By: Ram Manohar | Updated at : 15 Jul 2023 05:42 PM (IST)
గుజరాత్ కోర్టు తీర్పుని సవాలు చేస్తూ రాహుల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.
Rahul Gandhi Defamation Case:
పరువు నష్టం దావా కేసులో గుజరాత్ హైకోర్టు స్టే పిటిషన్ని కొట్టేసిన నేపథ్యంలో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. గుజరాత్ హైకోర్టు తీర్పుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 2019లో ఎన్నికల ప్రచారంలో మోదీ ఇంటి పేరుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఓ బీజేపీ నేత సూరత్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన కోర్టు రాహుల్ని దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. అయితే...ఈ తీర్పుని సవాలు చేస్తూ గుజరాత్ హైకోర్టులో స్టే పిటిషన్ వేశారు రాహుల్. దీనిపై విచారణ చేపట్టిన గుజరాత్ కోర్టు..ఈ పిటిషన్ని తిరస్కరించింది. జులై 7న ఈ పిటిషన్ని కొట్టేసింది. దీన్ని సవాలు చేస్తూ వారం రోజుల తరవాత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
Congress leader Rahul Gandhi moves Supreme Court challenging Gujarat High Court order passed on July 7 in connection with a 2019 defamation case.
— ANI (@ANI) July 15, 2023
On July 7, Gujarat HC dismissed Rahul Gandhi's plea and upheld Sessions' court order denying a stay on conviction.
జైలు శిక్ష...!
సూరత్ కోర్టు..ఈ ఏడాది మార్చి 23న రాహుల్ని దోషిగా తేలుస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఇదే కేసులో లోక్సభ సభ్యత్వమూ కోల్పోయారు రాహుల్. అప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ మధ్య యుద్ధం మరో స్థాయికి చేరుకుంది. "రాహుల్ గాంధీపై 10కిపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దోషిగా తేలిన కేసు తర్వాత కూడా పలు కేసులు దాఖలయ్యాయి. వీర్ సావర్కర్ మనవడు కూడా కేసు వేశారు. ఏదిఏమైనా.. మోదీ ఇంటి పేరు వివాదంలో పడిన శిక్షతో రాహుల్ గాంధీకి అన్యాయం జరిగింది అనడానికి ఏం లేదు! ఈ తీర్పు సరైనదే. సూరత్ కోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు " అని గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చింది.సుప్రీంకోర్టులోనూ శిక్షపై స్టే లభించకపోతే ఆయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని రకాల న్యాయస్థానాల్లో అవకాశాలు కోల్పోయిన తర్వాత ఆయన .. జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఇలా జైలుకు వెళ్తే.. పరువు నష్టం కేసులో జైలుకు వెళ్లిన ప్రధాని పదవికి పోటీ పడే నేతగా చరిత్రకెక్కుతారు. రెండేళ్ల పాటు జైల్లో ఉండి... విడుదలైన తర్వాత ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అవుతారు. ఈ కారణంగా రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై ఉత్కంఠ నెలకొంది.
2019లో కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేసిన క్రమంలో మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్. "దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుంది" అంటూ అప్పట్లో ఆయన చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి. బీజేపీ తీవ్రంగా దీనిపై మండి పడింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా దాఖలైంది.
Also Read: ఆన్లైన్లో రూ. 90 వేల కెమెరా లెన్స్ ఆర్డర్, బాక్స్ ఓపెన్ చేస్తే మైండ్ బ్లాక్
Dhiraj Sahu IT Raids Money: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నగదు రూ.318 కోట్లు, ఇంకా 40 సంచులు పెండింగ్!
CLAT Result 2024: క్లాట్-2024 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకోండిలా
Indian Navy: ఇండియన్ నేవీలో 910 ఛార్జ్మ్యాన్, డ్రాఫ్ట్స్మ్యాన్, ట్రేడ్స్మ్యాన్ మేట్ ఉద్యోగాలు - ఈ అర్హతలుండాలి
Look Back 2023: 2023ని మర్చిపోలేని విధంగా చేసిన ఉత్తరకాశీ సొరంగం ఘటన - పాఠాలు నేర్పిన ప్రమాదం
Chhattisgarh CM: ఛత్తీస్గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - మొత్తానికి క్లారిటీ ఇచ్చిన పార్టీ
Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్
Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
/body>