అన్వేషించండి

Eye Surgery: 'చిరంజీవి ఆరోగ్య పథకం’ కింద కంటి ఆపరేషన్లు, ఏకంగా చూపు కోల్పోయిన 18 మంది!

Rajasthan: రాజస్థాన్ లోని అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి చూపు శస్త్ర చికిత్స చేసుకున్న 18 మంది కంటిచూపు కోల్పోయారు.

Rajasthan: కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు.. చూపు సరిగ్గా కనిపించడం లేదని ఆపరేషన్ చేయించుకుంటే ఉన్న చూపు కూడా పోయింది. ఈ ఘటన రాజస్థాన్ లో జరిగింది. 18 మంది వ్యక్తులు కంటి చూపు శస్త్రచికిత్స చేయించుకోగా.. వారందరికీ పూర్తిగా కంటి చూపు కోల్పోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీరందరికి రాజస్థాన్ లోని అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి అయిన సవాయ్ మాన్ సింగ్ (SMS) హాస్పిటల్ లో ఆపరేషన్ జరిగింది. బాధితులు అంతా కంటిశుక్లం ఆపరేషన్లు చేయించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. కంటి చూపు కోల్పోయిన 18 మందిలో ఎక్కువ మంది రాజస్థాన్ ప్రభుత్వ చిరంజీవి ఆరోగ్య పథకం కింద ఆపరేషన్లు చేయించుకున్నారు. 

జూన్ 23వ తేదీన వీరికి కంటి శుక్లం ఆపరేషన్ జరిగింది. జులై 5వ తేదీ వరకు అంతా బాగానే ఉంది. బాధితులకు కంటి చూపు కూడా సక్రమంగానే ఉంది జులై 6 -7 తేదీల్లో ఆపరేషన్ చేయించుకున్న 18 మంది కంటి చూపు కోల్పోయారు. ఆ తర్వాత మళ్లీ ఆపరేషన్ చేసినా కంటి చూపు రాలేదు అని ఓ బాధితుడు తెలిపారు. బాధితులు కంటి చూపు కోల్పోవడానికి ఇన్ఫెక్షన్ సోకడమే కారణమని వైద్యులు చెబుతున్నారు. వారికి సోకిన ఇన్ఫెక్షన్ ను నయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. అలాగే పలువురు రోగుల్లో కంటి నొప్పి కూడా తీవ్రంగా ఉన్నట్లు ఫిర్యాదులు అందాయి. వారందరినీ తిరిగి ఆస్పత్రిలో చేరాలని కోరినట్లు వైద్యులు చెప్పుకొచ్చారు. కొంత మందికి మళ్లీ సర్జరీ చేసినా రెండుసార్లకు మించి ఆపరేషన్ చేసినా కంటి చూపు తిరిగి రాలేదని తెలిపారు. సవాయ్ మాన్ సింగ్ ప్రభుత్వ ఆస్పత్రిలోని ఆప్తాల్మాలజీ విభాగం అధికారులు మాత్రం.. తాము చేసిన ఆపరేషన్లలో ఎలాంటి లోపం లేదని అంటున్నారు. రోగులకు కంటి చూపు కోల్పోవడంపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.

కంటి శుక్లం అంటే ఏంటి?

అంధత్వానికి దారితీసే వాటిలో కంటిశుక్లం ప్రధానం కారణంగా ఉంది. దీన్ని సాధారణ శస్త్ర చికిత్స విధానాాలతో నివారించవచ్చు. పూర్తి స్థాయిలో దృష్టిని పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు శుక్లం ముదిరితే ఆపరేషన్ కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి కంటిశుక్లం ఆపరేషన్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ ను తొలి దశలో గుర్తిస్తే కంటి చూపు కోల్పోకుండా చికిత్స చేయవచ్చు. మధుమేహం, గ్లకోమా, మూత్రపిండాల వ్యాధి, కంటి గాయాలు, ధూమపానం, కంటి లోపల మంట, కొన్ని రకాల ఔషధాలు, జన్యు పరమైన కారణాలు, కంటికి సోకే ఇన్ఫెక్షన్ల వల్ల కంటిశుక్లం వస్తుంది.

కంటి శుక్లం లక్షణాలు:

కంటి శుక్లం వచ్చిన వారిలో కంటి గుడ్డుపై మబ్బుగా కనిపిస్తుంది. కంటి చూపు అస్పష్టంగా ఉంటుంది. ఒక వస్తువు రెండుగా కనిపిస్తుంది. రాత్రిపూట చూపు మరింత బలహీనంగా ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కంటి నొప్పి ఇబ్బంది పెడుతుంది. మసక వెలుతురులో కంటిచూపు సరిగ్గా ఉండదు. కనుబొమ్మలు అసంకల్పితంగా వణుకుతాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Card Online Apply Telangana: మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేయడానికి లేదు- తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ
మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేయడానికి లేదు- తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ
Delhi Election Result 2025: ఢిల్లీ ఫలితాలు అన్నా హజారేను సంతోష పెట్టి ఉంటాయి- 'ఆప్ అవినీతి పార్టీ, కాంగ్రెస్ పరాన్నజీవి', ప్రధాని మోదీ విమర్శలు
ఢిల్లీ ఫలితాలు అన్నా హజారేను సంతోష పెట్టి ఉంటాయి- 'ఆప్ అవినీతి పార్టీ, కాంగ్రెస్ పరాన్నజీవి', ప్రధాని మోదీ విమర్శలు
Kiran Royal: వివాదంలో జనసేన నేత కిరణ్ రాయల్ - డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదన్న మహిళ
వివాదంలో జనసేన నేత కిరణ్ రాయల్ - డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదన్న మహిళ
Andhra Pradesh: కూటమి ప్రభుత్వాన్ని అభినందించకుండా ఉండలేరు -  పేదల ప్రాణాలను కాపాడేలా ఉచితంగా ఖరీదైన ఇంజక్షన్
కూటమి ప్రభుత్వాన్ని అభినందించకుండా ఉండలేరు - పేదల ప్రాణాలను కాపాడేలా ఉచితంగా ఖరీదైన ఇంజక్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

AAP Loss Yamuna Pollution Key Role | Delhi Election Results 2025లో కేజ్రీకి కలిసి రాని యమున | ABP DesamArvind Kejriwal on AAP Election Loss | ఆమ్ ఆద్మీ ఓటమిపై స్పందించిన కేజ్రీవాల్ | ABP DesamDelhi Elections Results 2025 | మాస్టర్ మైండ్ Manish Sisodia ను వీక్ చేశారు..ఆప్ ను గద్దె దింపేశారు | ABP DesamDelhi Elections Results 2025 | Delhi గద్దె Arvind Kejriwal దిగిపోయేలా చేసింది ఇదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Card Online Apply Telangana: మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేయడానికి లేదు- తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ
మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేయడానికి లేదు- తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ
Delhi Election Result 2025: ఢిల్లీ ఫలితాలు అన్నా హజారేను సంతోష పెట్టి ఉంటాయి- 'ఆప్ అవినీతి పార్టీ, కాంగ్రెస్ పరాన్నజీవి', ప్రధాని మోదీ విమర్శలు
ఢిల్లీ ఫలితాలు అన్నా హజారేను సంతోష పెట్టి ఉంటాయి- 'ఆప్ అవినీతి పార్టీ, కాంగ్రెస్ పరాన్నజీవి', ప్రధాని మోదీ విమర్శలు
Kiran Royal: వివాదంలో జనసేన నేత కిరణ్ రాయల్ - డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదన్న మహిళ
వివాదంలో జనసేన నేత కిరణ్ రాయల్ - డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదన్న మహిళ
Andhra Pradesh: కూటమి ప్రభుత్వాన్ని అభినందించకుండా ఉండలేరు -  పేదల ప్రాణాలను కాపాడేలా ఉచితంగా ఖరీదైన ఇంజక్షన్
కూటమి ప్రభుత్వాన్ని అభినందించకుండా ఉండలేరు - పేదల ప్రాణాలను కాపాడేలా ఉచితంగా ఖరీదైన ఇంజక్షన్
Telangana News: కాంగ్రెస్‌కు గుండు సున్న- కేసీఆర్‌ను కలిసిన వారంతా పోయారు - సోషల్ మీడియాలో రచ్చ రచ్చ 
కాంగ్రెస్‌కు గుండు సున్న- కేసీఆర్‌ను కలిసిన వారంతా పోయారు - సోషల్ మీడియాలో రచ్చ రచ్చ 
Parvesh Verma: ఢిల్లీ సీఎం రేసులో జెయింట్ కిల్లర్ పర్వేష్ వర్మ - ఆయన అస్తులెన్నో తెలిస్తే షాకే !
ఢిల్లీ సీఎం రేసులో జెయింట్ కిల్లర్ పర్వేష్ వర్మ - ఆయన అస్తులెన్నో తెలిస్తే షాకే !
IIFA Awards 2025: ఐఫా అవార్డుల ప్రదానం ఎప్పుడు, ఎక్కడ ? టిక్కెట్లు ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?
IIFA అవార్డుల ప్రదానం ఎప్పుడు, ఎక్కడ ? టిక్కెట్లు ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?
Arvind Kejriwal: మోదీనే వణికించిన మొనగాడు కేజ్రీవాల్, కానీ నాలుగోసారి ఎందుకు ఓడాడంటే!
మోదీనే వణికించిన మొనగాడు కేజ్రీవాల్, కానీ నాలుగోసారి ఎందుకు ఓడాడంటే!
Embed widget