By: ABP Desam | Updated at : 07 Jun 2023 05:32 PM (IST)
Edited By: Pavan
పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్రం, బీఎస్ఎన్ఎల్ను కాపాడేందుకూ మెగా ప్యాకేజ్
Union Cabinet Decisions: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2023-24 సంవత్సరానికి గాను ఖరీఫ్ పంటలకు కేంద్ర సర్కారు కనీస మద్దతు ధరలను బుధవారం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సాధారణ వరి క్వింటాల్ కు 143 రూపాయల మేర పెంచిన కేంద్రం.. ధరను రూ.2,183 గా నిర్ణయించింది. ఏ గ్రేడ్ ధాన్యానికి కనీస మద్దతు ధరకు 163 రూపాయల మేర పెంచింది. ఆ గ్రేడ్ ధరను రూ. 2,203 రూపాయలు ఖరారు చేసింది. పెసలు కనీస మద్దతు ధరను 10.4 శాతం మేర పెంచి.. రూ.8,558 గా నిర్ణయించింది. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరల పెంపు అన్నదాతలకు లాభదాయకంగా ఉంటుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ కేబినెట్ నిర్ణయాలు ప్రకటిస్తూ 2023-24 లో కనీస మద్దతు ధరలో కేబినెట్ చేసిన అత్యధిక వృద్ధి ఇదేనని తెలిపారు. హైబ్రిడ్ జొన్న క్వింటాల్ రూ.3180, జొన్న(మాల్దండి) రూ.3225, రాగి రూ.3846, సజ్జలు రూ.2500, మొక్కజొన్న రూ.2090, పొద్దుతిరుగుడు(విత్తనాలు) రూ.6760, వేరుశెనగ రూ.6377, సోయాబీన్ రూ.4600, పత్తి రూ.6620, పత్తి రూ.7020 చొప్పున ఈ సీజన్ లో ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రకటించింది.
कृषि कल्याण को समर्पित PM @NarendraModi जी की सरकार ने खरीफ फसलों पर MSP को बढ़ाने का महत्वपूर्ण निर्णय लिया है।
— Piyush Goyal (@PiyushGoyal) June 7, 2023
इससे भारत में अन्नदाताओं को फसलों के उत्पादन से अधिक लाभ सुनिश्चित होगा और विश्वभर में Millets के उपयोग को बढ़ावा देने में सहायक सिद्ध होगा। pic.twitter.com/UOJI95vocl
సైబర్ సిటీకీ మెట్రో అనుసంధానం
హుడా సిటీ సెంటర్ నుంచి గురుగ్రామ్ లోని సైబర్ సిటీకి మెట్రో అనుసంధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 28.50 కిలోమీటర్ల మేర 27 స్టేషన్ల మీదుగా ఈ నిర్మాణం చేపట్టనున్నారు. మంజూరు అయిన తేదీ నుంచి నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.5452 కోట్లు.
బీఎస్ఎన్ఎల్ను కాపాడేందుకు మెగా ప్యాకేజీ
బీఎస్ఎన్ఎల్ ఉనికి కాపాడేందుకు కేంద్ర సర్కారు చర్యలు చేపట్టింది. ఇందుకు గాను కేంద్ర మంత్రివర్గం రూ.89,047 కోట్లతో అతిపెద్ద పునరుద్ధరణ ప్యాకేజీని ఆమోదించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దేశంలో బీఎస్ఎన్ఎల్ తన 4జీ నెట్ వర్క్ విస్తరణ కోసం కేంద్ర సర్కారు రంగ సంస్థ అయిన ఐటీఐకి రూ.3889 కోట్ల విలువైన ముందుస్తు కొనుగోలు ఆర్డర్ ని అందజేసింది.
Chaired by PM Shri @narendramodi Ji, the Union #Cabinet has approved the Metro Connectivity project from HUDA City Centre to Cyber City in Gurugram, along with a spur to Dwarka Expressway.
— Nitin Gadkari (@nitin_gadkari) June 7, 2023
With a comprehensive cost of Rs. 5,452 crore, this visionary and entirely elevated… pic.twitter.com/kGKSPtPK7m
మణిపూర్, ఒడిశా ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం
కేంద్ర కేబినెట్ సమావేశంలో మణిపూర్ హింసాత్మక ఘటనల్లో చనిపోయిన వారికి, ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోడీ సహా మంత్రులు అందరూ సంతాపం తెలిపారు.
#Cabinet approves increase in Minimum Support Prices (MSP) for Kharif Crops for Marketing Season 2023-24
— PIB India (@PIB_India) June 7, 2023
The overall foodgrain production of Kharif from 285 Million Tonne in 2018-19 has been estimated to reach 330 Million Tonne by the financial year 2023-24
- Union Minister… pic.twitter.com/gxnMqnslhS
AFCAT 2023: ఏఎఫ్ క్యాట్ 2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
Rajasthan Elections: ముస్లిం ఎంపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేశ్ బిధూరికి కీలక బాధ్యతలు
NIA Raids: 6 రాష్ట్రాల్లో 51 చోట్ల ఎన్ఐఏ సోదాలు- ఖలిస్థానీ, గ్యాంగ్స్టర్స్ సమాచారంతో దాడులు
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం
Khalistani terrorist Gurpatwant Singh Warning : నరేంద్రమోదీ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్పై ఖలీస్థానీ ఉగ్రవాదుల కన్ను - వైరల్ అవుతున్న పన్నూన్ ఆడియో !
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!
Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్ మాక్సీ! రాజ్కోట్ వన్డేలో టీమ్ఇండియా ఓటమి
/body>