అన్వేషించండి

Gyanvapi Case: మసీదులో పూజలకు అనుమతినివ్వాలన్న పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ-ఎప్పుడంటే?

జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగానికి పూజలు చేసుకునేలా అనుమతినివ్వాలన్న పిటిషన్‌పై సుప్రీం కోర్టు జులై 21న విచారణ చేపట్టనుంది.

జులై 21వ తేదీన హియరింగ్

జ్ఞానవాపి మసీదులో వెలుగులోకి వచ్చిన శివలింగానికి పూజలకు అనుమతినివ్వాలన్న పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. ఈ నెల 21వ తేదీన హియరింగ్‌కు అనుమతినిచ్చింది. అదే సమయంలో శివలింగం ఎన్నేళ్ల క్రితందో కూడా తేల్చి చెప్పాలని ఆదేశించింది. కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా స్పష్టమైన సమాచారం ఇవ్వాలని చెప్పింది. జస్టిస్ ఎన్‌వీ రమణ,జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం ఈ విచారణ చేపట్టనుంది. దీంతో పాటు అంజుమాన్ ఇంతెజామియా మసీద్ కమిటీ వేసిన పిటిషన్‌ను కూడా విచారించనుంది. మసీదు లోపల సర్వే చేపట్టటాన్ని వ్యతిరేకిస్తూ ఈ కమిటీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ఈ హియరింగ్ జరగనుంది. శివలింగం బయటపడిన ప్రాంతాన్ని పరిరక్షించాలని ఇప్పటికే సుప్రీం కోర్టు వారణాసి జిల్లా కోర్టుకి ఆదేశాలు జారీ చేసింది. నమాజ్ చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేసింది. 

శివలింగానికి పూజలకు అనుమతి కోసం పిటిషన్ 

జ్ఞానవాపి మసీదులోని వాజుఖానాలో బయటపడిన శివలింగానికి హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతినివ్వాలని ఓ వ్యక్తి పిటిషన్ వేశారు. వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయం పక్కనే ఉన్న ఈ మసీదులో కొన్ని నెలల క్రితం శివలింగం బయట పడింది. చాన్నాళ్ల పాటు ఈ అంశంపై వాదనలు జరిగాయి. అయితే శ్రీకృష్ణ జన్మభూమి ముక్తిస్థల్ అధ్యక్షుడు రాజేశ్ మని త్రిపతి, సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ వేశారు. శ్రావణ మాసం ప్రారంభమైనందున మసీదులోని శివలింగానికి హిందువులు పూజా కార్యక్రమాలు చేసుకునేందుకు అనుమతినివ్వాలని కోరారు. ఇది హిందువుల హక్కు అని అందులో ప్రస్తావించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మతపరమైన కార్యక్రమాలు చేసుకునే హక్కు అందరికీ ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. శ్రావణ మాసంలో శివుడికి పూజలు చేయటం హిందూ ఆచారమని, వారి హక్కులని, 
మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పూజలకు అనుమతినివ్వాలని కోరారు. 

ఏప్రిల్‌లో హిందూ మహిళల పిటిషన్

ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీన వారణాసి కోర్టు ఓ కీలక తీర్పునిచ్చింది. మసీదులోని శివలింగానికి  పూజలకు అనుమతించాలని ఓ ఐదుగురు హిందూ మహిళలు కోర్ట్‌లో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్ట్...ఈ అంశంపై సర్వే చేయటమే కాకుండా లోపల వీడియో తీసి సాక్ష్యాధారాలు బయట పెట్టాలని ఆదేశించింది. మే 16వ తేదీన ఈ సర్వే పూర్తైంది. మే 19న కోర్ట్‌లో ఈ సర్వేను ప్రవేశపెట్టారు. వీడియోగ్రఫీ సర్వేలో మసీదులో శివలింగం బయపడిందని హిందువులు వాదించారు. కానీ ముస్లింలు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. వాజుఖానాలో ఏర్పాటు చేసిన వాటర్‌ ఫౌంటేన్‌కు సంబంధించిన శకలం అని వివరించారు. మే 20 వ తేదీన సుప్రీం కోర్టు ఈ కేసుని వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. 

టాప్ హెడ్ లైన్స్

Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
MP Jhabua Man Builds Underground House: తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !
తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Monsoon Session Parliament: కేంద్రం మాస్టర్ ప్లాన్‌కు జెన్-జీ బ్రేక్ - పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే డీలిమిటేషన్ బిల్లు ?
కేంద్రం మాస్టర్ ప్లాన్‌కు జెన్-జీ బ్రేక్ - పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే డీలిమిటేషన్ బిల్లు ?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Embed widget