అన్వేషించండి

PM Kisan Yojana Latest News: పీఎం కిసాన్ యోజన 21వ విడతపై ఉత్కంఠ.. రైతుల ఖాతాల్లో నగదు జమ ఎప్పుడో తెలుసా..

PM Kisan Yojana Scheme | పీఎం కిసాన్ యోజన 21వ విడత నవంబర్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. రైతులు రెండు పనులు త్వరగా పూర్తిచేయాలని సూచించారు.

PM Kisan Yojana 21st Installment | భారత ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. వాటిలో ముఖ్యమైనది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Yojana). ఈ పథకం దేశంలోని చిన్న, సన్నకారు రైతుల ఆర్థిక సహాయం కోసం రూపొందించారు. దీని ద్వారా రైతులు వ్యవసాయానికి సంబంధించిన చిన్న చిన్న అవసరాలను తీర్చుకోగలుగుతారు. ఈ కిసాన్ యోజన పథకం కింద, ప్రతి సంవత్సరం రైతుల బ్యాంకు ఖాతాలో రూ.6 వేల ఆర్థిక సహాయం జమ చేస్తారు. 

సంవత్సరానికి 3 వాయిదాలలో కేంద్రం ఆ నగదును అందిస్తుంది. ఈ సంవత్సరం 20వ వాయిదాను ఆగస్టు 2, 2025న విడుదల చేశారు. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలోని వరద ప్రభావిత లక్షలాది మంది రైతుల ఖాతాలో 21వ వాయిదా డబ్బులు ఇప్పటికే జమయ్యాయి. దేశంలోని మిగిలిన రాష్ట్రాల రైతులు ఇప్పటికీ పీఎం కిసాన్ యోజన 21వ వాయిదా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు వారి ఖాతాల్లో రూ.2000 జమ చేస్తుందా అని తెలుసుకోవాలి అనుకుంటున్నారు. 

నవంబర్ మొదటి వారంలో వాయిదా రావచ్చా?

ప్రభుత్వం 4 నెలల వ్యవధిలో వాయిదాను పంపుతుంది. గత వాయిదాను పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం తదుపరి అంటే 21వ వాయిదాను నవంబర్ నెల మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇంకా ఈ తేదీని అధికారికంగా ప్రకటించలేదు. దీపావళి సందర్భంగా పీఎం కిసాన్ నగదు ఖాతాల్లో జమ చేస్తారని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది.

తమ బ్యాంకు ఖాతా, ఆధార్, ఇతర వివరాలను అప్‌డేట్ చేసిన రైతులకు త్వరలో 21వ విడత పీఎం కిసాన్ నగదు లభించవచ్చు. తాజా విడత నగదు విడుదల చేయడానికి ముందు, ప్రభుత్వం పథకానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లో లబ్ధిదారుల పూర్తి సమాచారాన్ని షేర్ చేస్తుందని మీకు తెలిసిందే. ఈసారి కూడా వాయిదా విడుదల చేయడానికి ముందు వెబ్‌సైట్‌లో సమాచారం అందుబాటులో ఉంచనుంది. 

రైతులు రెండు పనులు చేయడం ముఖ్యం

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Yojana)లో ప్రయోజనం పొందడానికి కేంద్ర ప్రభుత్వం 2 పనులు చేయడం తప్పనిసరి చేసింది. వీటిలో భూమి రికార్డుల ధృవీకరణ, E KYC ఉన్నాయి. ఈ రెండు ముఖ్యమైన పనులు చేయని రైతులకు తదుపరి వాయిదా నగదు రూ.2 వేలు లభించదు.

ఈ-కెవైసి చేయడం చాలా సులభం. దీని కోసం రైతులు పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ని సందర్శించి ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. భూమి ధృవీకరణ కోసం, మీ రాష్ట్రంలోని అధికారిక భూ రికార్డుల పోర్టల్‌ను సందర్శించాలి. అక్కడ మీరు మీ భూమికి సంబంధించిన నిర్ధారణ చేయవచ్చు. 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Advertisement

వీడియోలు

India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
Hyderabad Crime News: సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం
సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం
The Raja Saab Story : అసలు 'రాజా సాబ్' ఎవరు? - నానమ్మ... నేను... ఓ విలన్ - డార్లింగ్ ప్రభాస్ క్యూట్ లీక్స్
అసలు 'రాజా సాబ్' ఎవరు? - నానమ్మ... నేను... ఓ విలన్ - డార్లింగ్ ప్రభాస్ క్యూట్ లీక్స్
Embed widget