అన్వేషించండి

President Droupadi Murmu : ప్రపంచానికి భారత్‌ ఓ మార్గదర్శి, దేశ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి - రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆమె తన తొలి ప్రసంగంలో 1947లో దేశ విభజన సమయంలో ప్రాణాలర్పించిన వారందరికీ నివాళులర్పించారు.

President Droupadi Murmu : దేశ భద్రత, పురోగతి, శ్రేయస్సు కోసం చేయగలిగినదంతా చేస్తామని ప్రతిజ్ఞ చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశ 75వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఆదివారం రాష్ట్రపతి జాతీనుద్దేశించి మాట్లాడారు. దేశంలో లింగ అసమానతలు తగ్గుతున్నాయని, మహిళలు అడ్డంకులు అధిగమించి ముందుకు దూసుకెళ్తున్నారని రాష్ట్రపతి  అన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం అన్నారు. భారత్‌ 75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాలు జరుపుకుంటుందన్నారు. 1947 ఆగస్టు 15న బ్రిటీష్ సంకెళ్లను తెంచుకుని స్వాతంత్ర్యం సాధించామని రాష్ట్రపతి గుర్తుచేశారు. భారతీయులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడం కోసం ఎందరో తమ సర్వస్వాన్ని త్యాగం చేశారన్నారు. వారి త్యాగాలను మరోసారి స్మరించుకోవాల్సిన సందర్భం వచ్చిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశ విభజన సందర్భంగా ఆగస్టు 14న  స్మృతి దివస్‌ జరుపుకుంటున్నామన్నారు. 2021 మార్చి నుంచి ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకొంటున్నామని ఆమె అన్నారు.

ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ 

ఆత్మనిర్భర్‌ భారత్‌ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్రపతి కోరారు. దేశ ప్రజలు స్వాతంత్ర్య వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారన్నారు.  దేశ వ్యాప్తంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందన్నారు. ప్రజాస్వామ్య సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపడంలో భారత్‌ తన సత్తా చాటిందన్నారు. భారత్‌ అంటే భిన్నత్వంలో ఏకత్వం అన్నారు. అనేక రకాల వైవిధ్యంతో నిండి ఉందన్నారు. ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌ స్ఫూర్తితో అందరూ కలిసి నడవడానికి ప్రేరేపిస్తోందన్నారు.

ఆగస్ట్ 14న స్మృతి దివాస్ 

" 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ మహత్తర సందర్భంలో మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. భారతదేశం స్వతంత్ర దేశంగా 75 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. సామాజిక సామరస్యం, ఐక్యత, ప్రజల సాధికారతను ప్రోత్సహించడానికి ఆగస్ట్ 14న స్మృతి దివాస్ గా పాటిస్తున్నాం. వలస పాలకుల కబంధహస్తాల నుంచి మనల్ని మనం విముక్తులను చేసుకుని, మన దేశాన్ని పునర్నిర్మించుకోవాలని నిర్ణయించిన రోజు స్వాతంత్ర్య దినోత్సవం. మనమందరం ఈ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో భారతదేశంలో స్వేచ్ఛగా జీవించడం సాధ్యమయ్యేందుకు అపారమైన త్యాగాలు చేసిన అందరినీ మనం గుర్తుచేసుకోవాలి" అని ప్రెసిడెంట్ ముర్ము  అన్నారు. 

ప్రపంచానికే మార్గదర్శి

కరోనా సమయంలో ప్రపంచమంతా ఎన్నో సవాళ్లు ఎదుర్కొందని, ఈ క్లిష్ట సమయాన్ని భారత్ సమర్థంగా ఎదుర్కొందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కరోనా ఎదుర్కొని ప్రపంచానికి భారత్‌ ఓ మార్గదర్శిలా నిలిచిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టిందని గుర్తుచేశారు. అంకుర సంస్థలతో భారత్‌ అభివృద్ధిలో దూసుకెళ్తోందని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థలో డిజిటల్‌ విధానం పెనుమార్పులు తీసుకొచ్చిందన్నారు. దేశంలో స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించిందని రాష్ట్రపతి అన్నారు. 

Also Read : Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట విజయ్ వర్సెస్ రజనీకాంత్ - ఘాటు లేఖ రిలీజ్ చేసిన సూపర్ స్టార్ !
తమిళనాట విజయ్ వర్సెస్ రజనీకాంత్ - ఘాటు లేఖ రిలీజ్ చేసిన సూపర్ స్టార్ !
Pawan Kalyan Tamil Interview: విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
Kerala Assembly Elections 2026: కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
Dangerous bike smoke: బైక్ ఆన్ చేసి గదిలో ఉంచితే ప్రాణాలు మిగలవు - పుంగనూరు ఘటనలో జరిగింది ఇదే - ఎందుకంటే ?
బైక్ ఆన్ చేసి గదిలో ఉంచితే ప్రాణాలు మిగలవు - పుంగనూరు ఘటనలో జరిగింది ఇదే - ఎందుకంటే ?

వీడియోలు

IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam
AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Tamil Interview: విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
Drug Test in Telangana Assembly: డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
Jaripey Song: లిరిక్స్‌లో డబుల్ మీనింగ్స్... ఆ వల్గర్ స్టెప్పులేంటి? - యూట్యూబ్‌లో సాంగ్ డిలీట్
లిరిక్స్‌లో డబుల్ మీనింగ్స్... ఆ వల్గర్ స్టెప్పులేంటి? - యూట్యూబ్‌లో సాంగ్ డిలీట్
Ustaad Bhagat Singh: 'ఉస్తాద్...' కోసం 'తొలిప్రేమ' సాంగ్ రీమిక్స్... ట్రైలర్‌లో హింట్
'ఉస్తాద్...' కోసం 'తొలిప్రేమ' సాంగ్ రీమిక్స్... ట్రైలర్‌లో హింట్
Salim Khan Discharged: ఆసుపత్రి నుంచి సల్మాన్ తండ్రి డిశ్చార్జ్... నెల తర్వాత ఇంటికి సలీం ఖాన్
ఆసుపత్రి నుంచి సల్మాన్ తండ్రి డిశ్చార్జ్... నెల తర్వాత ఇంటికి సలీం ఖాన్
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam
Ramzan 2026: ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. 10 వేల ఖాతాల్లోకి నగదు జమ
ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. 10 వేల ఖాతాల్లోకి నగదు జమ
BRS On Rohit Reddy: మొయినాబాద్ డ్రగ్స్ కేసు- రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు
మొయినాబాద్ డ్రగ్స్ కేసు- రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు
Embed widget