అన్వేషించండి

దూకుడు పెంచిన రాహుల్ గాంధీ, పార్లమెంట్‌లో పవర్‌ఫుల్ స్పీచ్ - ఆ వ్యాఖ్యలతో దుమారం

Rahul Gandhi Speech: పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ మునుపటి కన్నా దూకుడుగా ప్రసంగించారు.

Rahul Gandhi Speech: 

సుదీర్ఘ ప్రసంగం..

రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించినప్పటి నుంచి ఆయన పార్లమెంట్‌లో ఏం మాట్లాడతారన్న ఉత్కంఠ మొదలైంది. గతంలో అదానీ వ్యవహారంపై మాట్లాడిన రాహుల్...మోదీ సర్కార్‌పై గట్టిగానే విమర్శలు చేశారు. ఆ తరవాత ఉన్నట్టుంది పరువు నష్టం దావా కేసులో ఇరుక్కుని న్యాయ పోరాటం చేసి చివరకు విజయం సాధించారు. లోక్‌సభ సభ్యత్వాన్ని తిరిగి పొందారు. అందుకే ఈ సారి ఎలా మాట్లాడతారు..? మోదీని మళ్లీ టార్గెట్ చేస్తారా...? అన్న ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సాగింది రాహుల్ ప్రసంగం. మొట్ట మొదట స్పీకర్‌కి థాంక్స్ చెప్పిన రాహుల్ ఆ తరవాత తన ప్రసంగాన్ని కొనసాగించారు. మొదలు పెట్టడం పెట్టడమే మోదీ సర్కార్‌పై విరుచుకు పడ్డారు. జోడో యాత్ర ఇంకా ముగిసిపోలేదని, రెండో ఫేజ్ త్వరలోనే మొదలవుతుందంటూ స్పీచ్ స్టార్ట్ చేసిన ఆయన...ఆ తరవాత మణిపూర్‌ ప్రస్తావన తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రధాని మోదీ, బీజేపీ లక్ష్యంగా మాటల దాడి చేశారు. గతంలో ఎప్పుడూ లేనంతా ఆగ్రహంతో కనిపించారు రాహుల్ గాంధీ. అదానీ వ్యవహారంలోనూ మోదీ సర్కార్‌ని ప్రశ్నించినా...ఈ సారి మాత్రం ఆ డోస్ మరింత పెరిగింది. చాలా సెటిల్డ్‌గా మాట్లాడుతూనే చేయాల్సిన విమర్శలన్నీ చేశారు. జోడో యాత్రలో ఎదురైన అనుభవాల నుంచి మణిపూర్ బాధితుల ఆవేదనను తెలుసుకోవడం వరకూ అన్ని విషయాలూ ప్రస్తావించారు. బీజేపీ గట్టిగా నినాదాలు చేసినప్పటికీ ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. 

వాయిస్ పెంచిన రాహుల్..

క్రమంగా తన వాయిస్‌ని పెంచిన రాహుల్...మణిపూర్‌లో భరత మాతను బీజేపీ హత్య చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పార్లమెంట్‌లో దుమారం రేపాయి. మధ్యమధ్యలో బీజేపీ ఎంపీలు అడ్డుతగులుతుంటే "కాస్త మంచినీళ్లు తాగండి" అంటూ సెటైర్లు కూడా వేశారు రాహుల్. మణిపూర్‌ విషయంలో ఆయన గట్టిగానే మాట్లాడతారని కాంగ్రెస్ నేతలు ముందు నుంచే చెబుతున్నా...ఈ స్థాయిలో ప్రసంగం ఉంటుందని ఎవరూ ఊహించలేదు. భరత మాతపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యే అవకాశాలున్నాయని తెలిసినా...అవేమీ పట్టించుకోకుండా చాలా దూకుడుగా కనిపించారు. ఈ కామెంట్స్‌ని ప్రస్తావిస్తూ నైతికంగా, రాజకీయంగా కాంగ్రెస్‌ని దెబ్బ కొట్టే పనిలో ఇప్పటికే పడిపోయింది బీజేపీ. పైగా జాతీయవాదంతోనూ తిప్పికొట్టాలని చూస్తోంది. ఇవన్నీ తెలియకుండానే రాహుల్ అలాంటి కామెంట్స్ చేశారా..? లేదంటే వ్యూహాత్మకంగానే ఇలా దూకుడుగా వ్యవహరించారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవలే ఇండియా కూటమి పేరుతో దాదాపు 26 పార్టీలు ఒక్కటయ్యాయి. ప్రధాని మోదీ పదేపదే ఈ కూటమిపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌పై ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. అందుకే...ప్రతిదాడి మొదలు పెట్టారు రాహుల్. అదీ పార్లమెంట్ సాక్షిగా. జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే అంటూ నినదించారు. ఇదంతా బాగానే ఉన్నా...కాంగ్రెస్‌కి అవినీతి మరకను పదేపదే గుర్తు చేస్తూ బీజేపీ ఎంపీలు ప్రతిసారీ ఎదురు దాడి చేస్తుంటారు. ఈ సారి కూడా అదే జరిగింది. రాహుల్‌కి దీటుగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విమర్శలు చేశారు. కశ్మీర్‌ తగలబడిపోతే ఏం చేశారని ప్రశ్నించారు. దీంతో మరోసారి సెల్ఫ్‌ డిఫెన్స్‌లో పడిపోయింది కాంగ్రెస్

Also Read: మణిపూర్‌ సాక్షిగా బీజేపీ భరత మాతను హత్య చేసింది, రాహుల్ సంచలన వ్యాఖ్యలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget