింది. అందులో ఒకటి పబ్లిక్ సేఫ్టీ బిల్లు, రెండోది ట్రేడ్ డిస్ప్యూట్ బిల్లు. అయితే ఈ బిల్లులు కార్మికుల హక్కులను కాలరాసేలా ఉన్నాయని, దేశంలో ఎవరూ నిరసనలు చేయకుండా అణగదొక్కేలా బిల్లులు ఉన్నాయన్నది భగత్ సింగ్ ఉద్దేశం. ఇందుకు ప్రతీకారంగా తమ నిరసన తెలియజేయాలన్నది భగత్ సింగ్ వ్యూహం. అందుకు ఆయన తన సహచరుడు బటుకేశ్వర్ దత్‌తో పాటు ఏప్రిల్ 8, 1929లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఇప్పటి పార్లమెంట్ పాత భవనంలో బాంబులు విసరాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో అసెంబ్లీలో ట్రేడ్ డిస్ప్యూట్ బిల్లుపై చర్చ జరుగుతుంది. అసెంబ్లీ గ్యాలరీకి చేరుకున్న భగత్ సింగ్, దత్ లు గ్యాలరీ నుంచి రెండు బాంబులను అసెంబ్లీలోకి విసిరారు. ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు తక్కువ నష్టం చేసే బాంబులు విసిరారు. అయితే ఏ ప్రాణ నష్టం జరగలేదు. ఆ శబ్దం విని సభ్యులు పరుగున తీశారు. అదే సమయంలో 'ఇంక్విలాబ్ జిందాబాద్' అంటూ కరపత్రాలను సభలో విసిరివేసి నినాదాలు చేస్తూ భగత్ సింగ్, అతని మిత్రుడు బటుకేశ్వర్ దత్ అక్కడే గ్యాలరీలో అరెస్టు అయ్యేందుకు నిశ్చయించుకుని ఉండిపోయారు. పోలీసులు వారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆ తర్వాత భగత్ సింగ్‌కు ఉరిశిక్ష అమలు అయిన విషయం తెలిసిందే.

టోపీ ఫోటో ఎలా బయటకు వచ్చిందంటే?

అసెంబ్లీలో బాంబు దాడికి ముందు ఈ ఫోటోను ఫోటోగ్రాఫర్ రామ్ నాథ్ తీశారు. ఈ ఫోటోగ్రాఫర్ పోలీసులకు కూడా ఫోటోలు తీసేవాడు. అయితే భగత్ సింగ్ ఉద్దేశం తెలిసిన రామ్ నాథ్ భగత్ సింగ్ సహచరుడు జైదేవ్ కపూర్‌కు నెగిటివ్‌లను, ఫోటో ప్రింట్‌లను ఇచ్చారని దీనిపై పరిశోధన చేసిన వారు చెబుతారు. ఈ ఫోటో, నెగిటివ్‌లు లాహోర్‌కు తీసుకెళ్లారని, అక్కడ అనేక కాపీలు తీయించి హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ కార్యకలాపాల కోసం, ప్రచార పత్రాల కోసం ఉపయోగించినట్లు చెబుతారు. భగత్ సింగ్ అరెస్ట్ తర్వాత ఈ ఫోటోలు ఆయా వార్తా పత్రికల ద్వారా ప్రచురితమై దేశవ్యాప్తంగా టోపీ ఫోటో ఒక విప్లవ చిహ్నంగా మారింది.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget