అన్వేషించండి

డెంగీ మలేరియా లాంటిదే సనాతన ధర్మం, పూర్తిగా నిర్మూలించాల్సిందే - ఉదయ నిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

Udhayanidhi Stalin Remark: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Udhayanidhi Stalin Remark:


సనాతన ధర్మంపై వ్యాఖ్యలు..

తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాతో పోల్చి చిక్కుల్లో పడ్డారు. సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించడమే కాదని...పూర్తిగా  సమాజంలో నుంచి నిర్మూలించాలని అన్నారు. సామాజిక న్యాయానికి ఈ ధర్మం వ్యతిరేకం అని తేల్చి చెప్పారు. Sanatana Abolition Conference లో మాట్లాడిన సందర్భంలో ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 

"కొన్ని విషయాలను కేవలం వ్యతిరేకిస్తే సరిపోదు. పూర్తిగా సమాజం నుంచి తొలగించాలి. డెంగ్యూ. మలేరియా, కరోనాను ఎలాగైతే నిర్మూలిస్తున్నామో...అదే విధంగా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి. సనాతనం అనేది సంస్కృత పదం. సామాజిక న్యాయానికి ఇది పూర్తిగా విరుద్ధం" 

- ఉదయనిధి స్టాలిన్, తమిళనాడు మంత్రి 

ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగుతోంది. ముఖ్యంగా బీజేపీ నేతలు వరుస పెట్టి ట్వీట్‌లతో విమర్శలు చేస్తున్నారు. ఈ కామెంట్స్‌పై కాంగ్రెస్ మౌనంగా ఉండటమేంటని ప్రశ్నిస్తున్నారు. I.N.D.I.A కూటమిలోని పార్టీలన్నీ సనాతన ధర్మానికి వ్యతిరేకమే అని మండి పడుతున్నారు. 

"ఓవైపు రాహుల్ గాంధీ ప్రేమ దుకాణం తెరిచాను అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అదే కాంగ్రెస్ మిత్రపక్షమైన డీఎమ్‌కే మంత్రి ఉదయ నిధి స్టాలిన్ మాత్రం సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అంటున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ మౌనంగా ఉంది. అంటే ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నట్టేగా. ఇప్పుడు ఆ కూటమి ఉద్దేశాలేంటన్నది స్పష్టంగా అర్థమవుతున్నాయి. వాళ్లకు అవకాశమిస్తే దేశాన్ని ముక్కలు చేస్తారు"

- అమిత్ మాల్వియా, బీజేపీ నేత 


ఉదయనిధిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ ట్వట్ చేయగా...దీనిపైనా ఆయన స్పందించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేదే లేదని తేల్చి చెప్పారు. 

"లీగల్‌గా ఎలాంటి సవాళ్లు ఎదురైనా నేను సిద్ధమే. ఇలాంటి బెదిరింపులుకు నేనేమీ భయపడిపోను. మేం పెరియార్ చూపిన బాటలోనే నడుస్తున్నాం. సామాజిక న్యాయం కోసం ఎంత పోరాటమైనా చేస్తాం. ఇప్పుడే కాదు. ఎప్పుడూ అదే అంటాను. ఈ ద్రవిడ భూమి నుంచి సనాతన ధర్మాన్ని నిర్మూలించడమే మా లక్ష్యం"

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget