అన్వేషించండి

Viral News: ఇండియన్ రైళ్లలో టాయిలెట్లు ఏర్పాటు వెనుక ఉన్న వింత సంఘటన మీకు తెలుసా!

Indian Railways News | ఒక్క లెటర్ తో బ్రిటిష్ ప్రభుత్వంలో భారతీయుడు చంద్రసేన్ కదలిక తెచ్చారు. క్రమంగా దేశంలో అన్ని రైళ్లలో టాయిలెట్స్ ఏర్పాటు చేశారు.

Toilets in Indian Railways | అర్జెంటుగా టాయిలెట్ కి వెళ్ళాల్సి వచ్చి ట్రైన్ దిగితే.. ఆ ట్రైన్ కదిలిపోయింది. ఒక చేత్తో లోటా.. మరో చేత్తో దోవతీ పట్టుకుని ఆ ట్రైన్ ఆపండి అంటూ వెనకాల పరిగెడుతూ ఉంటే.. చూసే వాళ్ళందరూ నవ్వుతుంటే ఆ సంఘటన చెప్పుకోవడానికి కామెడీగాను.. అనుభవించిన వాళ్ళకి నరకం గాను ఉంటుందనడం లో ఎలాంటి అనుమానం లేదు. కానీ నిజంగా జరిగిన ఆ సంఘటన ఈరోజు రైళ్లలో టాయిలెట్లు ఏర్పాటుకు కారణమైందంటే నమ్మగలరా?
దూర ప్రయాణానికి ఎక్కువమంది  ఎంచుకునే రవాణా సౌకర్యం రైల్వేలు మాత్రమే. మధ్యతరగతి,ఎగువ మధ్య తరగతి ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించడానికి ముఖ్య కారణం వాటిలోని టాయిలెట్ సౌకర్యమే. టాయిలెట్స్ లేని రైళ్లను ప్రస్తుతం ఊహించడం కూడా కష్టమే.. కానీ భారతీయ రైల్వేలలో  టాయిలెట్ల ఏర్పాటు వెనుక  వందేళ్ళ క్రితం ఒఖిల్ చంద్రసేన్ అనే ఒక భారతీయుడు పడిన ఇబ్బంది కారణం అయింది.

 ఒకప్పుడు భారతీయ రైళ్లలో టాయిలెట్స్ ఉండేవి కావు 

1853 నుండి బ్రిటిష్ ఇండియాలోట్రైన్స్ నడుస్తున్నా వాటిలో ప్రయాణికుల కోసం టాయిలెట్ సౌకర్యం ఉండేది కాదు.మొదట్లో మరీ దూరం వెళ్లే ట్రైన్స్ లేకపోవడమే దీనికి కారణం. నెమ్మదిగా దూర ప్రాంతాలకు వెళ్లే ట్రైన్స్ కూడా పట్టాలపై పరుగులు తీయడం మొదలైంది. అని టాయిలెట్స్ ఏర్పాటు పై అప్పటి బ్రిటిష్ వాళ్లు పెద్దగా దృష్టి పెట్టే వాళ్ళు కాదు. 50 ఏళ్ల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. చివరికి 1909లో మొట్టమొదటిసారిగా అప్పర్ క్లాస్ బోగీల్లో టాయిలెట్స్ ని ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. దీని వెనక "ఒఖిల్ చంద్రసేన్" అనే భారతీయుడు పడిన ఇబ్బంది ప్రధాన కారణం.

2 జులై 1909 న బెంగాల్ లోని అహ్మద్ పూర్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. 'ఒఖిల్ చంద్రసేన్, అనే వ్యక్తి ట్రైన్ లో ప్రయాణిస్తుండగా  ఆయన టాయిలెట్ కి వెళ్ళాల్సి వచ్చింది. బెంగాల్ లోని  "అహ్మద్ పురి " స్టేషన్ వద్ద ఆయన ట్రైన్ దిగారు. ఈలోపు గార్డ్ సిగ్నల్ ఇవ్వడంతో ట్రైన్ కదిలిపోయింది. దానితో కంగారుపడిన చంద్రసేన్ ఆ రైలు ఆపండి అంటూ దాని వెనకాలే ఒక చేత్తో నీళ్ల లోటా, మరో చేత్తో దోవతీ పట్టుకుని పరిగెత్త సాగారు. వేగాన్ని అందుకోలేక పడిపోయిన ఆయన్ను చూసి స్టేషన్లోని జనాలు నవ్వడంతో  తీరని అవమానానికి గురయ్యారు చంద్రసేన్.


Viral News: ఇండియన్ రైళ్లలో టాయిలెట్లు ఏర్పాటు వెనుక ఉన్న వింత సంఘటన మీకు తెలుసా!

"హబీబ్ గంజ్" రైల్వే డివిజనల్ ఆఫీస్ కు వచ్చీ రాని ఇంగ్లీష్ లోనే ఒక లెటర్ రాస్తూ తాను పడిన ఇబ్బందిని వివరించారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు దూర ప్రాంత ప్రయాణికులు పడుతున్న ఇబ్బంది ని దృష్టిలో పెట్టుకుని 80Km ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లలో టాయిలెట్ లను ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. మొదట్లో హై క్లాస్ బోగీల్లోనే ఈ ఏర్పాటు చేసినా తర్వాతి కాలంలో జనరల్ బోగీల్లోకి కూడా టాయిలెట్స్ వచ్చేసాయి. అయితే 2016 వరకూ ట్రైన్ డ్రైవర్లకు ఈ అవకాశం ఉండేది కాదు. 2016 నుంచి తయారవుతున్న లోకో ఇంజన్ లలో టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనితో చాలాకాలంగా సమస్యలు ఎదుర్కొన్న  ట్రైన్ డ్రైవర్లకు ( పైలెట్ ) ఒక పరిష్కారం దొరికింది.

 ఇప్పటికీ భద్రంగా ఉన్న చంద్రసేన్ లెటర్ 

 రైళ్ల లో టాయిలెట్లు  కోరుతూ 1909 లో  ' ఒకీల్ చంద్రసేన్ ' రాసిన లెటర్ ఇప్పటికి ఢిల్లీలోని రైల్వే మ్యూజియంలో  భద్రంగా ఉంది. వృద్ధులకు, చిన్న పిల్లలకు, మహిళలకు దూర ప్రయాణాలు ఎదురయ్యే అతిపెద్ద సమస్యకు పరిష్కారం దొరకడానికి కారణమైన "ఒకిల్ చంద్రసేన్ " ను గుర్తు చేసుకోవడమే ఆయనకు మనం ఇచ్చే నివాళి. 

Also Read: Beautiful Handwriting : ప్రపంచంలోనే అందమైన చేతిరాత ఇదేనట - నేపాల్ కు చెందిన బాలిక రికార్డ్

టాప్ హెడ్ లైన్స్

Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Handloom Day Modi Reel: జాతీయ చేనేత దినోత్సవంపై ప్రధాని మోదీ కొత్త రీల్‌! చేనేత వస్త్రాలు కొని రీల్స్ చేయాలని పిలుపు!
జాతీయ చేనేత దినోత్సవంపై ప్రధాని మోదీ కొత్త రీల్‌! చేనేత వస్త్రాలు కొని రీల్స్ చేయాలని పిలుపు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Fruits Before or After Meals భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
Embed widget