అన్వేషించండి

Vice President Election : ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే ఎంత కాలంలో ఎన్నిక జరపాలి? ప్రక్రియ, అర్హతలు, సుప్రీంకోర్టు పాత్ర తెలుసుకోండి!

Vice President Election : ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు రాజ్యాంగం ఎటువంటి కచ్చితమైన కాలపరిమితిని నిర్దేశించలేదు. కానీ, "వీలైనంత త్వరగా" ఎన్నిక జరపాలని రాజ్యాంగం ఆదేశిస్తుంది.

Vice President Election : భారత రాష్ట్రపతి తర్వాత దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతిది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 63 ఉపరాష్ట్రపతి పదవిని ప్రస్తావిస్తుంది. రాష్ట్రపతి లేని సమయాల్లో ఉపరాష్ట్రపతే దేశానికి నాయకత్వం వహిస్తారు. రాజ్యసభ ఛైర్మన్‌గా వ్యవహరించడం, రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించడం వంటి రెండు ప్రధాన విధులను ఉపరాష్ట్రపతికి రాజ్యాంగం కల్పించింది. ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు, కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికను భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.

ఉపరాష్ట్రపతి ఎన్నికకు కాలపరిమితి ఎంత?

రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే ఉపరాష్ట్రపతి ఆరు నెలలు మాత్రమే ఆ బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఆ ఆరు నెలల్లోపు కొత్త రాష్ట్రపతి ఎన్నిక కావాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. అయితే, ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు రాజ్యాంగం ఎటువంటి కచ్చితమైన కాలపరిమితిని నిర్దేశించలేదు. కానీ, "వీలైనంత త్వరగా" ఎన్నిక జరపాలని రాజ్యాంగం ఆదేశిస్తుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ను రూపొందించే అధికారం భారత ఎన్నికల సంఘానిదే. నామినేషన్లు దాఖలు చేయడం, వాటి పరిశీలన, అభ్యర్థుల ఉపసంహరణ తేదీ, పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుంది.

ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయాలంటే...?

ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓటు పద్ధతిలో జరుగుతుంది. అంటే, ఓటుకు నిర్దిష్ట విలువ ఉంటుంది. అభ్యర్థులకు ప్రాధాన్యతా క్రమంలో ఓట్లు వేస్తారు. 1974 ఎన్నికల నిర్వహణ నియమాల ప్రకారం ఈ ఎన్నిక జరుగుతుంది. ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థికి కనీసం 20 మంది ఎంపీలు ప్రతిపాదకులుగా ఉండాలి, మరో 20 మంది ఎంపీలు ఆ ప్రతిపాదనలను సమర్థించాలి. వీరందరూ ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులై ఉండాలి. నామినేషన్ దాఖలు చేసే పత్రంతోపాటు, ఎన్నికల నియమావళి ప్రకారం సెక్యూరిటీ డిపాజిట్‌ను చెల్లించాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత, రిటర్నింగ్ అధికారి అభ్యర్థుల రాజ్యాంగపరమైన, చట్టపరమైన అర్హతలను ధృవీకరిస్తారు. ఒకవేళ నామినేషన్ తిరస్కరిస్తే, కారణాలను రాతపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఉపసంహరణ తేదీలోగా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.

పోలింగ్ న్యూఢిల్లీలోని పార్లమెంట్‌లోనే ఎన్నికల అధికారుల సమక్షంలో జరుగుతుంది. ఈ ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల (లోక్‌సభ, రాజ్యసభ) సభ్యులు అందరూ (ఎన్నికైన, నామినేటెడ్ సభ్యులు) ఓటర్లు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఒక్కరే బరిలో ఉంటే, ఆ అభ్యర్థే ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతిగా ఎన్నిక అయినట్లు ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే, పోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ పద్ధతిలో జరుగుతుంది. ఒక అభ్యర్థి ఎన్నికయ్యేందుకు అవసరమైన ఓట్ల కోటాను పొందితే, ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. లేనట్లయితే, అతి తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థులను తొలగిస్తూ, వారి ప్రాధాన్యత ఓట్లను ఇతర అభ్యర్థులకు బదిలీ చేస్తూ ఫలితం వచ్చే వరకు ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది.

ఎన్నికను రద్దు చేసే అధికారం ఎవరిది?

పోలింగ్ తర్వాత లెక్కింపు పూర్తయితే, రిటర్నింగ్ అధికారి ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. ఎవరు విజేతగా నిలిచారో ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. కేంద్రం ఈ విషయాన్ని పేర్కొంటూ అధికారిక గెజిట్‌లో ఫలితాన్ని ప్రచురిస్తుంది. ఈ ఎన్నికపైన ఏదైనా వివాదం తలెత్తితే, దానిని పరిష్కరించే అధికారం కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది. దీనిపై ఇతర ఏ కోర్టులకూ అధికారం ఉండదు. ఎన్నికల చట్టాల ఉల్లంఘన, అవినీతి ఆరోపణలు, నామినేషన్ల తిరస్కరణ, ఎన్నిక రద్దు వంటి అధికారాలన్నీ సుప్రీంకోర్టుకు రాజ్యాంగం ఇచ్చింది. ఎన్నికైన అభ్యర్థి ఎన్నిక తీరు సరిగా లేదని రుజువైతే, సుప్రీంకోర్టు ఎన్నికను రద్దు చేయవచ్చు. అయితే, సాధారణంగా సుప్రీంకోర్టు కొత్త అభ్యర్థిని ప్రకటించదు; అటువంటి సందర్భాలలో, మళ్లీ ఎన్నికలు జరుగుతాయి.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget