అన్వేషించండి

PM Modi Visits Vantara: సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ

గుజరాత్‌లోని వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. అక్కడ ఆసియా సింహాలు, చిరుతలు, ఇతర జంతువులను ఆయన పరిశీలించారు. సంరక్షకులు, సిబ్బందితో మాట్లాడారు.

PM Modi inaugurates Vantara | గుజరాత్‌లోని వంతారా  జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇవాళ ఈ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని...అక్కడ జంతువులతో చాలా సమయం గడిపారు. వంతారా అనేది అడవి ప్రాణుల రక్షణ, పునారావాసం, సంరక్షణ కోసం ప్రారంభించిన  ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రం. ఈ కేంద్రంలో 2,000కి పైగా జాతులకు చెందిన  1,50,000 కు పైగా జీవులు ఉన్నాయి. ఈ పర్యటనలో ప్రధాని  ఆ కేంద్రం మొత్తాన్ని సందర్శించి చాలా చోట్ల ఆగి జంతువులతో సమయం గడిపారు. వన్యప్రాణులతో సంభాషించారు.

వంతరాలోని వైల్డ్‌లైఫ్ హాస్పిటల్‌ను సందర్శించిన మోదీ, అక్కడ ఏర్పాటు చేసిన అధునాతన వెటర్నరీ సౌకర్యాలను పరిశీలించారు. ఇందులో MRI, CT స్కాన్ యంత్రాలు, ఐసీయూలు, వైల్డ్‌లైఫ్ అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్ వంటి ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. ఈ కేంద్రంలోని ఆసియాటిక్ సింహం పిల్లలు, తెల్ల సింహం పిల్ల,  అరుదైన క్లౌడెడ్ లెపర్డ్ పిల్ల, కరికల్ పిల్ల సహా పలు జంతువులతో ఆడుతూ... వాటికి ఆహారం పెట్టారు. మోదీ ఆహారం పెట్టిన తెల్ల సింహం పిల్ల వంతరాలోనే  జన్మించింది.  దాని తల్లిని రక్షించి ఇక్కడ సంరక్షణ కోసం తీసుకొచ్చారు.


PM Modi Visits Vantara: సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ

కేవలం జంతువులతో ప్రేమగా సంభాషించడమే కాకుండా.. అక్కడ ఉన్న అధునాతన వైద్య సదుపాయాలను కూడా పరిశీలించారు.  అక్కడ MRI స్కాన్ చేయించుకుంటున్న ఆసియాటిక్ సింహాన్ని చూశారు. అలాగే, ఓపరేషన్ థియేటర్‌లో, రహదారిపై వాహనం ఢీకొట్టి గాయపడిన చిరుతపులిని వైద్యులు అత్యవసరంగా శస్త్రచికిత్స చేస్తుండగా పరిశీలించారు. వంతరాలో సంరక్షిస్తున్న  జంతువులన్నింటినీ  వాటి సహజ నివాసాలకు దగ్గరగా అనుభూతి కలిగించే విధంగా ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ప్రదేశాల్లో ఉంచారు.

గోల్డెన్ టైగర్‌తో ఫేస్ టు ఫేస్ 

ఈ పర్యటనలో మోదీ అనేకమైన క్రూర జంతువులతో చాలా సన్నిహితంగా మెలిగారు. ఆయన గోల్డెన్ టైగర్‌తో పాటు.. సర్కస్ నుంచి తీసుకొచ్చిన స్నో టైగర్‌లు, తెల్లసింహం, స్నో లెపర్డ్‌లతో ఆయన చాలా ఆహ్లాదకరమైన సమయాన్ని గడిపారు. ఒకాపీని ప్రేమగా , ఒకప్పుడు తాను పెంచుకున్న Chimpanzeesను కలుసుకుని, ఓరంగుటాన్‌తో ఆడిపాడారు. అదే విధంగా ఓ జిరాఫీకి,  ఒంటికొమ్ము ఉన్న రైనో పిల్లకు ఆహారం అందించారు. ఈ రైనో తల్లి ఇదే కేంద్రంలో చనిపోయింది. 


PM Modi Visits Vantara: సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ

అంతేకాదు, ప్రధానమంత్రి నీటిలో ఈత కొడుతున్న హిప్పోను, మొసళ్ళను, జీబ్రాలను గమనించారు. ఈ కేంద్రంలో పెద్ద జంతువులే కాకుండా కొన్ని అరుదైన పాములు, తాబేళ్లు వంటివి కూడా ఉన్నాయి. మోదీ ఓ పెద్ద కొండ చిలువతో పాటు, అరుదైన రెండు తలల పాము, రెండు తలల తాబేలు, టపిర్, వ్యవసాయ పొలాల్లో నుంచి సంరక్షించి తీసుకొచ్చిన చిరుత పిల్లలు, సీల్స్ వంటి ఎన్నో అరుదైన జాతులను దగ్గరగా చూశారు. 

అతిపెద్ద ఏనుగుల హాస్పిటల్ 
హస్తి ఆసుపత్రిని  సందర్శించిన మోదీ, అక్కడ గజరాజులకు ఏర్పాటు చేసిన హైడ్రోథెరపీ ప్రోగ్రామ్‌ను చూశారు. ఏనుగులకు  మోకాళ్ళ నొప్పులు, కాళ్ల సమస్యలను తగ్గించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన Jacuzzi లో ఏనుగులు ఎంజాయ్ చేయడాన్ని ప్రధాని ఆసక్తిగా తిలకించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏనుగుల ఆసుపత్రి.  


PM Modi Visits Vantara: సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ

ఇక చివరిగా వంతారా ఆనవాయితీ ప్రకారం.. సంరక్షించిన చిలుకలను ఆయన అడవిలోకి విడిచిపెట్టారు. ఆ తర్వాత వంతరా కేంద్రంలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది, కార్మికులతో ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget